మెక్సికోలో డ్రగ్స్‌ ముఠా కాల్పులు.. ప్రవాస భారతీయురాలి మృతి

30వ పుట్టినరోజు పండుగను ఘనంగా నిర్వహించుకునే 

Published : 24 Oct 2021 14:55 IST

లాస్‌ఏంజెలెస్‌: 30వ పుట్టినరోజు పండుగను ఘనంగా నిర్వహించుకునే ఉద్దేశంతో మెక్సికో వెళ్లిన భారతీయ అమెరికన్‌ అంజలి ర్యోట్‌ అనూహ్య రీతిలో మాదక ద్రవ్యాల ముఠాల కాల్పులకు బలైపోయారు. బుధవారం రాత్రి ఆమె తన భర్త ఉత్కర్ష్‌తో కలిసి ఒక రెస్టారెంట్లో భోజనం చేస్తున్నప్పుడు సమీపంలో డ్రగ్స్‌ ముఠాలు పరస్పర కాల్పులకు తెగబడ్డాయి. తూటాలు దూసుకురావడంతో అక్కడ ఉన్నవారిలో అంజలితో పాటు జర్మనీ పర్యాటకురాలు ప్రాణాలు కోల్పోయారు. గతంలో యాహూలో, ప్రస్తుతం లింక్డ్‌ఇన్‌లో సీనియర్‌ ఇంజినీర్‌గా ఉన్న అంజలి కాలిఫోర్నియా వాసి. ప్రయాణాలను ఇష్టపడే ఆమె బ్లాగర్‌ కూడా. ఆమె తల్లిదండ్రులు హిమాచల్‌ప్రదేశ్‌ వాస్తవ్యులు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని