సింగపూర్‌లో ‘శ్రీమద్ భాగవత సప్తాహం’ ప్రవచన కార్యక్రమం

సింగపూర్‌లో ప్రఖ్యాత తెలుగు సంస్థలైన 'శ్రీ సాంస్కృతిక కళాసారథి', 'తెలంగాణ కల్చరల్ సొసైటీ', 'తెలుగు భాగవత ప్రచార సమితి' 'కాకతీయ సాంస్కృతిక పరివారం' సంయుక్త ఆధ్వర్యంలో .......

Published : 11 Apr 2022 21:55 IST

సింగపూర్‌: సింగపూర్‌లో ప్రఖ్యాత తెలుగు సంస్థలైన ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’, ‘తెలంగాణ కల్చరల్ సొసైటీ’, ‘తెలుగు భాగవత ప్రచార సమితి’, ‘కాకతీయ సాంస్కృతిక పరివారం’ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాలం వేదికగా వసంత నవరాత్రులలో వారం రోజులపాటు నిరాటంకంగా సాగిన శ్రీమద్‌ భాగవత సప్తాహం కార్యక్రమం  ముగిసింది. పంచ మహా సహస్రావధాని డా. మేడసాని మోహన్ ఉగాది పర్వదినాన ప్రారంభించారు. సింగపూర్ తెలుగు వారికోసం వారంరోజుల పాటు అద్భుతంగా భాగవత ప్రవచన సుధను అందించారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో శృంగేరి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విధుశేఖరానంద భారతి స్వామి, కుర్తాళం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామి శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ ఆశీస్సులను అందించారు. ముఖ్యఅతిథిగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి పాల్గొని సింగపూర్‌ ప్రజలందరికీ తన తరఫున, ప్రధాని మోదీ తరఫున ప్రత్యేకంగా ఉగాది శుభాకాంక్షలు చెప్పారు. అలాగే, మిజోరం గవర్నర్‌ కంభంపాటి హరిబాబు సమాపణోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించగా.. భాజపా మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాద్‌ రావు, భాజపా రాష్ట్ర కోశాధికారి వామరాజు సత్యమూర్తి, తితిదే బోర్డు మాజీ సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తదితరులు వారం రోజుల పాటు జరిగిన వేర్వేరు కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 

భాగవత నేపథ్యం, ఆవిర్భావం నుంచి ప్రారంభించి.. మత్స్య, కూర్మ, వరాహ నారసింహ, వామన, శ్రీకృష్ణ అవతారాలను గురించి డా. మేడసాని అద్భుతంగా ప్రసంగించారు. కథా విశేషాలతో పాటు పోతన రచనా వైశిష్ట్యం గురించి, జీవితంలో ఉపయోగపడే విధంగా భాగవత కథలు నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలను కళ్లకు కట్టినట్లు భాగవతాన్ని అభివర్ణించారు. అమెరికా నుంచి డా. వంగూరి చిట్టెన్ రాజు, లావు అంజయ్య, డా. తోటకూర ప్రసాద్, మల్లిక్ పుచ్చా, బాల ఇందుర్తి, న్యూజిలాండ్ నుంచి శ్రీలత మగతల, విజయ తంగిరాల (ఆస్ట్రేలియా), డా.వంశీరామరాజు, ఊలపల్లి సాంబశివరావు (భారత్‌), డా. వెంకట ప్రతాప్, డా.అచ్చయ్య రావు (మలేషియా), జయ పీసపాటి (హాంకాంగ్‌), రవికుమార్ బొబ్బా (థాయిలాండ్‌), వెంకట రమణ రావు (బ్రునై), ప్రవీణ్ తమ్మినేని (ఇండోనేషియా), రాజేష్ తోలేటి (యూకే), డా. వెంకటపతి తరిగోపుల, శ్రీని జి (నార్వే), మహేంద్ర అన్నపూర్ణ (ఫ్రాన్స్‌), రాధ కొండ్రగంటి (ఐర్లాండ్‌), దీపిక రావి (సౌదీ అరేబియా), ఉసిరికల తాతాజీ, వెంకప్ప భాగవతుల (ఖతార్‌), అనిల్ కడించర్ల (ఒమన్‌), శివ యెల్లాపు (బహ్రైన్‌), వీవీ సురేష్ (యూఏఈ),  సుధాకర్ రావు (కువైట్‌), విక్రమ్ కుమార్ పెట్లూరు (దక్షిణాఫ్రికా), బూరుగుపల్లి వ్యాసకృష్ణ (ఉగండా) తదితర ప్రముఖులు ఈ వారం రోజులపాటు కార్యక్రమంలో వేర్వేరు తేదీల్లో అతిథులుగా పాల్గొని ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాన నిర్వాహకులు రత్న కుమార్ కవుటూరు, నీలం మహేందర్, ఊలపల్లి భాస్కర్, రాంబాబు పాతూరి, కార్యవర్గ సభ్యులు ప్రశాంత్ రెడ్డి, రమేష్ గడప తదితరులు డాక్టర్ మేడసానికి ఇతర అతిథులకు తమ కృతజ్ఞతలు తెలియజేసి ప్రపంచ నలుమూలల నుంచి తెలుగువారంతా కలిసి భాగవత వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. చక్కని వ్యాఖ్యానంతో రాధికా మంగిపూడి సభా నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించగా, రామాంజనేయులు చామిరాజు, సుబ్బు వి. పాలకుర్తి, శ్రీనివాస్ కాసర్ల తదితరులు సహకరించారు. గణేశ్న రాధాకృష్ణ, కాత్యాయని సాంకేతిక నిర్వహణలో ప్రతిరోజూ ఏడు మాధ్యమాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేశారు. ప్రపంచ నలుమూలల నుంచి తెలుగువారంతా భాగవత వైశిష్ట్యాన్ని తెలుసుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని ఆహ్వానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని