‘గ్రేటర్‌ వాషింగ్టన్‌ తెలుగు సంఘం’ సభ్యులను సత్కరించిన జగపతిబాబు

కరోనా సమయంలో అమెరికాలో విశేష సేవలందించిన ‘గ్రేటర్‌ వాషింగ్టన్‌ తెలుగు సంఘం (జీడబ్ల్యూటీఎస్‌)’ సభ్యులను ప్రముఖ నటుడు జగపతిబాబు

Published : 15 May 2022 22:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా సమయంలో అమెరికాలో విశేష సేవలందించిన ‘గ్రేటర్‌ వాషింగ్టన్‌ తెలుగు సంఘం (జీడబ్ల్యూటీఎస్‌)’ సభ్యులను ప్రముఖ నటుడు జగపతిబాబు సత్కరించారు. ఆహారంతో పాటు వేలాది కరోనా కిట్లు అందించి వైద్యసహాయంలో ముందున్నారని కొనియాడారు. వాషింగ్టన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గ్రేటర్‌ వాషింగ్టన్‌ తెలుగు సంఘం ప్రెసిడెంట్‌ సాయిసుధ పాలడుగు, టీమ్‌ సభ్యులు రవి వెనిగళ్ల, గోపాల్‌ సీలమనేని, రామ్‌చౌదరి ఉప్పుటూరి, ప్రసాద్‌ మట్టుపల్లి, వంశీ తదితరులకు జగపతిబాబు అవార్డులు అందజేసి అభినందించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని