పేదల వైద్యానికి.. ప్రవాస సాయం
బాధలో ఉన్నవారికి సాయమందించే వారుంటారు. తమకు చేతనైనంతగా తృణమో.. పణమో అందిస్తుంటారు. ఒక్కసారో.. రెండుసార్లో చేస్తారు. కానీ నిరంతరాయంగా పేద రోగులకు మెరుగైన వైద్యం అందించడానికి తమ
ఎంఎన్జేకు అనుబంధంగా రూ.4 కోట్లతో ఐదంతస్తుల వసతిగృహ నిర్మాణం
త్వరలో అందుబాటులోకి.. డాక్టర్ గోవిందరావు ఉదారత
ఈనాడు - హైదరాబాద్: బాధలో ఉన్నవారికి సాయమందించే వారుంటారు. తమకు చేతనైనంతగా తృణమో.. పణమో అందిస్తుంటారు. ఒక్కసారో.. రెండుసార్లో చేస్తారు. కానీ నిరంతరాయంగా పేద రోగులకు మెరుగైన వైద్యం అందించడానికి తమ సొంత డబ్బు నుంచి రూ.కోట్లు ఖర్చు చేసేవారు అతి కొద్దిమంది మాత్రమే ఉంటారు. అటువంటి అరుదైన దార్శనికుల్లో ప్రవాస తెలంగాణవాసి డాక్టర్ గోవిందరావు చామకూరు(90) ఒకరు. అమెరికా న్యూయార్క్ రాష్ట్రంలోని అమ్స్టర్డామ్లో నివాసముంటున్నారు. వైద్యవిద్య చదువుతున్న కుమార్తె 20 ఏళ్ల వయసులో కళ్ల ముందే ప్రమాదవశాత్తూ కన్నుమూస్తే.. ఆ బాధను దిగమింగుకొని.. కుమార్తె పేరు మీదనే ‘నీనారావు ఛారిటబుల్ ట్రస్టు’ను స్థాపించారాయన. ఫలానా ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలనే అంశం ఆయన దృష్టికి వస్తే చాలు.. మరో ఆలోచన లేకుండా ఆ పని పూర్తి చేయడంలో మహదానందాన్ని వెతుక్కుంటారు. సర్కారు దవాఖానాల్లో రోగులకు బాసటగా నిలవాలనే సంకల్పమే గత 18 ఏళ్లుగా ఆయన్ను ముందుకు నడిపిస్తోంది. ఆయనతో సహా గోవిందరావు కుటుంబంలో 9 మంది పిల్లల వైద్యనిపుణులే. ఇక్కడ హైదరాబాద్లో ఆయన తమ్ముడు చామకూరు హరనాథరావు(85) ఈ ట్రస్టు వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటారు.
రోడ్డు పక్కనే పడుకున్న వారిని చూసి చలించి..
ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రికి రేడియోథెరపీ, కీమోథెరపీ చికిత్సల కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చే రోగులు.. ఆసుపత్రి వెలుపలే రాత్రీపగలు ఉండాల్సిన దుస్థితి నెలకొంది. రోజూ సుమారు 300 మంది రేడియోథెరపీ పొందుతుంటారు. వారిలో 100 మందికి మాత్రమే ఆసుపత్రిలో వసతి ఇవ్వగలుగుతున్నారు. మిగిలిన వారు ఆసుపత్రి ఆవరణలోనో.. రోడ్ల పక్కనో.. చెట్ల కిందో, వరండాల్లోనో తలదాచుకుంటున్నారు. వారి అవస్థలను ఆసుపత్రి సంచాలకులు డాక్టర్ జయలత.. నీనారావు ట్రస్టు దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన డాక్టర్ గోవిందరావు రోడ్ల పక్కన, చెట్ల నీడలో తలదాచుకుంటున్న వారిని చూసి చలించారు. భవన నిర్మాణానికి ముందుకొచ్చారు. రూ.4 కోట్ల వ్యయాన్ని పూర్తిగా భరించారు. ఇప్పుడు నిర్మాణం పూర్తయింది. వారం రోజుల్లోనే ఈ భవనాన్ని క్యాన్సర్ రోగులకు వసతిగృహంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంచాలకులు డాక్టర్ జయలత తెలిపారు. ఈ ఐదంతస్తుల భవనంలో ఏకకాలంలో 350 మంది రోగులు ఉండడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు.
ప్రభుత్వ వైద్యంలో మెరుగైన సేవలే లక్ష్యం
- డాక్టర్ గోవిందరావు, నీనారావు ఛారిటబుల్ ట్రస్టు ఛైర్మన్
మాది హైదరాబాద్. మా నాన్న ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. సమాజానికి ఏదైనా చేయాలనే ఆలోచన ఆయన నుంచే వచ్చింది. అమెరికాలో పిల్లల వైద్య నిపుణుడిగా స్థిరపడ్డా. సామాజిక సేవలో భాగంగా ‘నీనారావు ఛారిటబుల్ కార్పొరేషన్ యూఎస్ఏ’ను స్థాపించా. క్యాన్సర్ రోగులు పడుతున్న అవస్థలను కళ్లారా చూశాక.. వారికి ఊరట కలిగే విధంగా నిర్మాణానికి ఎంత ఖర్చైనా భరించాలని ముందే అనుకున్నా. నా లక్ష్యం నెరవేరి, త్వరలోనే ఇది అందుబాటులోకి రానుండడం ఆనందాన్నిస్తోంది.
అ‘పూర్వ’ విద్యార్థులు
ఈనాడు, వరంగల్: వీరంతా కాకతీయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు. వైద్య నిపుణులుగా వేర్వేరు దేశాల్లో స్థిరపడ్డారు. తాము అనుభవపూర్వక విద్యనభ్యసించిన ఎంజీఎం ఆసుపత్రికి ఎంతో కొంత సేవ అందించాలని సంకల్పించారు. కొవిడ్ సమయంలో రూ.50 లక్షల విలువైన వైద్య పరికరాలను విరాళంగా ఇచ్చారు. కాళోజీ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్గా పనిచేస్తున్న డాక్టర్ ప్రవీణ్కుమార్ వారిని సమన్వయపరిచారు. బైపాప్ యంత్రాలు, 125 ఆక్సిజన్ ఫ్లోమీటర్లు, ఎముకల శస్త్రచికిత్సలో ఉపయోగపడే అత్యాధునిక ‘సీ ఆర్మ్’ పరికరం వంటివి అందజేశారు. ఈ పరికరాలు అందుబాటులోకి వచ్చాక.. ఎంజీఎం ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీలో రూ.2 కోట్ల విలువైన శస్త్రచికిత్సలు జరిగాయని ప్రవీణ్కుమార్ తెలిపారు. సుమారు రూ.3 లక్షల విలువైన వైద్య పరికరాలను ములుగు జిల్లా ఏటూరునాగారం సామాజిక వైద్యశాలకు, జనగామ ఆసుపత్రికి అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ఎన్నెన్ని సేవలో...
* ట్రస్టు ఆధ్వర్యంలో డాక్టర్ గోవిందరావు 15 ఏళ్ల కిందట నిలోఫర్ పిల్లల ఆసుపత్రిలో వెంటిలేటర్లు సహా ఆధునిక వైద్య పరికరాలనూ, శస్త్రచికిత్స థియేటర్ను సమకూర్చారు. 14 పడకల అత్యవసర చికిత్స విభాగాన్ని ఏర్పాటుచేశారు. సమావేశ గదిని, గ్రంథాలయాన్ని నిర్మించారు.
* ఉస్మానియా ఆసుపత్రిలో 12 వార్డుల ఆధునికీకరణ చేపట్టారు. ఉస్మానియా వైద్యకళాశాలలో సమావేశ గదినీ, రెండు గ్రంథాలయాలనూ నిర్మించారు. మహిళలు, పురుషులు చదువుకోవడానికి వేర్వేరు గదులను నెలకొల్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్
-
భద్రాచలం తరహాలో అమెరికాలో రామాలయం
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!