న్యూజెర్సీలో తెదేపా మహానాడు

తెదేపా ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో అమెరికాలోని న్యూజెర్సీలో మహానాడు కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి

Updated : 27 Jun 2022 06:24 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపా ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో అమెరికాలోని న్యూజెర్సీలో మహానాడు కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ..ఏపీలో తెదేపా తిరిగి అధికారంలోకి రావడానికి ప్రవాసాంధ్రులు కీలక భూమిక పోషించాలని కోరారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. ప్రజాబలంతో తెదేపా రాజకీయ కుట్రలను  ఎదుర్కొని నిలబడిందని శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ తెలిపారు. కార్యక్రమంలో తెదేపా ఎన్నారై విభాగం అమెరికా కోఆర్డినేటర్‌ కోమటి జయరాం, గుంటూరు మిర్చియార్డు మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని