Lottery: యూఏఈలో భారతీయులకు రూ.20 కోట్ల లాటరీ

హైపర్‌మార్కెట్‌లో పనిచేస్తున్న 40 మంది బృందానికి రూ.20.26కోట్ల విలువైన లాటరీ తగిలింది.

Updated : 05 Oct 2021 13:51 IST

దుబాయ్‌: హైపర్‌మార్కెట్‌లో పనిచేస్తున్న 40 మంది బృందానికి రూ.20.26కోట్ల విలువైన లాటరీ తగిలింది. వీరిలో ఇద్దరు బంగ్లాదేశీయులు కాగా మిగిలిన అందరూ భారతీయులే. ఒకే గదిలో నివసిస్తున్న వీరందరూ కలిసి కేరళకు చెందిన నహీల్‌ నిజాముద్దీన్‌ పేరుతో యూఏఈలో లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశారు. కరోనా నేపథ్యంలో నహీల్‌ నిజాముద్దీన్‌ను స్వదేశానికి తిప్పి పంపించారు. దీంతో లాటరీ నిర్వాహకులు నహీల్‌ను సంప్రదించలేకపోయారని ఖలీజ్‌టైమ్స్‌ పత్రిక తెలిపింది. నహీల్‌ ఇచ్చిన తల్లిదండ్రుల ఫోన్‌ నంబరు ఆధారంగా లాటరీ గెల్చుకున్న విషయాన్ని నిర్వాహకులు తెలియజేశారని పత్రిక పేర్కొంది. లాటరీ ద్వారా లభించిన మొత్తాన్ని 40 మంది పంచుకోనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని