తెదేపా గల్ఫ్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు
తెదేపా వ్యవస్థాపకుడు, తెలుగు చిత్రసీమలో రారాజుగా వెలుగొందిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఎన్నారై తెదేపా- కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.......
కువైట్: తెదేపా వ్యవస్థాపకుడు, తెలుగు చిత్రసీమలో రారాజుగా వెలుగొందిన నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు ఎన్నారై తెదేపా- కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. 2008లో చంద్రబాబునాయుడును తొలిసారి కలిసి కువైట్లో పార్టీని ప్రారంభించిన సీనియర్ నాయకుడు వెంకట్ కోడూరి ఈ వేడుకలకు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. మైనార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ బొర్రా, ఎన్నారై తెదేపా కువైట్ మైనారిటీ విభాగం కమిటీ సభ్యులు, ఎన్నారై తెదేపా గల్ఫ్ కమిటీ సభ్యులు, ఎన్టీఆర్ సేవా సమితి కమిటీ సభ్యులు, ఎన్టీఆర్- పరిటాల ట్రస్ట్, చంద్రన్న సేవా సమితి కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నారా, నందమూరి అభిమానులంతా కలిసి ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సందర్భంగా ఆయన్ను స్మరించుకున్నారు. కేక్ కట్ చేసి.. ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారంతా కలిసి ఈ ఏడాది మొత్తం ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు చేయాలని తీర్మానం చేశారు.
ఈ సందర్భంగా గౌరవ అతిథి వెంకట్ కోడూరి మాట్లాడుతూ.. ‘‘అన్న నందమూరి తారక రామారావు తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారు. తెలుగు జాతి అభ్యున్నతికి చంద్రబాబు ఏ విధంగా కష్టపడి పని చేశారో మనందరికీ తెలుసు. ఈ రోజు ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతూ, శాంతి భద్రతలు విషయంలో విఫలమవ్వడంతో రాష్ట్రంలో అభివృద్ధి ఎలా కుంటుపడిందో అందరం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఏపీలో జరుగుతున్న స్వార్థపూరిత రాజకీయ కుట్రల వల్ల వ్యవస్థలు ఏరకంగా గాడి తప్పుతున్నాయో చూస్తున్నాం. ప్రజలంతా అప్రమత్తమై రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా శత జయంతి ఉత్సవాలు 2023 మే 28 వరకు జరుగుతాయి గనక జూన్ 10న ఓ కార్యక్రమం చేసేందుకు, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణను ఆహ్వానించాం. వారి సమయాన్ని బట్టి కువైట్లో తెదేపా అభిమానులు, కార్యకర్తల కోసం కార్యక్రమాలను రూపకల్పన చేయనున్నాం’’ అని కువైట్లో ఉన్న కార్యకర్తలకు ఆయన తెలియజేశారు.
అనంతరం ఎన్నారై తెదేపా మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి ముస్తాక్ ఖాన్ మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం మైనార్టీ హక్కులు, సంక్షేమ కార్యక్రమాల్లో అన్యాయం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కులాల మధ్య విభేదాలు సృష్టిస్తూ రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్న విషయాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనించాలని ఎన్నారై టీడీపీ గల్ఫ్ నేత శంకర్ సూచించారు. ఆ రోజు చంద్రబాబునాయుడు రాయలసీమ కోసం కడపలో స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తే దాని తర్వాత ఇంతవరకు కూడా పురోగతి లేదని ఎన్ఆర్ఐ తెదేపా కువైట్ సెల్ నేత ఓలేటి రెడ్డయ్య చౌదరి అన్నారు. ఈ కార్యక్రమంలో బాలా రెడ్డయ్య, విజయ్ కుమార్ చౌదరి, ఖదీర్ బాషా, గౌహర్ అలీ, నారాయణమ్మ, అంజలి, అంజనా రెడ్డి , నిర్మలమ్మ, కరీముల్లా, బాబ్జీ, అస్లం, మహుమ్మద్ అలీ, మనోహర్, మహుమ్మద్, జబీవుల్లా తదితరులు పాల్గొన్నారు. ఈ శత జయంతి వేడుకలను ఎన్నారై తెదేపా సెల్ కువైట్ నేతలు ఓలేటి రెడ్డి, షేక్ ఎండీ అర్షద్ సమన్వయం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్
-
భద్రాచలం తరహాలో అమెరికాలో రామాలయం
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్