5G in America: విమాన ప్రయాణికులకు 5జీ తిప్పలు
అమెరికా విమానాశ్రయాల్లో టెలికాం సంస్థలు బుధవారం నుంచి అందుబాటులోకి తీసుకురాదలచిన కొత్త 5 జీ సేవల
పలు సర్వీసుల రద్దుతో ఇక్కట్లు
న్యూయార్క్: అమెరికా విమానాశ్రయాల్లో టెలికాం సంస్థలు బుధవారం నుంచి అందుబాటులోకి తీసుకురాదలచిన కొత్త 5 జీ సేవల కారణంగా విమాన సర్వీసులకు అంతరాయం కలుగుతుందన్న ఆందోళనతో పలు విమానాలు రద్దయ్యాయి. కొన్ని విమానాల రాకపోకలను నిర్ణీత దూరాలకు పరిమితం చేశారు. దీంతో ప్రణాళికలు అస్తవ్యస్తమై వేలాది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. చాలామంది ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు. వీరిలో భారత ప్రయాణికులు కూడా ఉన్నారు. ఎయిర్ ఇండియాతోపాటు ఇంకా పలు అంతర్జాతీయ విమాన సంస్థలు అమెరికాకు వెళ్లే విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. కొత్త 5 జీ ఫోను నుంచి వెలువడే సంకేతాలతో విమానాల్లోని నేవిగేషన్ వ్యవస్థలకు అంతరాయాలు ఉంటాయని ముందు జాగ్రత్తగా విమానాలు నిలిపివేశారు. ‘5జీ ఫోను సిగ్నళ్లతో విమానంలోని రేడియో ఆల్టీమీటర్ (ఎత్తును కొలిచే మాపకం) ప్రభావితమై ఇంజినులోని బ్రేకింగు వ్యవస్థ ల్యాండింగ్ మోడ్ను దెబ్బతీస్తుంది. ఫలితంగా విమానం రన్వేపైన ఆగడం కష్టమవుతుంది’ అని అమెరికాలోని విమానయాన నియంత్రణ సంస్థ ‘ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్’ (ఎఫ్ఏఏ) జనవరి 14న ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా 8 విమాన సర్వీసులు రద్దు చేసింది. దిల్లీ నుంచి వాషింగ్టన్కు మాత్రం యథావిధిగా సర్వీసులు నడుస్తున్నాయి. తదుపరి నోటీసులు వచ్చేవరకు విమానాల రద్దు కొనసాగుతుందని ఎమిరేట్స్ పేర్కొంది.
కొన్నిచోట్ల 5జీ సేవల వాయిదా
మరోవైపు.. ఎయిర్లైన్ల ఆందోళనలతో బైడెన్ సర్కారు చేపట్టిన చర్యల నేపథ్యంలో కొన్ని విమానాశ్రయాల వద్ద 5జీ సేవల ప్రారంభాన్ని వాయిదా వేస్తున్నట్లు టెలికాం సంస్థలు ఏటీ అండ్ టీ, వెరిజాన్ ప్రకటించాయి. కొన్ని ఎయిర్పోర్టుల రన్వేలకు సమీపంలో 5జీ సెల్టవర్లను ఏర్పాటు చేయబోమని ఏటీ అండ్ టీ తెలిపింది. విమానాశ్రయాల చుట్టూ 5జీ సేవలను పరిమితంగానే అందుబాటులోకి తెస్తామని వెరిజాన్ పేర్కొంది. తమ సాంకేతికత విమాన వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపబోదని రెండు టెలికాం సంస్థలు పేర్కొన్నాయి. అనేక దేశాల్లో దీన్ని సురక్షితంగా వినియోగిస్తున్నట్లు స్పష్టం చేశాయి. 90 శాతం టవర్లను ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేసుకోవచ్చని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు.
ప్రయాణికుల ఆవేదన
‘నాలుగేళ్ల తర్వాత నేను ఇండియాకు వెళ్తున్నా. కరోనా వల్ల రెండేళ్లు ఇంటికి వెళ్లలేకపోయా. ఇప్పుడు కొత్త సమస్య వచ్చిపడింది. న్యూయార్క్ నుంచి వాషింగ్టన్కు ట్రైను ద్వారా వెళ్తా. అక్కడి నుంచి టికెటు దొరికితే ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తా’ అని న్యూయార్క్లో ఉండే భారతీయుడు జయంత్ రాజా తెలిపారు. దాదాపు అయిదేళ్ల తర్వాత తల్లిదండ్రులను కలుస్తున్నానని ఎంతో ఆరాటపడ్డానని ముంబయి ప్రయాణికురాలు ప్రియాంకా సేథ్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.