డాలస్‌లో ఘనంగా శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం

అమెరికాలోని డాలస్‌లో శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణం వైభవంగా జరిగింది. డాలస్‌ తెలంగాణ ప్రజా సమితి...

Updated : 26 Jun 2022 02:07 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అమెరికాలోని డాలస్‌లో శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణం వైభవంగా జరిగింది. డాలస్‌ తెలంగాణ ప్రజా సమితి ఆధ్వర్యంలో జరిగిన స్వామివారి కల్యాణ వేడుకకు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదమంత్రాల మధ్య శ్రీవారి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. కల్యాణోత్సవంలో పాల్గొనేందుకు ప్రత్యేకంగా స్పాన్సర్‌షిప్‌ ప్యాకేజీలను డాలస్‌ తెలంగాణ ప్రజా సమితి అందుబాటులో ఉంచింది. కన్నులపండువగా జరిగిన కల్యాణోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని