బోగస్ బాట పడితే వెంటనే వాపస్!
పై చదువులు, ఉద్యోగాల కోసం అమెరికాకు వస్తున్న విద్యార్థుల్లో కొందరు బోగస్ ధ్రువపత్రాలు సమర్పిస్తున్నట్లు గుర్తించిన అక్కడి ప్రభుత్వం అలాంటి వారి సీట్లను రద్దు చేయటంతో పాటు కేసులు సైతం పెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
విదేశీ విద్యకు వెళ్లే విద్యార్థులపై అమెరికా నిఘా నేత్రం
అక్రమ మార్గాలు ఎంచుకుంటే ఎప్పటికైనా ప్రమాదమేనంటున్న నిపుణులు
పై చదువులు, ఉద్యోగాల కోసం అమెరికాకు వస్తున్న విద్యార్థుల్లో కొందరు బోగస్ ధ్రువపత్రాలు సమర్పిస్తున్నట్లు గుర్తించిన అక్కడి ప్రభుత్వం అలాంటి వారి సీట్లను రద్దు చేయటంతో పాటు కేసులు సైతం పెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికన్ కాన్సులేట్ ఫిర్యాదుతో దిల్లీ పోలీసులు తాజాగా తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కొందరు విద్యార్థులపై కేసులు నమోదు చేయడం సంచలనం రేపింది. తాజాగా అమెరికా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఆ దేశంలో ఎఫ్-1 వీసా(విద్యార్థి)పై ప్రస్తుతం 2.32 లక్షల మంది భారత విద్యార్థులు చదువుతున్నారు. అమెరికా వెళ్లే విద్యార్థుల్లో ఎక్కువ మంది నాణ్యమైన చదువు కంటే అక్కడ హెచ్1-బి వీసా ద్వారా స్థిరపడాలన్న లక్ష్యంతోనే వెళుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐఐటీ పట్టభద్రుడి కన్నా అమెరికా వెళ్లిన సాధారణ విద్యార్థి మెరుగ్గా సంపాదిస్తున్నాడన్న భావన ఇక్కడి యువతలో ఉంది.. అందుకనే ఇటీవల మధ్య, దిగువ మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులూ అక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొందరు అక్రమ మార్గాలు వెతుకుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిపుణులతో జీఆర్ఈ రాయించి మంచి స్కోర్ పొందటం, బ్యాంకు ఖాతాలో విదేశీ చదువుకు అవసరమైన డబ్బు ఉన్నట్లు చూపడం, గతంలోనే బీటెక్ పూర్తయినవారు అప్పటి నుంచి ఉద్యోగం లేకున్నా ఉన్నట్లు చూపటం, చిన్న కంపెనీల నుంచి అనుభవ ధ్రువపత్రాలు సమర్పించడం తదితరాలను అవలంబిస్తున్నారు. దీన్ని అరికట్టేందుకు అమెరికా ప్రభుత్వం నిఘాను పెంచి, కేసులు పెట్టేందుకు సిద్ధమైందని హైదరాబాద్కు చెందిన ఓ విదేశీ కన్సల్సెన్టీ నిర్వాహకుడు ఒకరు తెలిపారు. కొన్ని ప్రముఖ కన్సల్టెన్సీలే తమ ఫీజు కోసం విద్యార్థులను అలా ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
విద్యార్థులూ.. తల్లిదండ్రులూ.. పారాహుషార్
* హైదరాబాద్లోని అమెరికన్ కాన్సులేట్ అధికారులు నకిలీ ధ్రువపత్రాలపై తరచూ రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. ఈక్రమంలోనే ఇటీవల పోలీసులు నకిలీ ధ్రువపత్రాల ముద్రణ ముఠాలను పలుచోట్ల అరెస్టుచేశారు. అక్రమాలపై రాష్ట్ర ఉన్నత విద్యామండలితో జరిగిన సమావేశంలో డీజీపీ మహేందర్రెడ్డి చర్చించారు. ఫలితంగా రాష్ట్రంలోని 15 వర్సిటీలకు చెందిన గత పదేళ్ల ధ్రువపత్రాలను ఒకచోటకు తెచ్చినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య లింబాద్రి తెలిపారు. వెబ్సైట్ ద్వారా ఆయా ధ్రువపత్రాలను కంపెనీలు తనిఖీ చేసుకోవచ్చన్నారు. మరోవంక.. నకిలీ ధ్రువపత్రాలు ముద్రించినవారినే కాక తీసుకున్న వారిపైనా కేసులు నమోదు చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
* ఓయూ, జేఎన్టీయూహెచ్తో పాటు ఏపీలోని కొన్ని వర్సిటీలు నకిలీ ధ్రువపత్రాలను తనిఖీ చేసి వాటి గుట్టు చెబుతున్నాయి. ఆయా విదేశీ విశ్వవిద్యాలయాలు విద్యార్థులు సమర్పించిన సర్టిఫికెట్లను థర్డ్ పార్టీ ద్వారా సంబంధిత వర్సిటీలకు పంపి తనిఖీ చేయిస్తున్నాయి.
* ఒక వర్సిటీ లేదా కంపెనీలో తప్పించుకున్నా మరో కొలువు మారినప్పుడు ఆ పరిశ్రమలు తనిఖీ చేయిస్తున్నాయి. ఫలితంగా ఇటీవల పదుల సంఖ్యలో ఇలా దొరికిపోయి, భారత్కు తిరిగి వస్తున్నారు. గత ఫిబ్రవరి 17న అమెరికాలోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీ ఓ తెలుగు విద్యార్థిని విశ్వవిద్యాలయం నుంచి వెనక్కి పంపించింది. కారణం గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామ్(జీఆర్ఈ) సందర్భంగా మరో వ్యక్తి సహకారం తీసుకొని స్కోర్ సాధించారని తేలడమే.
దొరికితే మళ్లీ విదేశాలకు వెళ్లలేరు
-వేములపాటి అజయ్కుమార్, సంచాలకుడు, ఐఎంఎఫ్ఎస్ కన్సల్టెన్సీ, హైదరాబాద్
విదేశీ విద్యకు వెళ్లేందుకు నకిలీ ధ్రువపత్రాలు సమర్పిస్తున్నారు. ఒకవేళ కన్సల్టెన్సీ ప్రతినిధులు ఏదోలా మేనేజ్ చేద్దామని సలహా ఇచ్చినా విద్యార్థులు అంగీకరించకపోవడం మంచిది. విదేశాలకు వెళ్లాక అయినా ఏదో ఒక సందర్భంలో దొరికిపోతారు. అప్పుడు కేసు నమోదైతే విదేశాల్లో ఉండలేరు. భారత్కు తిరిగొచ్చినా మళ్లీ అక్కడకు వెళ్లలేరు. వీసాను కనీసం అయిదేళ్లు నిషేధిస్తారు. నేర తీవ్రతను బట్టి నిషేధకాలం ఇంకా పెరగొచ్చు.
- ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డాలస్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని డాలస్ నగరంలో ఘనంగా నిర్వహించారు. -
వాషింగ్టన్ డీసీలో ఘనంగా తానా (నరేన్ వర్గం) విజయోత్సవ సభ
తానా ఎన్నికల్లో డా.నరేన్ కొడాలి వర్గం నుంచి గెలిచిన అభ్యర్థులంతా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం శనివారం (మార్చి 23న) సాయంత్రం వాషింగ్టన్ డీసీలో విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించారు. -
సింగపూర్లో స్వరలయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఘనంగా త్యాగరాజ ఆరాధనోత్సవాలు
మార్చి 18న స్వరలయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో సింగపూర్లో నివసించే తెలుగు గాయకులు ఉత్సాహంగా త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరుపుకొన్నారు. -
NATS: డల్లాస్లో వైభవంగా నాట్స్ తెలుగు వేడుకలు
నాట్స్ తెలుగు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు డల్లాస్లోని పది వేల మందికిపైగా తెలుగువారు హాజరయ్యారు. -
లండన్లో సీబీఈ అవార్డు అందుకున్న తెలుగు బిడ్డ డా.కన్నెగంటి చంద్ర
నిజామాబాద్ జిల్లాలో జన్మించి లండన్లో స్థిరపడిన భారతీయ వైద్యుడు కన్నెగంటి చంద్ర ప్రతిష్ఠాత్మక ‘కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (సీబీఈ)’ పురస్కారాన్ని అందుకొన్నారు. -
Indra Nooyi: అమెరికాలో వరుస ఘటనలు.. భారత విద్యార్థులకు ఇంద్రానూయీ సూచనలు
అమెరికా (USA)లో ఉన్న భారత విద్యార్థులకు పెప్సీకో మాజీ సీఈఓ ఇంద్రానూయీ(Indra Nooyi) పలు సూచనలు చేశారు. -
కూటమిని గెలిపిద్దాం.. రాష్ట్రాన్ని కాపాడుకుందాం: ఎన్ఆర్ఐల తీర్మానం
అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియాలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన ఎన్ఆర్ఐలు ఆదివారం సమావేశమయ్యారు. -
Indian origin Family: అనుమానాస్పద స్థితిలో కెనడాలో భారత సంతతి కుటుంబం మృతి
కెనడా(Canada)లో భారత సంతతికి చెందిన ముగ్గురు కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. వారి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
జనసేన ఆవిర్భావ వేడుకల వేళ.. డల్లాస్లో జనసేన, తెదేపా, భాజపా ఆత్మీయ సమావేశం
డల్లాస్లో జనసేన ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు జనసేన నేతలతో పాటు తెదేపా, భాజపా క్యాడర్కు చెందిన పలువురు హాజరయ్యారు. -
సింగపూర్లో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు
సింగపూర్లో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. -
న్యూజెర్సీలో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు
శివుడికి ప్రీతిపాత్రమైన మహా శివరాత్రి పర్వదినాన ‘హర హర మహాదేవ శంభో శంకర’ అంటూ అగ్రరాజ్యంలో ఎన్నారైలు ముక్తకంఠంతో నినదించారు. -
న్యూజెర్సీలో ఓఎఫ్ భాజపా ఆధ్వర్యంలో ‘ఛాయ్పే చర్చ’
న్యూజెర్సీలోని ఎడిసన్ నగరంలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ (BJP) ఆధ్వర్యంలో ‘ఛాయ్ పే చర్చ’ నిర్వహించారు. -
బే ఏరియాలో ‘తెదేపా-జనసేన-భాజపా’కు చెందిన ఎన్ఆర్ఐల ఆత్మీయ సమావేశం
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో స్థిరపడిన ఎన్ఆర్ఐలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. -
అమెరికాలో మే 24-26 మధ్య టీటీఏ మహాసభలు
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) అగ్రరాజ్యంలో భారీగా మహాసభలు నిర్వహించనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు టీటీఏ అధ్యక్షుడు వంశీరెడ్డి కంచరకుంట్ల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. -
సౌదీ అరేబియాలో తెదేపా-జనసేన ఎన్నారై కూటమి సమావేశం
సౌదీ అరేబియాలోని జుబైల్లో తెదేపా-జనసేన ఎన్నారై కూటమి భేటీ అయ్యింది. రాబోయే ఎన్నికలకు వ్యూహరచన చేసేందుకు ‘ఎన్నికల సన్నాహక ఆత్మీయ సమావేశం’ పేరిట ఈ భేటీ నిర్వహించారు. -
డెట్రాయిట్లో అట్టహాసంగా మహిళా దినోత్సవం
గ్లోబల్ తెలంగాణ సంఘం డెట్రాయిట్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. -
తానా బోర్డు ఛైర్మన్గా డా.నాగేంద్ర శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో ప్రతిష్ఠాత్మక బోర్డు ఛైర్మన్ పదవికి డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
డెట్రాయిట్లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
అంతర్జాతీయ మహిళల దినోత్సవం(మార్చి 8) పురస్కరించుకుని ఫార్మింగ్టన్ మేనర్లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (జీటీఏ) డెట్రాయిట్ మహిళా విభాగం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన లేడీస్ నైట్ అట్టహాసంగా జరిగింది. -
TDP - Janasena: షికాగోలో ఘనంగా తెదేపా - జనసేన ఆత్మీయ సమావేశం
తెదేపా, జనసేన నాయకులు షికాగోలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. -
TANA Foundation: తానా ఫౌండేషన్ ఛైర్మన్గా శశికాంత్ వల్లేపల్లి
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ఫౌండేషన్ చైర్మన్గా శశికాంత్ వల్లేపల్లి ఎన్నికయ్యారు. -
Sporty Divas: ఇండో-గల్ఫ్ త్రోబాల్ ఛాంపియన్షిప్ విజేతగా అమెరికా జట్టు
బహ్రెయిన్లో నిర్వహించిన ‘ఇండో-గల్ఫ్ ఇంటర్నేషనల్ త్రోబాల్ ఛాంపియన్షిప్’లో అమెరికాకు చెందిన మహిళల జట్టు ‘స్పోర్టీ దివాస్’ విజేతగా నిలిచింది.