గానకోకిల సుశీలకు భారతరత్న ఇవ్వాలి

గానకోకిల, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ పి.సుశీల జన్మదినోత్సవం సందర్భంగా 13 దేశాల నుంచి 50 మంది గాయనీమణులు 100

Published : 28 Nov 2021 17:30 IST

గానకోకిల, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ పి.సుశీల జన్మదినోత్సవం సందర్భంగా 13 దేశాల నుంచి 50 మంది గాయనీమణులు 100 పాటలు గానం చేశారు. భారత్‌, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఒమన్, ఖతార్, బహ్రెయిన్‌, మలేషియా, స్వీడన్ దేశాల నుంచి అంతర్జాల కార్యక్రమంలో పాల్గొని గాయనీమణులు తమ మధురగానం వినిపించారు.

ఈ అపూర్వ కార్యక్రమం వంశీ ఇంటర్నేషనల్ ఇండియా, శుభోదయం గ్రూప్ ఇండియా, శ్రీ సాంస్కృతిక కళా సారథి, సింగపూర్, ది గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాలంలో వేదికగా జరిగింది. ప్రముఖ సినీ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్ ప్రారంభోపన్యాసం చేస్తూ సుశీలకు ‘భారతరత్న’ ఇవ్వాలని కోరారు. కార్యక్రమ నిర్వాహకులుగా 12 గంటల పాటు, తలహసీ, ఫ్లోరిడాకు చెందిన ప్రముఖ రచయిత్రి, గాయని, రాధిక నోరి వ్యాఖ్యానంతో కార్యక్రమం ఆద్యంతం రక్తి కట్టింది. ప్రతి పాట ఏ రాగమో చెబుతూ చేసిన ఆవిడ విశ్లేషణ ఎంతో బాగుంది. డాక్టర్ వంశీ రామరాజు, డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ కలపటపు, రత్న కుమార్ కవుటూరు, రాధిక మంగిపూడి, అనిల్ కుమార్, డా. తెన్నేటి సుధాదేవి, శైలజ సుంకరపల్లి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

శ్రీలక్ష్మి ప్రార్థన గీతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో, గుంటూరుకు చెందిన లక్ష్మీ శ్రీనివాస రామరాజు, వీణపై, పి సుశీల నర్తనశాలలో పాడిన ‘జననీ శివకామినీ’ పాటను అద్భుతంగా వినిపించారు. అమెరికా గానకోకిల శారదా ఆకునూరి, గాన కోకిల సుశీలగారి ‘పాటకు పట్టాభిషేకాన్ని’ తన మధురమైన గానంతో సోదాహరణంగా విశ్లేషించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని