కొవిడ్ సామగ్రి దగ్ధంపై ‘తానా’ స్పందన
విశాఖలోని ఓ గోదాములో ఇటీవల సంభవించిన అగ్ని ప్రమాద ఘటనలో తాము వితరణగా అందించిన కొవిడ్ సామగ్రి బుగ్గిపాలు అవ్వడంపై తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) విచారం వ్యక్తంచేసింది.
ఇంటర్నెట్ డెస్క్: విశాఖలోని ఓ గోదాములో ఇటీవల సంభవించిన అగ్ని ప్రమాద ఘటనలో తాము వితరణగా అందించిన కొవిడ్ సామగ్రి బుగ్గిపాలు కావడంపై తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) విచారం వ్యక్తంచేసింది. ప్రజా సేవ కోసం ఉద్దేశించిన సామగ్రి దగ్ధమవ్వడం దురదృష్టకరమని పేర్కొంది. ఈ ఘటనలో వాస్తవాలు తెలియకుండా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించింది. ఈ మేరకు తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, ఛైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ ఓ ప్రకటన విడుదల చేశారు. వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు.
కరోనా సంబంధిత సహాయ సామగ్రిని తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు అందించేందుకు తానా 2021 జూన్లో శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. నార్త్ వెస్ట్ మెడికల్స్ (చికాగో) సాయంతో కొనుగోలు చేసిన ఈ సామగ్రిని హపగ్ లాయిడ్ సంస్థ ద్వారా సముద్ర మార్గంలో తెలుగు రాష్ట్రాలకు చేరవేసేందుకు ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. కొన్ని అవాంతరాల తర్వాత చికాగోలోని గోదాముల నుంచి అక్టోబర్లో విశాఖ పంపించామని పేర్కొన్నారు. మూడు నెలల తర్వాత అవి 2022 జనవరిలో విశాఖ పోర్టుకు చేరాయని వివరించారు. పోర్టులో స్థలాభావం కారణంగా కొన్ని రోజులు వేచి చూడాల్సి వచ్చిందని, తర్వాత కస్టమ్స్ క్లియరెన్సు కోసం మరికొంత సమయం పట్టిందని తెలిపారు. ఈ సామగ్రిని దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపేందుకు రెడ్క్రాస్తో మార్చిలో అవగాహన కుదిరిందని వివరించారు.
ఈ క్రమంలో ఏప్రిల్లో సంభవించిన తుపాను కూడా ఈ కార్యక్రమానికి కొంత ఆటంకం కలిగించిందని వారిరువురు పేర్కొన్నారు. ఈ ఏడాది మే నెలలో సామగ్రి పంపిణీకి ప్రణాళిక రూపొందించి రెడ్ క్రాస్కు ఆ సామగ్రిని అందజేసినట్లు తెలిపారు. దీంతో షిప్పింగ్ యార్డ్ నుంచి విశాఖ గాజువాకలోని శ్రావణ్ షిప్పింగ్ సంస్థకు సామగ్రిని తరలించినట్లు పేర్కొన్నారు. జూన్ రెండో వారంలో ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఏపీ గవర్నర్ చేతులమీదుగా ప్రారంభించేందుకు తలపెట్టగా, జూన్ 1న ఈ దుర్ఘటన జరిగిందని వివరించారు. తానా సభ్యులు, నాయకత్వం ఎంతో కష్టపడి సేకరించిన కొవిడ్ సామగ్రి ఇలా అగ్నికి ఆహుతవ్వడం దురదృష్టకరమని విచారం వ్యక్తంచేశారు. మంటల్లో కాలిపోయిన సహాయ సామగ్రికి సంబంధించి ఇన్సూరెన్స్ విషయమై రెడ్క్రాస్తో చర్చిస్తున్నామని తెలిపారు. ఎంతో గొప్ప ఉద్దేశంతో తానా తలపెట్టిన ఈ కార్యక్రమం ఆగిపోవడం బాధాకరమని, కానీ ఇవేమీ తెలీకుండా కొందరు అవాస్తవాలు ప్రచారం చేయడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు. తానా ఎప్పుడూ పారదర్శకంగా ఉంటుందని, ఈ విషయంలో ఎటువంటి సమాచారం ఇవ్వడానికైనా తానా సిద్ధంగా ఉంటుందని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్
-
భద్రాచలం తరహాలో అమెరికాలో రామాలయం
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు. -
సింగపుర్లో శ్రీ మారియంబికా ఆలయంలో ఘనంగా చండీహోమం
సింగపుర్లోని వాసవీ క్లబ్ మెర్లయన్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు అత్యంత పురాతన, విశిష్టమైన శ్రీ మారియంబికా ఆలయంలో చండీహోమం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్