TDP: బాధిత కుటుంబాలకు రూ.10లక్షల ఆర్థికసాయం అందించిన మన్నవ మోహనకృష్ణ

ఇటీవల గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జనతా వస్త్రాల పంపిణీ కార్యక్రమం సందర్భంగా తొక్కిసలాటలో షేక్ బీబీ, గోపిదేశీ రమాదేవి, సయ్యద్ ఆసియా మృతి చెందిన విషయం తెలిసిందే.

Published : 21 Jan 2023 21:14 IST

గుంటూరు: ఇటీవల గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జనతా వస్త్రాల పంపిణీ కార్యక్రమం సందర్భంగా తొక్కిసలాటలో షేక్ బీబీ, గోపిదేశీ రమాదేవి, సయ్యద్ ఆసియా మృతి చెందిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాలకు మన్నవ మోహనకృష్ణ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ తరఫున నాట్స్‌ మాజీ అధ్యక్షుడు, ఎన్టీఆర్ ట్రస్ట్‌ డైరెక్టర్‌, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెదేపా రాష్ట్రకార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహనకృష్ణ రూ.10లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. శనివారం గుంటూరు వచ్చిన ఆయన స్వయంగా బాధితుల ఇళ్లకు వెళ్లి ఒక్కో కుటుంబానికి రూ.3.34 లక్షల చొప్పున మొత్తం రూ.10లక్షలు అందజేశారు.

ఈకార్యక్రమంలో మాజీ మంత్రులు మాకినేని పెద రత్తయ్య, ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబు, గుంటూరు పశ్చిమ తెదేపా ఇన్‌ఛార్జి కోవెలమూడి రవీంద్ర, గుంటూరు పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాస్‌, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిట్టాబత్తిన చిట్టిబాబు, రాష్ట్రకార్య కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్‌, తెదేపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన కృష్ణ మాట్లాడుతూ.. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. బాధిత కుటుంబాలకు భవిష్యత్తులోనూ మన్నవ మోహనకృష్ణ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని