న్యూజెర్సీలో ఎస్పీ బాలు జయంతి

దివంగత గాన గంధర్వుడు పద్మవిభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 75వ జయంతి కార్యక్రమం జూన్ 3న (శుక్రవారం) అమెరికాలో న్యూ జెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ నగరంలో జరిగింది.

Updated : 05 Jun 2022 19:54 IST

న్యూజెర్సీ: దివంగత గాన గంధర్వుడు పద్మవిభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 75వ జయంతి కార్యక్రమం జూన్ 3న (శుక్రవారం) అమెరికాలో న్యూ జెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ నగరంలో జరిగింది. కళావేదిక నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి, ప్రముఖ యాంకర్, నటి సుమ కనకాల, ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, న్యూజెర్సీ అసెంబ్లీ సభ్యుడు స్టెర్లి స్టాన్లీ, న్యూజెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ కమిషనర్ ఉపేంద్ర చివుకుల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

విజయవాడ కనకదుర్గ దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మర్షి శాండిల్య శర్మ వేద ఆశీర్వచనంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ముందుగా ఎస్పీబీ చిత్రపటానికి పుష్పాలతో నివాళి అర్పించారు. ప్రముఖ గాయనీమణులు ఉష, రీటా, మౌనిమ, అదితి భావరాజు, మౌనిక, శ్రీకాంత్ సండుగు, కార్యక్రమ వ్యాఖ్యాత సాహితి తదితరులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో తమ అనుబంధాన్ని, ఆయన గొప్పతనాన్ని సభికులతో పంచుకున్నారు. ఉత్తర అమెరికా సీమాంధ్ర అసోసియేషన్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 700 మందికి పైగా ఎస్పీబీ అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారికీ సహకరించిన వారికీ కళావేదిక అధ్యక్షులు స్వాతి అట్లూరి, కార్యదర్శి సింగర్ ఉష, కో-ఆర్డినేటర్ ఉజ్వల్, బోర్డు ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి ధన్యవాదాలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని