డిసెంబరు నుంచి అమెరికా పర్యాటక వీసాలు
అమెరికా పర్యాటక వీసాలను డిసెంబరు నుంచి జారీచేయనున్నట్లు దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో వీసా వ్యవహారాలను పర్యవేక్షించే మినిస్టర్ కౌన్సెలర్ డాన్ హెఫ్లిన్ తెలిపారు.
అత్యవసర వినియోగ టీకా వేయించుకున్నా అనుమతి
మినిస్టర్ కౌన్సెలర్ డాన్ హెఫ్లిన్ వెల్లడి
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: అమెరికా పర్యాటక వీసాలను డిసెంబరు నుంచి జారీచేయనున్నట్లు దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో వీసా వ్యవహారాలను పర్యవేక్షించే మినిస్టర్ కౌన్సెలర్ డాన్ హెఫ్లిన్ తెలిపారు. డిసెంబరు మొదటి వారం నుంచి ఈ వీసాలకు దరఖాస్తులు తీసుకుంటామన్నారు. అమెరికా వెళ్లేందుకు ఉన్న ఆంక్షలను గత సోమవారం నుంచి పూర్తిగా ఎత్తివేసిన నేపథ్యంలో వీసా వ్యవహారాలపై పలువురు అడిగిన ప్రశ్నలకు బుధవారం ఆయన ఫేస్బుక్ ద్వారా సమాధానాలు ఇచ్చారు. ‘‘ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూఎస్ఎఫ్డీఏ ఆమోదించిన, అధికారిక గుర్తింపు పొందిన అన్ని టీకాలతో పాటు కొన్ని దేశాల్లో అత్యవసర వినియోగంలో భాగంగా అనుమతించిన టీకాలు(రెండు డోసులు) వేసుకున్న వారికి అమెరికా వెళ్లేందుకు అనుమతి ఉంది’’ అని డాన్ హెఫ్లిన్ స్పష్టం చేశారు.
కరోనా నెగిటివ్ ధ్రువపత్రం తప్పనిసరి
* రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిన సర్టిఫికెట్తో పాటు ప్రయాణానికి మూడు రోజుల ముందు నుంచి కొవిడ్ బారిన పడలేదని నిర్ధారించే ధ్రువీకరణ అవసరం. కొవిడ్ నెగిటివ్ ధ్రువపత్రాన్ని బోర్డింగ్కి ముందే విమానాశ్రయంలో చూపించాలి. ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్న వారు ఈ విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
* వీసాల కోసం ఫీజులు చెల్లించిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారికి వీలైనంత త్వరగా అపాయింట్మెంట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కరోనా సమయంలో ఫీజు చెల్లించినా.. వీసా ఇంటర్వ్యూకు హాజరుకాని వారికి.. 2023 సెప్టెంబరు 30 వరకు ఆ ఫీజు చెల్లుబాటయ్యేలా పొడిగింపు ఇచ్చాం.
* వీసా పునరుద్ధరించుకునే వారు డ్రాప్బాక్స్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. దిల్లీలోని రాయబార కార్యాలయంతోపాటు ముంబయి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్కతాలోని అమెరికా కాన్సులేట్ కార్యాలయాల్లో ఈ సేవలు పొందవచ్చు. ప్రస్తుతం డ్రాప్బాక్స్ అపాయింట్మెంట్లు తక్కువగా అనుమతిస్తున్నాం. కాన్సుల్ కార్యాలయాన్ని సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మీ ప్రాంతానికి సమీపంలో ఉన్న కాన్సులేట్ కార్యాలయ వెబ్సైట్లలోనూ ఈ సమాచారం అందుబాటులో ఉంటుంది.
తొలి డోసు అమెరికాలో.. ఇప్పుడు భారత్లో రెండో డోసు ఎలా?
- ‘అమెరికాలో ఉన్న సమయంలో ఫైజర్ తొలిడోసు తీసుకున్నా. ఆ తరువాత దిల్లీ వచ్చి ఉండిపోయా. రెండో డోసు తీసుకోలేకపోయా. ఇప్పుడు అమెరికా వెళ్లటం ఎలా’ అన్న ప్రశ్నకు హెఫ్లిన్ సమాధానం ఇస్తూ.. మరో వ్యాక్సిన్ ఏదైనా రెండో డోసుగా తీసుకోవచ్చేమో నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. అదీ గుర్తింపు పొందిన టీకా అయి ఉండాలి. టీకా ధ్రువీకరణ పత్రాన్ని వీసా దరఖాస్తు సమయంలోనే చూపించాలి. ఆధార్ సంఖ్య ఉంటే సంపూర్ణ వ్యాక్సినేషన్ అయిందా? లేదా? తెలుస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోఇసీలో వైభవంగా ఉగాది వేడుకలు
అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్