‘ది పార్లమెంట్‌ ప్రైజ్‌ 2022’ విజేత అరుణ్‌ గోగినేని

ఆస్ట్రేలియాలో నిర్వహించిన ‘ది పార్లమెంట్‌ ప్రైజ్‌ 2022’ పోటీల్లో బాబు గోగినేని కుమారుడు అరుణ్‌ గోగినేని అద్భుత ప్రతిభ కనబర్చి విజేతగా నిలిచాడు.

Published : 12 Aug 2022 12:54 IST

ఆస్ట్రేలియాలో నిర్వహించిన ‘ది పార్లమెంట్‌ ప్రైజ్‌ 2022’ పోటీల్లో బాబు గోగినేని కుమారుడు అరుణ్‌ గోగినేని అద్భుత ప్రతిభ కనబర్చి విజేతగా నిలిచాడు. ఈ సందర్భంగా బాబు గోగినేని ఆనందం వ్యక్తం చేశారు. కొవిడ్‌ ఐసోలేషన్‌లో ఉన్నప్పటికీ తన కుమారుడు ఎంతో కష్టపడి తన ప్రజెంటేషన్ ఇచ్చాడని ప్రశంసించాడు.

‘‘పోటీల్లో తన ప్రసంగాన్ని పంపేందుకు అదే చివరి రోజు. అప్పటికీ అరుణ్ ఇంకా కొవిడ్ ఐసోలేషన్‌లో ఉన్నాడు. తెల్లవారుజామున 2.30 గంటల వరకు మేల్కొని తన ప్రసంగాన్ని సిద్ధం చేసుకున్నాడు. చిన్నారుల క్రిమినల్‌ నేరాలకు సంబంధించి ఆస్ట్రేలియా ఎందుకు తన చట్టాలను ఆధునీకరించాలి అన్న అంశంపై మాట్లాడారు. ఈ వీడియో ప్రసంగాన్ని డెడ్‌లైన్‌ కంటే కేవలం 30 సెకన్ల ముందు పంపించాడు. ఈ పోటీల్లో విజయం సాధించాడు’’ అని రాసుకొచ్చారు.

 10వ తరగతి వరకు భారత్‌లో చదువుకున్న అరుణ్ గోగినేని ఉన్నత చదువు కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. ఇటీవల అక్కడ ఆస్ట్రేలియన్ ఛార్టర్‌ ఆఫ్ హ్యూమన్‌ రైట్స్‌ అండ్ ఫ్రీడమ్‌ అంశానికి సంబంధించి వ్యాసరచన పోటీల్లో విజేతగా నిలిచాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని