త్వరలో అమెరికాలో పీవీ విగ్రహావిష్కరణ  

అమెరికాలోని అట్లాంటాలో మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు విగ్రహాన్ని త్వరలో ఆవిష్కరించనున్నట్లు పీవీ శతజయంత్యుత్సవ కమిటీ ఛైర్మన్‌ కె.కేశవరావు..

Published : 06 Oct 2021 12:24 IST

హైదరాబాద్‌: అమెరికాలోని అట్లాంటాలో మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు విగ్రహాన్ని త్వరలో ఆవిష్కరించనున్నట్లు పీవీ శతజయంత్యుత్సవ కమిటీ ఛైర్మన్‌ కె.కేశవరావు తెలిపారు. విగ్రహ ప్రతిష్ఠాపనపై మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన సమావేశం నిర్వహించారు. కమిటీ సభ్యులు పీవీ ప్రభాకర్‌రావు, మహేశ్‌ బిగాల, చంద్రశేఖర్, అమెరికా ప్రతినిధి పాడి శర్మలు ఇందులో పాల్గొన్నారు. విగ్రహం తయారీ, ఆవిష్కణ తేదీ, కార్యక్రమ నిర్వహణ గురించి చర్చించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని