5జీ అభివృద్ధిలో కీలక పాత్ర.. డా.కల్యాణి బోగినేనికి ప్రతిష్ఠాత్మక అవార్డు
ప్రపంచవ్యాప్తంగా 5జీ టెక్నాలజీ ఓ కొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలికిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రపంచంలో కొన్ని దేశాలకు
ప్రపంచవ్యాప్తంగా 5జీ టెక్నాలజీ ఓ కొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలికిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రపంచంలో కొన్ని దేశాలకు పరిచయమైన ఈ టెక్నాలజీ త్వరలో భారత్లోనూ అందుబాటులోకి రానుంది. మొట్టమొదటగా ప్రపంచానికి 5జీని పరిచయం చేసింది వెరైజన్ కంపెనీ అన్న సంగతి తెలిసిందే. కానీ ఈ 5జీ టెక్నాలజీని అభివృద్ధి చేసిన డెవలప్మెంట్ టీమ్లో మన తెలుగింటి ఆడపడుచు కీలక పాత్ర పోషించారన్న సంగతి అతి కొద్ది మందికే తెలుసు.
5జీని ప్రపంచానికి పరిచయం చేసిన వెరైజన్ ఆర్కిటెక్ట్లలో డాక్టర్ కల్యాణి బోగినేని ఒకరు.ఆ కంపెనీలో ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా, ప్రతి సంవత్సరం వారి కంపెనీ నుంచి ఇచ్చే ప్రతిష్ఠాత్మక వెరైజన్ `మాస్టర్ ఇన్వెంటర్` అవార్డును 2021 సంవత్సరానికి గాను ఆమెకుప్రకటించారు. అమెరికాలోని నెట్వర్క్ టెక్నాలజీ రంగంలో ఈ తరహా అవార్డులు మహిళలకు రావడం చాలా అరుదు. చాలా మంది తెలుగు మహిళలు, భారతీయ మహిళలు పలు సాఫ్ట్వేర్ కంపెనీలలో రాణిస్తున్నప్పటికీ.. నెట్వర్క్ టెక్నాలజీ రంగంలో ఇటువంటి అవార్డు రావడం గర్వకారణం. ఈ సందర్భంగా.. శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పూర్వ విద్యార్థిని అయిన డాక్టర్ కల్యాణిని ఆమె సహచరులు, అధ్యాపకులు వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభినందించారు. ఆ యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్లో కల్యాణి 1982లో బీటెక్(ఈఈఈ) విద్యను పూర్తి చేశారు.
1984లో ఐఐఎస్సీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో ఎంఈ పూర్తి చేశారు. డార్ట్ మౌత్ కాలేజీ నుంచి ఫెలోషిప్ అందుకున్నారు. 1990లో ఇంజినీరింగ్ సైన్సెస్లో డార్ట్ మౌత్ నుంచి ఎం.ఎస్ పట్టా పొందారు. 1993లో స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ ఎట్ బఫెలో నుంచి ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్లో పీహెచ్డీ పూర్తి చేశారు. పీహెచ్డీ సమయంలో 20కి పైగా IEEE/ACM పత్రాలను సమర్పించారు.
వెరైజన్లో నెట్వర్క్ అండ్ టెక్నాలజీ స్ట్రాటజీ అండ్ ప్లానింగ్లో 18 ఏళ్లుగా సేవలు అందిస్తున్నారు. తను చేసే పనిలో వ్యూహాత్మకంగా ఆలోచించడంతోపాటు సృజనాత్మకతకూ పెద్దపీట వేస్తారు. నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకున్న ఆమె మంచి వక్తగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. సాంకేతిక రంగం, మల్టీ కంప్యూటర్ ఆర్కిటెక్చర్, ఆప్టికల్, వైర్లెస్ విభాగాల్లో ఆమె అనుభవం ఎంతో దోహద పడింది.
2జీ నుంచి 5జీ వరకూ వైర్లెస్ నెట్వర్క్ డిజైనింగ్లోనూ అద్భుతమైన ప్రగతి చూపించారు. వర్చ్యువలైజేషన్, సాఫ్ట్వేర్ ఆధారిత నెట్వర్కింగ్, కృత్రిమ మేధ, ఆటోమేషన్ వంటి విభాగాల్లో సత్తా చాటారు. IEEEలో సీనియర్ సభ్యురాలే కాకుండా, సాంకేతిక కమిటీల్లోనూ పాలు పంచుకుంటున్నారు. అదేవిధంగా పారిశ్రామిక సదస్సుల్లోనూ, జర్నల్స్లోనూ ఆమె అనేక విషయాలను పంచుకున్నారు. పారిశ్రామిక అవసరాలకు తగిన విధంగా అనేక సూచనలు చేశారు.
IEEE/ACM పబ్లికేషన్స్లో ఇప్పటి వరకు దాదాపు 30 ఆర్టికల్స్ రాశారు. 70 పేటెంట్స్ను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా వాయిస్ ఓవర్ ఐపీ, 4జీ, 5జీ టెక్నాలజీలలో అద్భుత ప్రతిభ కనబరిచారు.IEEE టెక్నలాజికల్ ఇన్నోవేషన్ అవార్డు-2019 సహా డాక్టర్ కల్యాణి తన ఉద్యోగ జీవితంలో అనేక అవార్డులను అందుకున్నారు. ఇందుకుగాను అమెరికాలోని తెలుగు వారంతా ఆమెను అభినందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Indian origin Family: అనుమానాస్పద స్థితిలో కెనడాలో భారత సంతతి కుటుంబం మృతి
కెనడా(Canada)లో భారత సంతతికి చెందిన ముగ్గురు కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. వారి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
జనసేన ఆవిర్భావ వేడుకల వేళ.. డల్లాస్లో జనసేన, తెదేపా, భాజపా ఆత్మీయ సమావేశం
డల్లాస్లో జనసేన ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు జనసేన నేతలతో పాటు తెదేపా, భాజపా క్యాడర్కు చెందిన పలువురు హాజరయ్యారు. -
సింగపూర్లో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు
సింగపూర్లో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. -
న్యూజెర్సీలో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు
శివుడికి ప్రీతిపాత్రమైన మహా శివరాత్రి పర్వదినాన ‘హర హర మహాదేవ శంభో శంకర’ అంటూ అగ్రరాజ్యంలో ఎన్నారైలు ముక్తకంఠంతో నినదించారు. -
న్యూజెర్సీలో ఓఎఫ్ భాజపా ఆధ్వర్యంలో ‘ఛాయ్పే చర్చ’
న్యూజెర్సీలోని ఎడిసన్ నగరంలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ (BJP) ఆధ్వర్యంలో ‘ఛాయ్ పే చర్చ’ నిర్వహించారు. -
బే ఏరియాలో ‘తెదేపా-జనసేన-భాజపా’కు చెందిన ఎన్ఆర్ఐల ఆత్మీయ సమావేశం
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో స్థిరపడిన ఎన్ఆర్ఐలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. -
అమెరికాలో మే 24-26 మధ్య టీటీఏ మహాసభలు
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) అగ్రరాజ్యంలో భారీగా మహాసభలు నిర్వహించనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు టీటీఏ అధ్యక్షుడు వంశీరెడ్డి కంచరకుంట్ల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. -
సౌదీ అరేబియాలో తెదేపా-జనసేన ఎన్నారై కూటమి సమావేశం
సౌదీ అరేబియాలోని జుబైల్లో తెదేపా-జనసేన ఎన్నారై కూటమి భేటీ అయ్యింది. రాబోయే ఎన్నికలకు వ్యూహరచన చేసేందుకు ‘ఎన్నికల సన్నాహక ఆత్మీయ సమావేశం’ పేరిట ఈ భేటీ నిర్వహించారు. -
డెట్రాయిట్లో అట్టహాసంగా మహిళా దినోత్సవం
గ్లోబల్ తెలంగాణ సంఘం డెట్రాయిట్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. -
తానా బోర్డు ఛైర్మన్గా డా.నాగేంద్ర శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో ప్రతిష్ఠాత్మక బోర్డు ఛైర్మన్ పదవికి డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
డెట్రాయిట్లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
అంతర్జాతీయ మహిళల దినోత్సవం(మార్చి 8) పురస్కరించుకుని ఫార్మింగ్టన్ మేనర్లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (జీటీఏ) డెట్రాయిట్ మహిళా విభాగం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన లేడీస్ నైట్ అట్టహాసంగా జరిగింది. -
TDP - Janasena: షికాగోలో ఘనంగా తెదేపా - జనసేన ఆత్మీయ సమావేశం
తెదేపా, జనసేన నాయకులు షికాగోలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. -
TANA Foundation: తానా ఫౌండేషన్ ఛైర్మన్గా శశికాంత్ వల్లేపల్లి
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ఫౌండేషన్ చైర్మన్గా శశికాంత్ వల్లేపల్లి ఎన్నికయ్యారు. -
Sporty Divas: ఇండో-గల్ఫ్ త్రోబాల్ ఛాంపియన్షిప్ విజేతగా అమెరికా జట్టు
బహ్రెయిన్లో నిర్వహించిన ‘ఇండో-గల్ఫ్ ఇంటర్నేషనల్ త్రోబాల్ ఛాంపియన్షిప్’లో అమెరికాకు చెందిన మహిళల జట్టు ‘స్పోర్టీ దివాస్’ విజేతగా నిలిచింది. -
ఖతార్లో ఎన్నికల శంఖారావం సభ.. భారీగా హాజరైన ప్రవాసులు
ఖతార్లో ఎన్నికల శంఖారావం సభ ఎన్నారై తెలుగుదేశం, జనసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. -
మంగళగిరిలో ‘యూరో కార్ట్’లు.. నారా లోకేశ్ చేతుల మీదుగా చిరు వ్యాపారులకు అందజేత
లండన్ ఎన్నారై ‘జై కుమార్ గుంటుపల్లి’ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. యూరప్లో విజయవంతమైన ‘యూరో కార్ట్’లను ఆంధ్రప్రదేశ్లోని చిరు వ్యాపారులకు పరిచయం చేయాలని సంకల్పించారు. -
తానా ఎన్నిక కథ సుఖాంతం.. కొత్త సభ్యుల ఎన్నికకు బోర్డు ఆమోదం
మార్చి 1 నుంచి కొత్త బోర్డు, పాలకవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరిస్తారని ప్రస్తుత తానా బోర్డు ఛైర్మన్ హనుమయ్య బండ్ల తెలిపారు. -
TANA: తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘అవధాన వైభవం’
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశంలో భాగంగా ఆదివారం నిర్వహించిన 65వ సాహిత్య సమావేశం ‘ అవధాన వైభవం.. నేటి అవధానుల నోట... నాటి మేటి అవధానుల సాహితీఝరి’ ఘనంగా జరిగింది. -
Dubai: భారతీయులకు దుబాయ్ ఆఫర్.. ఐదేళ్ల మల్టిపుల్ ఎంట్రీ పర్యటక వీసా..!
భారత్తో బంధాన్ని బలోపేతం చేసేందుకు వీలుగా ప్రత్యేక వీసా విధానాన్ని దుబాయ్ (Dubai) అమల్లోకి తెచ్చింది. -
ఆస్టిన్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు
ఆస్టిన్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ (TCA) 2024వ సంవత్సరానికి గాను నూతన కార్యవర్గం ఏర్పాటైంది. -
USA: భారత సంతతి ఇంజినీర్కు టెక్సాస్ అత్యున్నత అకడమిక్ అవార్డు
USA: ‘ఇమేజింగ్ సాంకేతికత’లో చేసిన పరిశోధనలకుగానూ భారత సంతతి ఇంజినీర్ అశోక్ వీరరాఘవన్కు అత్యున్నత అకడమిక్ అవార్డు లభించింది.
తాజా వార్తలు (Latest News)
-
NDA: ఎన్డీఏ ‘మహా’ వ్యూహం.. ఉద్ధవ్కు చెక్ పెట్టేందుకు రంగంలోకి రాజ్..!
-
Stock market: భారీ నష్టాల్లో సూచీలు.. సెన్సెక్స్ 700 పాయింట్లు డౌన్
-
India- China: ఎన్నిసార్లు వాదించినా వాస్తవాలు మారవు.. చైనాకు భారత్ కౌంటర్
-
CAA: సీఏఏపై స్టే కోరుతూ పిటిషన్లు.. కేంద్రానికి మూడు వారాల గడువిచ్చిన సుప్రీం
-
Sita Soren: జేఎంఎంకు షాక్..! భాజపాలోకి శిబూ సోరెన్ పెద్ద కోడలు
-
Mumbai Indians: హార్దిక్.. అంత వీజీ కాదు