న్యూజిలాండ్‌ తెలంగాణ సంఘం

న్యూజిలాండ్‌ ప్రవాస తెలంగాణ సంఘం అధ్యక్షుడిగా మేకల ప్రసన్నకుమార్‌ ఎన్నికయ్యారు. సోమవారం న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో 2023 సంవత్సరానికి సంబంధించిన కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

Updated : 01 Nov 2022 06:09 IST

కొత్త కార్యవర్గం ఎన్నిక

ఈనాడు, హైదరాబాద్‌: న్యూజిలాండ్‌ ప్రవాస తెలంగాణ సంఘం అధ్యక్షుడిగా మేకల ప్రసన్నకుమార్‌ ఎన్నికయ్యారు. సోమవారం న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో 2023 సంవత్సరానికి సంబంధించిన కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇందులో ప్రసన్నకుమార్‌ ప్యానెల్‌ నుంచి ప్రధాన కార్యదర్శిగా మాల్గారి శైలేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా లోక రాజ్‌కుమార్‌, కోశాధికారిగా కోడూరి చంద్రశేఖర్‌ గెలుపొందారు. ఇతర పదవులకు భేరి శ్రావణి, గడ్డం గణేశ్‌, విజేత, మధు, శశికాంత్‌, విశ్వనాథ్‌, లింగం, కావ్య, శైలజ తదితరులు ఎన్నికయ్యారు. న్యూజిలాండ్‌లోని ప్రవాసుల సంక్షేమానికి కృషి చేస్తామని కొత్తగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు తెలిపారు. వారిని సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని