నువ్వొస్తానంటే.. నేను రానిస్తానా!
ఉప్పల్కు చెందిన యువతి బీటెక్ పూర్తిచేసి క్యాంపస్ కొలువు తెచ్చుకుంది. అమెరికాలో ఉంటున్న అబ్బాయితో పెళ్లిచేస్తే కుమార్తె జీవితం బాగుంటుందని తల్లిదండ్రులు భావించారు.
ప్రవాసులను పెళ్లాడిన యువతులకు వీసా చిక్కులు
నిబంధనలు, మోసాలతో పలువురు పుట్టింటికే పరిమితం
* ఉప్పల్కు చెందిన యువతి బీటెక్ పూర్తిచేసి క్యాంపస్ కొలువు తెచ్చుకుంది. అమెరికాలో ఉంటున్న అబ్బాయితో పెళ్లిచేస్తే కుమార్తె జీవితం బాగుంటుందని తల్లిదండ్రులు భావించారు. మధ్యవర్తి ద్వారా వచ్చిన సంబంధం నచ్చడంతో ఘనంగా పెళ్లి చేశారు. మూడు నెలల తర్వాత అల్లుడు అగ్రరాజ్యం చేరాడు. అమ్మాయిని కాపురానికి తీసుకెళ్లాలని అడుగుతుంటే.. వీసా నిబంధనలు కఠినంగా ఉన్నాయంటూ వాయిదా వేస్తూ వచ్చాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తాత్కాలిక వీసాపై అక్కడ ఉంటున్న అతను ఆర్థిక అవసరాల కోసమే పెళ్లి చేసుకున్న విషయం వెలుగుచూడటంతో భోరుమన్నారు.
* విజయవాడ యువతికి నాలుగేళ్ల క్రితం అమెరికాలో ఉంటున్న యువకుడితో పెళ్లయింది. హెచ్1 వీసా ఉన్న భర్త వద్దకు వెళ్లేందుకు దరఖాస్తు చేస్తే రెండుసార్లు తిరస్కరణకు గురైంది. తాను ప్రాసెస్ చేస్తున్నానంటూ భర్త చెబుతూ వచ్చాడు. 2019 తర్వాత కొవిడ్ నిబంధనలతో మరో రెండేళ్లు గడిచాయి. ఆమె తాజాగా మూడోసారి ప్రయత్నాలు ప్రారంభించింది..
లక్షలు సంపాదించే ఉద్యోగం.. విలాసవంతమైన జీవితం.. తమ కుమార్తె సుఖంగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రవాస వరుడికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆరాటపడుతుంటారు. కోరినన్ని లాంఛనాలిచ్చి అట్టహాసంగా వివాహం చేస్తారు. అయితే, మూడుముళ్లు పడ్డాక కాపురానికి వెళ్లే విషయంలో కొందరికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. వీసా నిబంధనలతో పలువురు ఆగిపోతుండగా.. అల్లుళ్ల మోసాలతో మరికొందరు పుట్టింటికే పరిమితం అవుతున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, జర్మనీ, జపాన్, ఐర్లాండ్, కెనడా, డెన్మార్క్ తదితర దేశాల్లో ఉద్యోగం చేస్తున్న జీవిత భాగస్వామి వద్దకు వెళ్లేందుకు ఏపీ, తెలంగాణల నుంచి సుమారు 3000-4000 మంది వరకు యువతులు వీసాలకు దరఖాస్తు చేసుకున్నట్టు అంచనా. వీరిలో నాలుగేళ్లుగా పుట్టింట్లో ఉన్న వారు 500-600 మంది వరకూ ఉన్నట్టు పోలీసు అధికారులు విశ్లేషిస్తున్నారు.
విదేశీ అల్లుళ్ల నాటకాలెన్నెన్నో..
కెనడాలో ఉంటున్న యువకుడు ఐటీ కంపెనీలో పనిచేస్తున్నట్టు చెప్పి వరంగల్ యువతిని వివాహమాడాడు. భార్యను కాపురానికి తీసుకెళ్లకుండా ఏవో కారణాలు చెబుతున్న అల్లుడి గురించి అత్తింటివారు ఆరా తీయగా.. తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్నట్టు తేలింది. ఐర్లాండ్లో ఉంటున్న హైదరాబాద్ యువకుడు గుంటూరు యువతిని పెళ్లాడాడు. విజిటింగ్ వీసాపై ఉన్న అతడు పర్మనెంట్ రెసిడెన్సీ ఉందంటూ మోసం చేసి రూ.లక్షల్లో లాంఛనాలు గుంజాడు. తెలంగాణలో ఐదేళ్ల వ్యవధిలో విదేశీ పెళ్లికొడుకుల మోసాలు, వేధింపులకు సంబంధించి సుమారు 500 కేసులు నమోదయ్యాయి. అధికశాతం బాధితులు వివాహ పరిచయ వేదికలు/మధ్యవర్తులు చెప్పిన వివరాలనే గుడ్డిగా నమ్ముతున్నారని.. ఇది సరికాదని ఐర్లాండ్కు చెందిన ప్రవాస శాస్త్రవేత్త తాటి రమేశ్ పేర్కొన్నారు.
అన్నీ పరిశీలించాకే ముందుకెళ్లాలి
- బి.సుమతి, డీఐజీ, తెలంగాణ మహిళా భద్రతా విభాగం
ఆయా దేశాల నిబంధనలకు అనుగుణంగా జీవిత భాగస్వామికి వీసా మంజూరు చేస్తుంటారు. కొన్నిసార్లు సహజంగానే ఆలస్యమవుతుంది. కొన్ని సందర్భాల్లో ప్రవాస పెళ్లికొడుకుల మోసాలూ వెలుగు చూస్తున్నాయి. అలాంటప్పుడు జీవిత భాగస్వామికి వీసా రావటం కష్టమవుతుంది. మధ్యవర్తుల మాటలను నమ్మకుండా పెళ్లికి ముందే యువకుడి పాస్పోర్టు రెన్యువల్, వీసా, ఉద్యోగం చేస్తున్న సంస్థ వివరాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలి.
- ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్
-
భద్రాచలం తరహాలో అమెరికాలో రామాలయం
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు. -
సింగపుర్లో శ్రీ మారియంబికా ఆలయంలో ఘనంగా చండీహోమం
సింగపుర్లోని వాసవీ క్లబ్ మెర్లయన్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు అత్యంత పురాతన, విశిష్టమైన శ్రీ మారియంబికా ఆలయంలో చండీహోమం నిర్వహించారు. -
కూటమి గెలిస్తేనే ఏపీకి భవిష్యత్తు.. ఖతార్లో తెదేపా ఆవిర్భావ వేడుకల్లో నేతలు
తెదేపా ఆవిర్భావ వేడుకలు ఖతార్లో ఘనంగా నిర్వహించారు. ఖతార్ తెలుగుదేశం పార్టీ నేతల ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
ప్రాచీన భారతీయ సాహిత్యం- ఆధునిక విజ్ఞాన వికాసంపై తానా ప్రపంచ సాహిత్యవేదిక సదస్సు
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ‘ప్రాచీన భారతీయ సాహిత్యం- ఆధునిక విశ్వ విజ్ఞానశాస్త్ర వికాసానికి మూలం’ అనే అంశంపై సదస్సు విజ్ఞానదాయకంగా జరిగింది. -
ఘనంగా క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ (QEF) వెబ్సైట్ ఆవిష్కరణ
ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్వచ్ఛమైన సమాజమే లక్ష్యంగా ఆవిర్భవించిన క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ తన వెబ్సైట్ను www.qef.org ఆవిష్కరించింది. నాణ్యమైన సాంకేతిక ప్రయాణంలో దీన్నొక మైలురాయిగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు వక్తలు పేర్కొన్నారు. -
ఏపీని ఆదుకునే ఎన్నారైలపై ఇంత అక్కసా?: జయరాం కోమటి
రాష్ట్రానికి మేలు చేసేలా కృషిచేస్తున్న ఎన్నారైలపై వైకాపా నాయకులు బెదిరింపులకు పాల్పడటం అత్యంత దారుణమని ప్రముఖ ప్రవాసాంధ్రుడు, ఎన్నారై తెదేపా అమెరికా సమన్వయకర్త జయరాం కోమటి అన్నారు. -
ఎన్ఆర్ఐ తెదేపా, జనసేన ఆధ్వర్యంలో తెదేపా ఆవిర్భావ వేడుకలు
ఎన్ఆర్ఐ తెదేపా కువైట్, జనసేన కువైట్ సంయుక్త ఆధ్వర్యంలో తెదేపా 42వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
డార్ట్ఫోర్డ్లో ఉల్లాసంగా హోలీ వేడుకలు
బ్రిటన్లోని డార్ట్ఫోర్డ్లో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. కెంట్లోనే అతిపెద్ద ఈవెంట్గా చేపట్టిన ఈ వేడుకలకు 3వేల మందికి పైగా హాజరయ్యారు. -
డాలస్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని డాలస్ నగరంలో ఘనంగా నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె