ఘంటసాల భగవద్గీతని వినడం నా అదృష్టం: దేవిశ్రీ ప్రసాద్
అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి వేడుకల సందర్భంగా ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వడం
అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి వేడుకల సందర్భంగా ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదం ఊపందుకున్న సంగతి తెలిసిందే. శంకర నేత్రాలయ యూఎస్ఏ అధ్యక్షుడు బాలరెడ్డి ఇందుర్తి ఆధ్వర్యములో పలు చర్చా కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ‘‘నాకు తెలిసినంత వరకూ ఈ సినీ జగత్తులో అటు గాయకులుగా, ఇటు సంగీత దర్శకుడిగా ఖ్యాతిగడించిన వ్యక్తి ఘంటసాల. మా నాన్న ఘంటసాల గురించి చెబుతూ ‘ఆయన పాడిన పాటలు ఎందరికో ప్రేరణ. గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఘంటసాల పాటలు నుంచి ప్రేరణ పొందారు’ అని చెప్పేవారు. ఎన్ని తరాలు మారినా, గుర్తుండి పోయే వ్యక్తి ఘంటసాల. ఆయన ఆలపించిన భగవద్గీత మన అందరి హృదయాలలో ఇప్పటికి ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ లోకం ఉన్నంత కాలం ఆయన ఆలపించిన భగవద్గీత ఉండిపోతుంది. దానిని వినడం మనం, రాబోయే తరాలు చేసుకున్న అదృష్టం’’ అని అన్నారు.
కార్యక్రమంలో సింగపూర్ నుంచి రత్న కుమార్ కవుటూరుతో పాటు వంశీ ఇంటర్నేషనల్ అధ్యక్షులు వంశీ రామరాజు... తెలంగాణ కల్చరల్ సొసైటీ నుంచి నీలం మహేందర్, సుబ్బు వి పాలకుర్తి, తోట సహదేవుడు, వేణు మల్లవరపు, రామాంజనేయులు చామిరాజు, అనంత్ బొమ్మకంటి, రవి విశ్వాత్ముల, గుంటూరు వెంకటేష్, ప్రమీల గోపు, శ్రీని జాలిగామ... నీలిమ గడ్డమణుగు బృందం నుంచి శ్రీకాంత్ లంక, హిరణ్య ఆత్రేయపురపు, సుబ్బు ఆత్రేయపురపు, శ్రవణ్ మట్ల పూడి, శాంతకుమారి మేడిచర్ల, సాయి శిరీష లంక, విజు కాకతీయ చిలువేరు, మైత్రి సంస్థ వ్యవస్థాపకులు... అట్లాంటా, USA బృందం నుంచి శారదా సాయి (హైదరాబాద్), రాఘవ బాబు తడవర్తి, గాయత్రి తంగిరాల, ఫణి వంశీ ముడుంబ. రామ్ దుర్వాసుల (అట్లాంటా, USA) దర్భా భాస్కర్, కృష్ణమాచారి కారంచేడు, మోహన్ దేవ్, రాధికా నోరి, స్రవంతి కోవెల, శ్రీయాన్ కోవెల, దుర్గ గోరా పలువురు గాయకులు పాల్గొని ఘంటసాల పాటలు పాడి, చక్కటి వ్యాఖ్యానంతో అలరించారు.
దేశవిదేశాల నుంచి పాల్గొన్న కొందరు ప్రముఖులు: ఇండోనేషియా నుంచి తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఇండోనేషియా తెలుగు సంఘం అధ్యక్షుడు టీవీయస్ ప్రవీణ్, ఒమాన్ నుంచి తెలుగు కళా సమితి అధ్యక్షుడు అనిల్ కుమార్ కడించర్ల. ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (Signature Campaign) అనూహ్య స్పందన లభిస్తోందని నిర్వాహకులు తెలిపారు. వివరాలు మీ అందరి కోసం: https://www.change.org/BharatRatnaForGhantasalaGaru ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న ఘంటసాల కుటుంబ సభ్యులకు, అభిమానులకు బాల రెడ్డి ఇందుర్తి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్
-
భద్రాచలం తరహాలో అమెరికాలో రామాలయం
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు. -
సింగపుర్లో శ్రీ మారియంబికా ఆలయంలో ఘనంగా చండీహోమం
సింగపుర్లోని వాసవీ క్లబ్ మెర్లయన్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు అత్యంత పురాతన, విశిష్టమైన శ్రీ మారియంబికా ఆలయంలో చండీహోమం నిర్వహించారు. -
కూటమి గెలిస్తేనే ఏపీకి భవిష్యత్తు.. ఖతార్లో తెదేపా ఆవిర్భావ వేడుకల్లో నేతలు
తెదేపా ఆవిర్భావ వేడుకలు ఖతార్లో ఘనంగా నిర్వహించారు. ఖతార్ తెలుగుదేశం పార్టీ నేతల ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
ప్రాచీన భారతీయ సాహిత్యం- ఆధునిక విజ్ఞాన వికాసంపై తానా ప్రపంచ సాహిత్యవేదిక సదస్సు
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ‘ప్రాచీన భారతీయ సాహిత్యం- ఆధునిక విశ్వ విజ్ఞానశాస్త్ర వికాసానికి మూలం’ అనే అంశంపై సదస్సు విజ్ఞానదాయకంగా జరిగింది. -
ఘనంగా క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ (QEF) వెబ్సైట్ ఆవిష్కరణ
ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్వచ్ఛమైన సమాజమే లక్ష్యంగా ఆవిర్భవించిన క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ తన వెబ్సైట్ను www.qef.org ఆవిష్కరించింది. నాణ్యమైన సాంకేతిక ప్రయాణంలో దీన్నొక మైలురాయిగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు వక్తలు పేర్కొన్నారు. -
ఏపీని ఆదుకునే ఎన్నారైలపై ఇంత అక్కసా?: జయరాం కోమటి
రాష్ట్రానికి మేలు చేసేలా కృషిచేస్తున్న ఎన్నారైలపై వైకాపా నాయకులు బెదిరింపులకు పాల్పడటం అత్యంత దారుణమని ప్రముఖ ప్రవాసాంధ్రుడు, ఎన్నారై తెదేపా అమెరికా సమన్వయకర్త జయరాం కోమటి అన్నారు. -
ఎన్ఆర్ఐ తెదేపా, జనసేన ఆధ్వర్యంలో తెదేపా ఆవిర్భావ వేడుకలు
ఎన్ఆర్ఐ తెదేపా కువైట్, జనసేన కువైట్ సంయుక్త ఆధ్వర్యంలో తెదేపా 42వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
డార్ట్ఫోర్డ్లో ఉల్లాసంగా హోలీ వేడుకలు
బ్రిటన్లోని డార్ట్ఫోర్డ్లో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. కెంట్లోనే అతిపెద్ద ఈవెంట్గా చేపట్టిన ఈ వేడుకలకు 3వేల మందికి పైగా హాజరయ్యారు. -
డాలస్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని డాలస్ నగరంలో ఘనంగా నిర్వహించారు. -
వాషింగ్టన్ డీసీలో ఘనంగా తానా (నరేన్ వర్గం) విజయోత్సవ సభ
తానా ఎన్నికల్లో డా.నరేన్ కొడాలి వర్గం నుంచి గెలిచిన అభ్యర్థులంతా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం శనివారం (మార్చి 23న) సాయంత్రం వాషింగ్టన్ డీసీలో విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించారు. -
సింగపూర్లో స్వరలయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఘనంగా త్యాగరాజ ఆరాధనోత్సవాలు
మార్చి 18న స్వరలయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో సింగపూర్లో నివసించే తెలుగు గాయకులు ఉత్సాహంగా త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరుపుకొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మీటింగ్లో నోట్స్ రాయడం స్టీవ్ జాబ్స్కు నచ్చదట.. ఎందుకో తెలుసా?
-
‘ఆప్ కా రామరాజ్య’ వెబ్సైట్ను ప్రారంభించిన ఆప్
-
భానుడి భగభగలు.. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ
-
దూకుడైన బ్యాటింగ్తోనే కప్ కొట్టగలం..: రికీ పాంటింగ్
-
ఎన్నికల్లో భాజపా తుడిచిపెట్టుకుపోతుంది: అఖిలేష్ యాదవ్
-
వలసలు, పస్తులు లేని వికసిత ఏపీ మనందరి బాధ్యత: పవన్