సింగపూర్‌లో అమర గాయకునికి అపూర్వ నివాళి

అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి ఉత్సవాలు సింగపూర్‌లో ఘనంగా జరిగాయి.

Published : 05 Dec 2022 19:32 IST

ఘంటసాల శతజయంతి ఉత్సవాలు

అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి ఉత్సవాలు సింగపూర్‌లో ఘనంగా జరిగాయి. ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి - సింగపూర్’, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, వంశీ ఇంటర్నేషనల్- ఇండియా, ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, శుభోదయం గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వంశీ అధ్యక్షులు డాక్టర్ వంశీ రామరాజు, శుభోదయం గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ శ్రీలక్ష్మీ ప్రసాద్ కలపటపు, ప్రముఖ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్, హాంకాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపకురాలు జయ పీసపాటి,  ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ వ్యవస్థాపకులు కవుటూరు రత్నకుమార్, కార్యక్రమం ప్రధాన సమన్వయకర్త రాధిక మంగిపూడి, నిర్వాహక బృంద సభ్యులు శ్రీధర్ భరద్వాజ్, చామిరాజు రామాంజనేయులు పాతూరు రాంబాబు జ్యోతి ప్రజ్వలనం చేసి, ఘంటసాల చిత్రపటానికి నివాళులు అర్పించారు.

అనంతరం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వీడియో సందేశాన్ని ప్రసారం చేశారు. ఇలాంటి కార్యక్రమం సింగపూర్‌లో నిర్వహించడం అభినందనీయమని తమ హర్షాన్ని వ్యక్తం చేస్తూ, సింగపూర్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భారత కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రధాని నరేంద్ర మోదీ తరఫున, కార్యక్రమానికి ప్రత్యేక అభినందనలు కూడా అందించారు.

‘గతేడాది డిసెంబర్ 4న ప్రారంభించి, 366 రోజుల పాటు నిర్విరామంగా అంతర్జాల మాధ్యమంలో ‘ఘంటసాల స్వరరాగ మహాయాగం’ కార్యక్రమం నిర్వహించాం. భారతదేశం నుంచి అతిథులు గాయనీగాయకులు, వాయిద్య బృందం సింగపూర్‌కు విచ్చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం మా సంస్థ ద్వారా జరగడం మా అదృష్టంగా భావిస్తున్నాం’ అని రత్నకుమార్ కవుటూరు తెలియజేశారు. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి సందేశాన్ని పంపిన వామరాజు సత్యమూర్తికి కృతజ్ఞతలు తెలిపారు. ఘంటసాల శతజయంతి ఉత్సవాలను నిర్వహించడంపై ఘంటసాల సతీమణి సావిత్రమ్మ, కుమార్తె సుగుణ ఆనందం వ్యక్తం చేశారు.

శుభోదయం, మాధవపెద్ది సురేష్ సారథ్యంలో జరిగిన ప్రత్యేక సంగీత విభావరిలో, ప్రముఖ నేపథ్య గాయనీగాయకులు చంద్రతేజ, సురేఖ మూర్తి, చింతలపాటి సురేష్‌లు చక్కని పాటలు ఆలపించారు. సాయికుమార్, పవన్ కుమార్ సోదరులు, యుగంధర్, చక్రపాణి సోమేశ్వరరావు చక్కటి వాయిద్య సహకారాన్ని అందించారు.దుబాయ్ నుంచి విచ్చేసిన నాట్య కళాకారిణి కుమారి తెన్నేటి శ్రావణి శాస్త్రీయ నృత్య ప్రదర్శన అందరిని ఆకర్షించింది.   శుభోదయం వారి ‘షడ్రుచి’శాఖ ప్రకటించడంతో పాటు, వారు నిర్మించిన ‘ఘంటసాల ది గ్రేట్’ బయోపిక్ దర్శకులు రామారావు నిర్మాత జి.వి. భాస్కర్‌లను శ్రీ సాంస్కృతిక కళాసారథి ప్రత్యేకంగా సత్కరించింది. వంగూరి ఫౌండేషన్ ప్రచురణగా పీఎస్ గోపాలకృష్ణ రచించిన ‘మన ఘంటసాల’ అనే పుస్తకాన్ని ఈ వేదికపై అతిథులు అందరూ కలిసి ఆవిష్కరించారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపకులు వంగూరి చిట్టెన్ రాజు ఈ సందర్భంగా కార్యక్రమానికి అభినందనలు తెలియజేస్తూ సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ పర్యటనకు ఏర్పాట్లను పర్యవేక్షించిన శుభోదయం బాలసుబ్రమణ్యానికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సింగపూర్‌లోని వివిధ తెలుగు సంస్థల ప్రతినిధులు హాజరవగా, గణేశ్న రాధాకృష్ణ, కాత్యాయని, శిష్ట్లా వంశీ సాంకేతిక నిర్వహణ పర్యవేక్షించారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని