శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పెట్టుబడులు ఇంకా పెరగాలి
ప్రతిష్ఠాత్మకమైన ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధ్యక్షుడిగా ప్రొఫెసర్ చెన్నుపాటి జగదీశ్ ఎన్నికయ్యారు. ఈ నెల 26న ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. నాలుగేళ్లపాటు ఆయన ఈ
ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధ్యక్షుడు చెన్నుపాటి జగదీశ్ సూచన
ఇటీవల అధ్యక్షుడిగా ఎన్నికైన తెలుగుతేజం
ఈ నెల 26న బాధ్యతల స్వీకరణ
ఈనాడు, హైదరాబాద్: ప్రతిష్ఠాత్మకమైన ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధ్యక్షుడిగా ప్రొఫెసర్ చెన్నుపాటి జగదీశ్ ఎన్నికయ్యారు. ఈ నెల 26న ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. నాలుగేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఆయన ప్రస్తుతం ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్, మెటీరియల్ ఇంజినీరింగ్ విభాగం విశిష్ట ఆచార్యుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా వల్లూరుపాలెంకు చెందిన ఆయన వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పొందారు. ఆంధ్రా, నాగార్జున, దిల్లీ యూనివర్సిటీల్లో చదువుకున్నారు. అటు ఆస్ట్రేలియాలో.. ఇటు భారత్లో శాస్త్ర, సాంకేతిక (సైన్స్, టెక్నాలజీ) రంగాలకు ఉన్న ప్రాధాన్యాలు ఏంటి? రాబోయే కాలంలో ఎలాంటి మార్పులు అవసరం? మన దేశ విద్యా విధానంలో ఉన్న పరిస్థితులపై ఆయన ‘ఈనాడు’ తో మాట్లాడారు.. వివరాలివి..
ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కార్యకలాపాలేంటి? అక్కడ ఎలాంటి పాత్ర పోషిస్తోంది?
ఆస్ట్రేలియన్ పార్లమెంట్కి, ప్రభుత్వానికి శాస్త్ర (సైన్స్) అంశాలపై ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సలహాలిస్తుంది.
మీరు చాలా కాలంగా ఆస్ట్రేలియాలో ఉన్నారు? అక్కడి ప్రభుత్వం శాస్త్ర సాంకేతికత విషయంలో ఎలాంటి ప్రాధాన్యం ఇస్తోంది?
ఆస్ట్రేలియాలో సైన్స్, సాంకేతికతకు ప్రాధాన్యం ఇస్తుంటారు. కొవిడ్ నేపథ్యంలో ఈ ప్రాధాన్యం మరింత పెరిగింది. ప్రజలు, ప్రభుత్వం సైన్స్ వల్ల ఎంత ఉపయోగం ఉందో తెలుసుకోగలిగారు. తక్కువ సమయంలో ఇన్ని వ్యాక్సిన్లు తయారు చేయగలిగామంటే ప్రపంచం మొత్తం సైన్స్, సాంకేతిక రంగాల్లో 40 ఏళ్లుగా పెట్టుబడి పెట్టడంతోపాటు పరిశోధనల కారణంగానే సాధ్యమైంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో దీర్ఘకాలిక పెట్టుబడులు చాలా అవసరం.
కొవిడ్ పరిస్థితుల వల్ల శాస్త్ర సాంకేతిక రంగాల్లో అవసరమైన పరిశోధనలకు ఉన్న ప్రాధాన్యమేంటి?ఎలాంటి ముందుచూపు అవసరమని గుర్తించారు? ఆస్ట్రేలియాతో పోలిస్తే భారత్లో ప్రభుత్వాలు సైన్స్, సాంకేతికతకు ఎలాంటి ప్రాధాన్యం ఇస్తున్నాయి?
భారత ప్రభుత్వం నూతన ఐఐటీలను ప్రారంభించింది. ప్రతి రాష్ట్రంలోనూ ఎయిమ్స్లను ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచించడం మంచి పరిణామమే. ప్రపంచంలోని అన్ని దేశాలూ సైన్స్ను వ్యాపారాత్మకంగా మార్చాలన్న దానిపై దృష్టి పెట్టాయి. ముందు ఫండమెంటల్, బేసిక్ సైన్స్కు మద్ధతు తెలపాలి.
దేశంలో శాస్త్ర సాంకేతిక రంగాలకు తగినంత ప్రాధాన్యం కన్పిస్తోందా?
మన దేశం శాస్త్ర సాంకేతిక రంగాలపై పెట్టుబడి పెడుతోంది. భారత దేశం జనాభాపరంగా పెద్దది కాబట్టి పెట్టుబడులు పెంచాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడల్లా యువ శాస్త్రవేత్తలు, విద్యార్థులతో మాట్లాడుతుంటాను. శాస్త్ర సాంకేతిక రంగంలో అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం పెట్టుబడి పెడితే అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం పరికరాలకు డబ్బు ఇస్తోంది కానీ వాటి నిర్వహణకు ఇవ్వడం లేదని, దాంతో ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. భారత ప్రభుత్వం సౌకర్యాలు కల్పించిన తరువాత నిర్వహణకు డబ్బు ఇస్తే దానివల్ల ఉపయోగం ఉంటుంది. తద్వారా యువ శాస్త్రవేత్తలు, విద్యార్థులు లబ్ధి పొందుతారన్నది నా అభిప్రాయం.
కొవిడ్ సమయంలో హైదరాబాద్ నుంచి అద్భుతమైన వ్యాక్సిన్లు వచ్చాయి? ఇంకా తగినంత ప్రాధాన్యం కావాలని అర్థం చేసుకోవచ్చా?
సంవత్సర కాలంలో వ్యాక్సిన్ తయారు చేయగలిగామంటే అంతకుముందు 30ఏళ్ల పాటు పరిశోధనలు జరిగాయి. అవి చేయలేకపోతే రాత్రికి రాత్రే మనం ఆ వ్యాక్సిన్ తయారు చేసి ఉండేవాళ్లం కాదు. దీనికి దీర్ఘకాలిక పెట్టుబడులు అవసరం.
మన దేశంలో ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం ఎలా ఉంది?
పిల్లలకు ఉద్యోగం రావాలని తల్లిదండ్రులకు కోరిక ఉంటుంది. అందుకే ఇంజనీరింగ్ చదవండి, ఎంబీబీఎస్ చదవండని బలవంతం చేస్తాం. అది కాదు.. పిల్లలకు ఏదీ ఇష్టమైతే అది చదివించగలిగితే వాళ్లు జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. పిల్లలకు ఇష్టమైన వాటిని ప్రోత్సహించడం తల్లిదండ్రుల బాధ్యత. లేకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో మేధో సమస్య ఉత్పన్నమవుతుంది. దీనివల్ల సైన్స్ అండ్ టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేం.
ఆస్ట్రేలియాలో చాలా యూనివర్సిటీలపై మీకు అవగాహన ఉంది. భారత్లో కూడా ఐఐఎమ్, ఐఐటీలపైన అధ్యయనం చేస్తున్నారు. ఇక్కడ కోర్సుల రూపకల్పన, విద్యా బోధన విధానంలో ఏవైనా లోపాలు గుర్తించారా? ఎలాంటి మార్పులు అవసరమని భావిస్తున్నారు?
మన దేశంలో వివిధ రకాల విశ్వవిద్యాలయాలు ఉండటంతో విద్య అద్భుతంగా ఉంది. ఆస్ట్రేలియాలో తరగతి గదిలోకి వెళ్లి బోధించకుండా ఫ్లిప్ క్లాసెస్ నిర్వహిస్తున్నాం. లెక్చరర్ బోధనను రికార్డింగ్ చేస్తే విద్యార్థులు ఎన్నిసార్లు వినాలన్నా వినవచ్చు. విద్యార్థులు పాఠాన్ని ఒకటికి రెండుసార్లు వింటే అవగాహన పెంపొందుతుంది. క్లాస్కు వచ్చి చర్చ పెడితే విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయవచ్చు.
శాస్త్ర, సాంకేతిక పరిశోధకుడిగా, అధ్యాపకుడిగా ప్రపంచవ్యాప్తంగా అనేక సదస్సుల్లో పాల్గొన్నారు? ఈ రంగంలో ఏ దేశంలో మంచి విధానాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారు? వాటి నుంచి భారత్ నేర్చుకోవాల్సిన అంశాలేమైనా ఉన్నాయా?
మన దృష్టి అంతా భవిష్యత్తు తరాలపై ఉంది. ఆస్ట్రేలియాలో అయినా.. భారత్లో అయినా యువతకు అవకాశాలు కల్పిస్తే వాళ్లు వాటిని సద్వినియోగం చేసుకొని దేశాభివృద్ధికి దోహదపడతాయి. కాబట్టి యువతరం మీద పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది. కొన్ని దేశాల్లో యువతకు ఫెలోషిప్స్తో పాటు ఫండ్ కూడా ఏర్పాటు చేశారు. యూకే, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, హాంకాంగ్ వంటి దేశాల్లో ఇలాంటి సదుపాయాలు ఉన్నాయి. యువతను లక్ష్యంగా పెట్టుకుని కార్యక్రమాలు రూపొందిస్తే ఇక్కడ కూడా పరిస్థితి బాగు పడుతుంది.
తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి ఏటా అనేక దేశాలకు విద్యనభ్యసించేందుకు ఎంతోమంది వెళుతున్నారు. ప్రత్యేకంగా ఆస్ట్రేలియాకూ చాలామంది వస్తుంటారు. అక్కడి యూనివర్సిటీలను ఎంచుకునేందుకు ఇక్కడి విద్యార్థులకు మీరిచ్చే సూచనలు ఏంటి?
ఆస్ట్రేలియాకు తెలుగువాళ్లు చాలామంది వస్తున్నారు. విద్యార్థులు తమకు నచ్చిన కోర్సును ఎంచుకుంటే ఇష్టంతో చదువుతారు. కాబట్టి జీవితంలో పైకి వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. ఉద్యోగం వస్తుందని చదవడం కంటే.. మనకు నచ్చింది ఎంచుకోవాలి.
యూనివర్సిటీని ఎంచుకోవడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కన్సల్టెన్సీలు చాలా విషయాలు చెబుతుంటాయి.
ఉత్తమమైన యూనివర్సిటీకి వెళితే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పేరున్న యూనివర్సిటీలో చదివితే అవకాశాలు త్వరగా వస్తాయి.
ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మారుమూల పల్లెటూరు నుంచి ఉన్నత స్థానానికి ఎదిగారు. నేటి యువత కోసం ఏమి చేయనున్నారు?
జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగినప్పుడు ఏ గ్రామం నుంచి ఏ స్థాయి నుంచి వచ్చామన్నది మరిచిపోకూడదు. హైస్కూల్లో ఉన్నప్పుడు నాకు ఇద్దరు ఉపాధ్యాయులు సహాయం అందించారు. నేను నా సొంత డబ్బుతో యువ శాస్త్రవేత్తలకు సహాయ సహకారాలు అందిస్తా. ప్రతి ఒక్కరూ ఉన్నతస్థితికి వెళ్లాక తమ వంతు సహకారం అందిస్తే యువతతో పాటు దేశం అభివృద్ధి చెందుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్
-
భద్రాచలం తరహాలో అమెరికాలో రామాలయం
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు. -
సింగపుర్లో శ్రీ మారియంబికా ఆలయంలో ఘనంగా చండీహోమం
సింగపుర్లోని వాసవీ క్లబ్ మెర్లయన్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు అత్యంత పురాతన, విశిష్టమైన శ్రీ మారియంబికా ఆలయంలో చండీహోమం నిర్వహించారు. -
కూటమి గెలిస్తేనే ఏపీకి భవిష్యత్తు.. ఖతార్లో తెదేపా ఆవిర్భావ వేడుకల్లో నేతలు
తెదేపా ఆవిర్భావ వేడుకలు ఖతార్లో ఘనంగా నిర్వహించారు. ఖతార్ తెలుగుదేశం పార్టీ నేతల ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
ప్రాచీన భారతీయ సాహిత్యం- ఆధునిక విజ్ఞాన వికాసంపై తానా ప్రపంచ సాహిత్యవేదిక సదస్సు
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ‘ప్రాచీన భారతీయ సాహిత్యం- ఆధునిక విశ్వ విజ్ఞానశాస్త్ర వికాసానికి మూలం’ అనే అంశంపై సదస్సు విజ్ఞానదాయకంగా జరిగింది. -
ఘనంగా క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ (QEF) వెబ్సైట్ ఆవిష్కరణ
ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్వచ్ఛమైన సమాజమే లక్ష్యంగా ఆవిర్భవించిన క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ తన వెబ్సైట్ను www.qef.org ఆవిష్కరించింది. నాణ్యమైన సాంకేతిక ప్రయాణంలో దీన్నొక మైలురాయిగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు వక్తలు పేర్కొన్నారు. -
ఏపీని ఆదుకునే ఎన్నారైలపై ఇంత అక్కసా?: జయరాం కోమటి
రాష్ట్రానికి మేలు చేసేలా కృషిచేస్తున్న ఎన్నారైలపై వైకాపా నాయకులు బెదిరింపులకు పాల్పడటం అత్యంత దారుణమని ప్రముఖ ప్రవాసాంధ్రుడు, ఎన్నారై తెదేపా అమెరికా సమన్వయకర్త జయరాం కోమటి అన్నారు. -
ఎన్ఆర్ఐ తెదేపా, జనసేన ఆధ్వర్యంలో తెదేపా ఆవిర్భావ వేడుకలు
ఎన్ఆర్ఐ తెదేపా కువైట్, జనసేన కువైట్ సంయుక్త ఆధ్వర్యంలో తెదేపా 42వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల