5G in America: విమాన ప్రయాణికులకు 5జీ తిప్పలు
అమెరికా విమానాశ్రయాల్లో టెలికాం సంస్థలు బుధవారం నుంచి అందుబాటులోకి తీసుకురాదలచిన కొత్త 5 జీ సేవల
పలు సర్వీసుల రద్దుతో ఇక్కట్లు
న్యూయార్క్: అమెరికా విమానాశ్రయాల్లో టెలికాం సంస్థలు బుధవారం నుంచి అందుబాటులోకి తీసుకురాదలచిన కొత్త 5 జీ సేవల కారణంగా విమాన సర్వీసులకు అంతరాయం కలుగుతుందన్న ఆందోళనతో పలు విమానాలు రద్దయ్యాయి. కొన్ని విమానాల రాకపోకలను నిర్ణీత దూరాలకు పరిమితం చేశారు. దీంతో ప్రణాళికలు అస్తవ్యస్తమై వేలాది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. చాలామంది ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు. వీరిలో భారత ప్రయాణికులు కూడా ఉన్నారు. ఎయిర్ ఇండియాతోపాటు ఇంకా పలు అంతర్జాతీయ విమాన సంస్థలు అమెరికాకు వెళ్లే విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. కొత్త 5 జీ ఫోను నుంచి వెలువడే సంకేతాలతో విమానాల్లోని నేవిగేషన్ వ్యవస్థలకు అంతరాయాలు ఉంటాయని ముందు జాగ్రత్తగా విమానాలు నిలిపివేశారు. ‘5జీ ఫోను సిగ్నళ్లతో విమానంలోని రేడియో ఆల్టీమీటర్ (ఎత్తును కొలిచే మాపకం) ప్రభావితమై ఇంజినులోని బ్రేకింగు వ్యవస్థ ల్యాండింగ్ మోడ్ను దెబ్బతీస్తుంది. ఫలితంగా విమానం రన్వేపైన ఆగడం కష్టమవుతుంది’ అని అమెరికాలోని విమానయాన నియంత్రణ సంస్థ ‘ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్’ (ఎఫ్ఏఏ) జనవరి 14న ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా 8 విమాన సర్వీసులు రద్దు చేసింది. దిల్లీ నుంచి వాషింగ్టన్కు మాత్రం యథావిధిగా సర్వీసులు నడుస్తున్నాయి. తదుపరి నోటీసులు వచ్చేవరకు విమానాల రద్దు కొనసాగుతుందని ఎమిరేట్స్ పేర్కొంది.
కొన్నిచోట్ల 5జీ సేవల వాయిదా
మరోవైపు.. ఎయిర్లైన్ల ఆందోళనలతో బైడెన్ సర్కారు చేపట్టిన చర్యల నేపథ్యంలో కొన్ని విమానాశ్రయాల వద్ద 5జీ సేవల ప్రారంభాన్ని వాయిదా వేస్తున్నట్లు టెలికాం సంస్థలు ఏటీ అండ్ టీ, వెరిజాన్ ప్రకటించాయి. కొన్ని ఎయిర్పోర్టుల రన్వేలకు సమీపంలో 5జీ సెల్టవర్లను ఏర్పాటు చేయబోమని ఏటీ అండ్ టీ తెలిపింది. విమానాశ్రయాల చుట్టూ 5జీ సేవలను పరిమితంగానే అందుబాటులోకి తెస్తామని వెరిజాన్ పేర్కొంది. తమ సాంకేతికత విమాన వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపబోదని రెండు టెలికాం సంస్థలు పేర్కొన్నాయి. అనేక దేశాల్లో దీన్ని సురక్షితంగా వినియోగిస్తున్నట్లు స్పష్టం చేశాయి. 90 శాతం టవర్లను ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేసుకోవచ్చని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు.
ప్రయాణికుల ఆవేదన
‘నాలుగేళ్ల తర్వాత నేను ఇండియాకు వెళ్తున్నా. కరోనా వల్ల రెండేళ్లు ఇంటికి వెళ్లలేకపోయా. ఇప్పుడు కొత్త సమస్య వచ్చిపడింది. న్యూయార్క్ నుంచి వాషింగ్టన్కు ట్రైను ద్వారా వెళ్తా. అక్కడి నుంచి టికెటు దొరికితే ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తా’ అని న్యూయార్క్లో ఉండే భారతీయుడు జయంత్ రాజా తెలిపారు. దాదాపు అయిదేళ్ల తర్వాత తల్లిదండ్రులను కలుస్తున్నానని ఎంతో ఆరాటపడ్డానని ముంబయి ప్రయాణికురాలు ప్రియాంకా సేథ్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Israel: హమాస్కు భారీ ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్ దాడిలో టాప్ కమాండర్ హతం
హమాస్ లక్ష్యంగా భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ కీలక పురోగతి సాధించింది. హమాస్ నంబర్ 3 కమాండర్ మార్వాన్ ఇస్సా హతమైనట్లు అమెరికా ప్రకటించింది. -
పుతిన్ కొత్త రికార్డు!
రష్యా అంటే వ్లాదిమిర్ పుతిన్. పుతిన్ అంటే రష్యా.. ఇది మరోసారి రుజువైంది. విమర్శలు ఎన్నిఉన్నా.. అనుకున్నది సాధించి చూపడంలో తనదైన శైలిని సొంతం చేసుకున్న నేత వరసగా అయిదోసారి అధ్యక్షునిగా.. రికార్డుస్థాయిలో 87.29% ఓట్లతో నెగ్గారు. -
ఢీ అంటే ఢీ అంటున్న పాక్, అఫ్గాన్
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ల మధ్య ఘర్షణ వాతావరణం ముదురుతోంది. ఈ నెల 16న పాక్లో మీర్ అలీ లోని పాక్ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసి అయిదుగురు సైనికులు, ఇద్దరు అధికారులను హతమార్చారు. -
గూఢచారి నుంచి అధ్యక్షుడి వరకు..
ప్రధానిగా, అధ్యక్షుడిగా కలిపి గత 24 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతోన్న వ్లాదిమిర్ పుతిన్ రష్యాను సుదీర్ఘకాలం పాలించిన నేతగా రికార్డు సృష్టించనున్నారు. అధ్యక్షుడిగా తాజా ఎన్నికతో లభించిన ఆరేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటే ఆయన ఈ ఘనత సాధించనున్నారు. -
ఏడువేల కంటైనర్లలో.. రష్యాకు ఉత్తరకొరియా యుద్ధసామగ్రి
ఉక్రెయిన్పై యుద్ధానికి మద్దతుగా రష్యాకు గతేడాది నుంచి ఉత్తరకొరియా దాదాపు 7 వేల కంటైనర్ల యుద్ధ సామగ్రిని సరఫరా చేసిందని దక్షిణకొరియా రక్షణ శాఖ మంత్రి షిన్ వాన్ సిక్ వెల్లడించారు. -
నైజీరియాలో 100 మంది గ్రామస్థుల కిడ్నాప్
నైజీరియాలో సాయుధ ముఠాలు మళ్లీ చెలరేగిపోయాయి. వాయువ్య సరిహద్దులోని కదునా రాష్ట్రం కజూరూ కౌన్సిల్లోని గ్రామాలపై దాడులుచేసి 100 మంది గ్రామస్థుల్ని అపహరించుకుపోయారు. -
ఆసుపత్రిపై ‘ఆపరేషన్’!.. గాజాలో మరో 81 మంది మృతి
గాజాలోని అతి పెద్ద ఆసుపత్రి అల్ షిఫాను సోమవారం ఉదయం ఇజ్రాయెల్ బలగాలు చుట్టుముట్టాయి. వేల మంది ఆశ్రయం పొందుతున్న ఈ ఆసుపత్రిలోని అణువణువునూ శోధిస్తున్నాయి. -
రష్యా నుంచి విడిపించాలని వీడియోలో భారతీయుల వినతి
అనూహ్య పరిస్థితుల్లో రష్యా సైన్యంలో చిక్కుకుపోయిన భారతీయులు తమను కాపాడాలంటూ మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. -
ఎబోలా కట్టడికి కొత్త ఔషధాలు!
మానవ శరీరంలో ఎబోలా వైరస్ పునరుత్పత్తి చెందే తీరును శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వ్యాధి నివారణకు కొత్త ఔషధాల రూపకల్పనకు ఇది దోహదపడుతుందని వారు వివరించారు. -
క్షామం అంచున గాజా
ఇజ్రాయెల్ దాడులతో గాజా పరిస్థితి దారుణంగా మారింది. స్థానికుల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఉత్తర గాజా క్షామం అంచుకు చేరుకుందని ఐరాస ఆహార సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. -
నెల తర్వాత మాట్లాడుకున్న బైడెన్, నెతన్యాహు
కాల్పుల విరమణ, గాజాలో మానవతా సాయం విషయంలో మనస్పర్థలకారణంగా గత కొంతకాలంగా ఎడముఖం పెడముఖంగా ఉంటున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నెల తర్వాత మళ్లీ మాట్లాడుకున్నారు. -
Munitions: ఉత్తర కొరియా నుంచి రష్యాకు.. ఏడు వేల కంటెయినర్ల ఆయుధాలు!
రష్యాకు ఉత్తర కొరియా గతేడాది నుంచి దాదాపు ఏడు వేల కంటెయినర్ల ఆయుధ సామగ్రి, ఇతర సైనిక పరికరాలను చేరవేసినట్లు దక్షిణ కొరియా ఆరోపించింది.