గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా బాలల దినోత్సవం
గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో బాలల దినోత్సవం ఘనంగా జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 65కు పైగా తెలుగు సంఘాల
గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో బాలల దినోత్సవం ఘనంగా జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 65కు పైగా తెలుగు సంఘాల భాగస్వామ్యంతో.. 25 దేశాలలోని తెలుగు పిల్లలతో వర్చువల్ పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. "బాలల చేత - బాలల కోసం" అంటూ 12 గంటలపాటు నిర్విరామంగా ఈ వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తమ సందేశాన్ని పంపించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ముందు తరాలకు అందజేసే క్రమంలో ముందుగా మన కట్టు, బొట్టు, ఆట, పాట, పండుగలు, పబ్బాలను పిల్లలకు పరిచయం చేయాలని... దానికి బాలల దినోత్సవం లాంటి సందర్భాన్ని వినియోగించుకోవడం సంతోషమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా మన సంస్కృతికి మూలమైన మాతృ భాషను పిల్లలకు నేర్పించాలని, మన శతక పద్యాలు, కథలు వారికి తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమ స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని సంస్థలు విద్యార్థులను మనవైన విలువలతో తీర్చిదిద్దే విధంగా ముందుకు సాగాలని కోరుతూ నిర్వాహకులకు అభినందనలు తెలియచేస్తూ పిల్లలందరికి ఉపరాష్ట్రపతి ఆశీస్సులు అందజేశారు.
ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ఏపీ మాజీ ఉపసభాపతి మండలి బుద్దప్రసాద్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో 300 మందికి పైగా వివిధ దేశాల్లో ఉంటున్న తెలుగు పిల్లల ప్రదర్శనలు అద్భుతంగా ఉన్నాయన్నారు. ఇలాంటి పిల్లల పండుగను నిర్వహించిన నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. గౌరవ అతిథిగా పాల్గొన్న గుమ్మడి గోపాల కృష్ణ మాట్లాడుతూ విదేశాల్లో ఉన్నా.. మన సంస్కృతి సంప్రదాయాలు, భాషను మర్చిపోకుండా పూర్తిగా పిల్లలతో ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించటం సంతోషమన్నారు. వారి ప్రదర్శనలను తిలకించి మైమరచి పోయానన్నారు. మరొక అతిథిగా విచ్చేసిన వంశీ ఇంటర్నేషనల్ అధినేత రామ రాజు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, పిల్లలతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటం.. అన్నిరకాల ప్రదర్శనలు చేయటం అద్భుతమని కొనియాడారు.
ఇంకా అతిథులుగా మారిషస్ నుంచి సంజీవ నరసింహ అప్పడు, మలేసియా తెలుగు సంఘం అధ్యక్షులు డాక్టర్ ప్రతాప్, సింగపూర్ శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు రత్నకుమార్, శుబోదయం ఇన్ఫ్రా ఛైర్మన్ లక్ష్మీప్రసాద్, తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమ నిర్వాహకులు కుదరవల్లి సుధాకర రావు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన 65 తెలుగు సంఘాల అధ్యక్షులకు, ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని పిల్లల కోసం రెండు గ్రూపులుగా (5 నుంచి 10 సంవత్సరాలు, 11 నుంచి 16 సంవత్సరాలు) నిర్వహించిన క్యిజ్ పోటీల విజేతలని ప్రకటించారు. ఇంతటి భారీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ముఖ్యపాత్రను పోషించిన విక్రం సుఖవాసి, వెంకప్ప భాగవతుల, ప్రదీప్ కుమార్, ఎం.బి. రెడ్డి, గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్యలోని భాగస్వామ్య సంఘాల అధ్యక్షులకు, వారి కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య స్పాన్సర్గా స్విఫ్ లెర్న్ సంస్థ, ప్లాటినం స్పాన్సర్గా శుబోదయం ఇన్ఫ్రా, గోల్డ్ స్పాన్సర్గా కుదరవల్లి ఫౌండేషన్ తమ సహాయ సహకారాలు అందించాయి. మీడియా భాగస్వాములుగా కువైట్ ఆంధ్రా, మాగల్ఫ్ వ్యవహరించగా.. సాంకేతిక సహకారాన్ని సింగపూర్ సంస్థ ఆర్కే మీడియా అందించింది.
తెలుగు సంఘాల ఐక్య వేదిక కువైట్ అధ్యక్షులు కుదరవల్లి సుధాకర రావు, సౌదీ తెలుగు అసోసియేషన్ అధ్యక్షురాలు దీపిక రావి, తెలుగు కళా సమితి ఒమన్ అధ్యక్షులు అనిల్ కుమార్ కడించెర్ల, ఆంధ్ర కళా వేదిక ఖతార్ అధ్యక్షులు సత్యనారాయణ మలిరెడ్డి, ఫుజైరా తెలుగు కుటుంబాల అధ్యక్షులు వేద మూర్తి, తెలుగు తరంగిణి రాస్ అల్ ఖైమా అధ్యక్షులు వెంకట సురేశ్.. పిల్లలు జీవితంలో అలవర్చుకోవాల్సిన వివిధ అంశాలైన క్రమశిక్షణ, నిజాయతీ, ఆత్మ విశ్వాసం, సానుకూల దృక్పథం, సహాయం చేయడం, జ్ఞానము, ఏకాగ్రత లాంటి ప్రేరణ కలిగించే అంశాలమీద ప్రసంగించి వారిని ఉత్తేజ పరిచారు. ఈ 12 గంటల కార్యక్రమానికి పిల్లలే వ్యాఖ్యాతలుగా ఉండటం ప్రతేక ఆకర్షణగా నిలిచింది. పిల్లలచే వివిధ అంశాలమీద చర్చా వేదికలు, ప్రసంగాలు ఆకట్టుకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తొలి వార్షిక సదస్సు ఘనంగా నిర్వహించాలని ‘మాటా’ బోర్డు నిర్ణయం
వచ్చే ఏడాది ఏప్రిల్ 13, 14 తేదీలలో న్యూజెర్సీలో రాయల్ అల్బర్ట్ ప్యాలెస్లో 'మాటా' తొలి వార్షిక సదస్సును ఘనంగా నిర్వహించాలని బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. -
‘చంద్రమోహనునికి ప్రపంచవ్యాప్తంగా ఘన నివాళి’
ప్రముఖ సినీనటుడు చంద్రమోహన్కు వంశీ ఇంటర్నేషనల్, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. -
Hongkong: హాంకాంగ్ తెలుగు సామాఖ్య ఆధ్వర్యంలో కార్తిక వనభోజనాలు
హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ట్యూన్ మున్ కంట్రీ పార్కులో కార్తిక మాస వనభోజనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. -
శివపదం గీతాలకు బాలిలో అద్భుత నృత్య ప్రదర్శన
శివపదం గ్లోబల్ ఫ్యామిలీ ఇండోనేషియాలోని బాలిలో భారతీయ శాస్త్రీయ నృత్యాలను ప్రదర్శించింది. తద్వారా ఏకత్వ సందేశాన్ని, కళలకు సరిహద్దులు లేవని చాటి చెప్పింది -
H-1B visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్న్యూస్.. ఇక అమెరికాలోనే వీసా రెన్యువల్!
H-1B visa: అమెరికాలో పనిచేస్తున్న భారత టెక్ నిపుణులకు అగ్రరాజ్యం గుడ్న్యూస్ చెప్పింది. స్వదేశాలకు వెళ్లకుండానే ఎన్నారైలు తమ హెచ్-1బీ వీసాలను రెన్యువల్ చేసుకునేలా ఓ పైలట్ ప్రోగ్రామ్ను డిసెంబరు నుంచి అందుబాటులోకి తీసుకొస్తోంది. -
NRI: న్యూజెర్సీలో వైభవంగా కార్తిక పౌర్ణమి వేడుకలు.. పాల్గొన్న సింగర్ మంగ్లీ
అమెరికాలో.. న్యూజెర్సీలోని సాయిదత్తా పీఠం శ్రీ శివ విష్ణు దేవాలయంలో కార్తిక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. సాయిదత్త పీఠం నిర్వాహకులు రఘుశర్మ శంకరమంచి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా సింగర్ మంగ్లీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె శివుడి పాట పాడారు. మంగ్లీ ఆలపించిన పాటతో భక్తులు మంత్ర ముగ్ధులయ్యారు.
-
శివ నామస్మరణతో మార్మోగిన లిమెరిక్ నగరం
కార్తిక మాసం సందర్భంగా ఐర్లాండ్లోని లిమెరిక్ నగరం శివనామస్మరణతో మార్మోగింది. -
ఉత్సాహంగా తానా ‘నెల నెలా తెలుగు వెలుగు’ సాహిత్య సభ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహిత్య విభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘నెల నెలా తెలుగు వెలుగు’ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. -
సింగపూర్లో భక్తి శ్రద్ధలతో కార్తిక వన భోజనాలు
వాసవి క్లబ్ మెర్లియన్ సింగపూర్ ఆధ్వర్యంలో కార్తిక వన భోజనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. -
తాకా ఆధ్వర్యంలో కెనడాలో ఘనంగా దీపావళి వేడుకలు
తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా (TACA) ఆధ్వర్యంలో నవంబరు 18న కెనడాలోని గ్రేటర్ టోరొంటో మిస్సిస్సౌగ ఫీల్డ్ గేట్ ఉన్నత పాఠశాలలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. -
NRI: కెనడాలోని టొరొంటోలో ప్రవాసాంధ్రుల దీపావళి సంబరాలు
కెనడాలోని టొరొంటోలోని తెలుగువారు దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దాదాపు 800 ఎన్నారై కుటుంబాలు ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా సంప్రదాయ నృత్యం కూచిపూడి ప్రదర్శించారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా వివిధ కార్యక్రమాలతో చిన్నారులు, కళాకారులు అలరించారు.
-
India-Canada: కెనడియన్లకు ఈ-వీసా సేవల పునరుద్ధరణ.. జీ20 భేటీ వేళ భారత్ కీలక నిర్ణయం!
India-Canada: కెనడా పౌరులకు ఈ-వీసా సేవల (E-Visa Services)ను భారత్ పునరుద్ధరించినట్లు తెలుస్తోంది. దీంతో కెనడియక్లకు అన్ని రకాల వీసా సేవలను అందుబాటులోకి తెచ్చినట్లైంది. -
టాస్-యూకే ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి వేడుకలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్-యూకే (టాస్-యూకే) ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. -
కెనడా డీటీసీ ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి సంబరాలు
కెనడాలోని టొరంటో నగరంలో డుర్హం తెలుగు క్లబ్ (డీటీసీ) ఆధ్వర్యంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
యూఏఈ తెలుగు అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
యూఏఈ తెలుగు అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం దుబాయిలోని రాయల్ కాంకర్డ్ హోటల్లో నిర్వహించినట్లు సంఘం మీడియా డైరెక్టర్ అబ్దుల్ ఫహీమ్ షేక్ ఓ ప్రకటనలో తెలిపారు. -
హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి వేడుకలు
ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
Qatar: ఖతార్లో కార్తికమాస వనభోజనాలు..పెద్ద సంఖ్యలో హాజరైన ప్రవాసులు
ఖతార్లో కార్తిక మాస వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.దీనికి పెద్ద ఎత్తున ప్రవాస భారతీయులు హాజరయ్యారు. -
Chandrababu: అక్రమ కేసుల నుంచి చంద్రబాబు బయటపడాలని ఆకాంక్షిస్తూ శాంతిహోమం
అక్రమ కేసుల నుంచి తెదేపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కడిగిన ముత్యంలాగా బయటకు రావాలని ఆకాంక్షిస్తూ ఫిలడెల్ఫియాలో శాంతి హోమం నిర్వహించారు. -
పలు సేవల కోసం ప్రవాసులకు సభ్యత్వం ప్రారంభించిన ‘స్వదేశం’
ప్రవాసులకు సేవలు అందిస్తున్న ‘స్వదేశం’ (swadesam) సంస్థ మెంబర్షిప్ ప్రారంభించింది. దీనికి సంబంధించి డిజిటల్ ఐడీ కార్డులను అందించబోతోంది. దీనివల్ల ‘స్వదేశం’ సభ్యత్వం తీసుకున్న వారికి మరింత వేగంగా తమ సేవలు అందించడం సులువవుతుందని నిర్వాహకులు స్వాతి తెలిపారు. -
ఘనంగా సింగపూర్ తెలుగు సమాజం 49వ ఆవిర్భావ వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. అక్కడి సీనియర్ సిటిజన్లతో సరదాగా గడిపి వారి అనుభవాలను తెలుసుకున్నారు. -
కాన్సాస్లో తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ (TAGKC) ఆధ్వర్యంలో స్థానిక బ్లూ వ్యాలీ నార్త్ హైస్కూలో ఘనంగా దీపావళి వేడుకలు నిర్వహించారు.