US: అగ్రరాజ్య పేదలకు అన్నదానమే ఆధారం
పేరుకు అగ్రరాజ్యమే అయినా... అక్కడి పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు రోజు గడవడం కోసం
దిగువ మధ్యతరగతి వారిని ఆదుకుంటున్న స్వచ్ఛంద సంస్థలు
‘డెల్టా’ విజృంభిస్తే సగటు జీవికి ఆహార బ్యాంకులే దిక్కు!
వాషింగ్టన్: పేరుకు అగ్రరాజ్యమే అయినా... అక్కడి పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు రోజు గడవడం కోసం అన్నదాన శిబిరాలపై ఆధారపడక తప్పడం లేదు! కొవిడ్ ఉద్ధృతి నెమ్మదించి, టీకా కార్యక్రమం ఊపందుకోవడంతో వ్యాపారాలు, ఉద్యోగాలు క్రమంగా గాడిన పడుతున్నాయి. దీంతో ఆహార బ్యాంకులపై ఆధారపడేవారి సంఖ్య ఆరు నెలలుగా తగ్గుతూ వస్తోంది. అయినప్పటికీ, కొవిడ్ ముందునాళ్లతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితి తీవ్రత 55% ఎక్కువగానే ఉన్నట్టు ‘ఫీడింగ్ అమెరికా’ స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యనిర్వాహకురాలు కేటీ ఫిట్జరాల్డ్ చెప్పారు. అమెరికా వ్యాప్తంగా 200కు పైగా ఆహార బ్యాంకులను ఈ సంస్థ సమన్వయం చేస్తోంది. మహమ్మారి కారణంగా దేశంలో గడ్డు పరిస్థితులు తలెత్తడంతో ప్రభుత్వం నిరుద్యోగులకు భృతి ఇస్తోంది. ఉద్యోగాలు, వ్యాపారాలు కోల్పోయినవారిని బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయించకూడదని ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఈ రక్షణల గడువు త్వరలో ముగియనుండటంతో చాలామంది పేదలకు మళ్లీ ఆహార బ్యాంకులే దిక్కవుతాయని భావిస్తున్నారు.
సర్కారీ ఆహార స్టాంపులు...
అల్పాదాయ, అసలు ఆదాయమే లేని కుటుంబాలకు బైడెన్ సర్కారు అనుబంధ పోషకాహార పథకం (శ్నాప్) కింద ఫుడ్ స్టాంపులు అందిస్తోంది. వాటిని ఉపయోగించి ఆహారం కొనుగోలు చేయవచ్చు. 2019లో ఈ స్టాంపులు అందుకున్నవారితో పోలిస్తే 2021లో వారి సంఖ్య 70 లక్షల మేర పెరిగింది. వ్యవసాయశాఖ అమలుచేసే ఈ పథకం కింద సౌకర్యాలను అక్టోబరు నుంచి 25% పెంచుతున్నట్టు అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. శ్నాప్ కింద 14% మంది వయోజనులు ఆహార స్టాంపులు పొందారనీ, వీరి సంఖ్య ఇటీవల 8 శాతానికి తగ్గిందని వ్యవసాయ మంత్రి టామ్ విల్సాక్ వివరించారు. ఈ పథకం కటిక పేదరికంలో మగ్గుతున్నవారి కోసం ఉద్దేశించింది కాబట్టి, ఉపాధి కోల్పోయిన మధ్యతరగతి ప్రజలు దీని కింద ప్రయోజనం పొందలేకపోతున్నారు. దీంతో వీరిని స్వచ్ఛంద, దానధర్మ సంస్థలు ఆదుకుంటున్నాయి. ప్రమాదకర డెల్టా వేరియంట్ కారణంగా దుకాణాలు, పరిశ్రమలు, బడులు మళ్లీ మూతపడితే.. సగటు అమెరికన్లు చాలామంది అన్నదానంపై ఆధారపడక తప్పదని భావిస్తున్నారు.
మహిళలే అధికం...
ఫీడింగ్ అమెరికా ఛత్రం కింద నడుస్తున్న ఆహార బ్యాంకులు గత ఏడాది మార్చిలో 110 కోట్ల పౌండ్ల ఆహారాన్ని పంపిణీ చేశాయి. ఈ ఏడాది మార్చిలో 60 లక్షల పౌండ్లు, ఆగస్టులో 46 లక్షల పౌండ్లు మేర ఆహారాన్ని అందించాయి. 2019 జూన్లో ఆహార బ్యాంకులు కేవలం 27 లక్షల పౌండ్ల ఆహారాన్నే పంపిణీ చేశాయని, ప్రస్తుతం అంతకంటే ఎక్కువ మొత్తంలోనే ఆహార పదార్థాలను అందించాల్సి వస్తోంది. ‘‘ఆదాయాలు భారీగా తగ్గడం వల్ల చాలామంది మధ్యతరగతి వారు ఆహార బ్యాంకులపై ఆధారపడుతున్నారు. ఇలాంటివారిలో ఎక్కువమంది మహిళలే. కొవిడ్ ఇప్పట్లో ముగిసేలా లేదు కాబట్టి అన్నదాన శిబిరాలను కొనసాగించక తప్పదు’’ అని వాషింగ్టన్ డి.సిలో క్యాపిటల్ ఏరియా ఫుడ్ బ్యాంకు నడుపుతున్న రాధా ముత్తయ్య చెప్పారు. 2019 జూలైతో పోలిస్తే ఈ ఏడాది జూలైలో 64% ఎక్కువగా ఆహారాన్ని పంపిణీ చేసినట్టు ఆమె వివరించారు. వచ్చే వేసవి వరకూ అన్నదాన శిబిరాలను కొనసాగించాల్సిన పరిస్థితి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే బైడెన్ ప్రభుత్వం ఉచిత ఆహార బ్యాంకులను ప్రోత్సహిస్తోంది. పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులను భద్రపరిచేందుకు అవసరమైన శీతల గిడ్డంగులను, ట్రక్కులను సమకూర్చుకునేందుకు గత జూన్లోనే సుమారు 100 కోట్ల డాలర్లు కేటాయించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
పశ్చిమ్ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి ఆరోపణలు గుప్పించారు. -
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ (Modi) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. వాటిపై అందిన ఫిర్యాదు ఈసీ పరిశీలనలో ఉందని సమాచారం. -
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. -
నూడుల్స్లో రూ.6 కోట్ల బంగారం, వజ్రాలు!
నూడుల్స్లో వజ్రాలు, బంగారం దాచి అక్రమ రవాణాకు పాల్పడిన నలుగురు ప్రయాణికులను ముంబయి కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. -
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ
వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్ నియమితులయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?