NRI: యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర ఆధ్వర్యంలో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గ్రంథాలయం
ఉత్తర కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర ఆధ్వర్యంలో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గ్రంథాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం సాయంత్రం ఘనంగా జరిగింది.
మిల్పిటాస్: ఉత్తర కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర ఆధ్వర్యంలో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గ్రంథాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం సాయంత్రం ఘనంగా జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తన జీవితంలో సమకూర్చుకున్న వేల పుస్తకాలను యూనివర్సిటీకి వితరణగా సమర్పించారు. యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర పేరుతో ఏర్పాటు చేసిన గ్రంధాలయాన్ని భారత కాన్సులేట్ జనరల్ ప్రారంభించారు.
తొలుత సిలికానాంధ్ర కార్యవర్గం..లక్ష్మీప్రసాద్, సౌజన్య దంపతులను గుర్రపు బగ్గీలో విశ్వవిద్యాలయానికి తీసుకురాగా.. వేదాశీర్వచనాలతో పూల వర్షం కురిపిస్తూ ఊరేగింపుగా గ్రంథాలయ భవనంలోకి తీసుకొచ్చారు. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం అధిపతి కూచిభొట్ల ఆనంద్, చీఫ్ అకడమిక్ ఆఫీసర్ చామర్తి రాజు, భారత కాన్సులేట్ కాన్సుల్ జనరల్ టీవీ నాగేంద్రప్రసాద్, మిల్పిటాస్ నగర వైస్ మేయర్ ఎవిలిన్ చూ తదితరులు వారిని సాదరంగా భవనంలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాన్సుల్ జనరల్ ప్రవాసాంధ్రులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగులోనే కాక హిందీలో కూడా పీహెచ్డీ పట్టా పొందిన యార్లగడ్డ సాహిత్య ప్రతిభను కొనియడారు. సిలికానాంధ్ర ప్రస్తుత, పూర్వ అధ్యక్షులు, ప్రస్తు కార్యవర్గ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ దంపతులను ఘనంగా సత్కరించి.. ‘సిలికానాంధ్ర గ్రంథ పయోనిధి’ బిరుదుతోపాటు సన్మాన పత్రాన్ని అందించారు. యార్లగడ్డ తన జీవిత కాలంలో సేకరించిన 14వేల పుస్తకాలను యూనివర్సిటీ లైబ్రరీకి బహూకరించారు. వారి ఇద్దరు పిల్లలు యూనివర్సిటీకి చెరో $20,000 విరాళాన్ని కూడా ప్రకటించారు.
సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఆనంద్ కూచిభొట్ల.. యార్లగడ్డతో తన అనుబంధాన్ని గుర్తుచేశారు. సాహిత్యం, రాజకీయం రెండింటినీ తమ ఒరలో అలవోకగా అమర్చుకున్న అరుదైన వ్యక్తి అని అభివర్ణించారు. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ.. అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ పుస్తకాలన్నిటినీ ఏం చెయ్యాలో పాలుపోక గత కొద్దికాలంగా మదనపడుతున్నానని, చివరకు సిలికానాంధ్ర యూనివర్సిటీ వాటికి సరైన చోటని నిర్ణయించుకున్నానని చెప్పారు. లైబ్రరీ ఏర్పాటుకు యూనివర్సిటీ యంత్రాంగం ఆమోదించడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. భారత సంప్రదాయంలో కవికి తాను రాసిన పుస్తకం కుమార్తెతో సమానమని, తండ్రిగా తను తగిన ఇంటికే వాటిని పంపుతున్నానన్న నమ్మకంతోనే యూనివర్సిటీకి ఇస్తున్నానని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డాలస్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని డాలస్ నగరంలో ఘనంగా నిర్వహించారు. -
వాషింగ్టన్ డీసీలో ఘనంగా తానా (నరేన్ వర్గం) విజయోత్సవ సభ
తానా ఎన్నికల్లో డా.నరేన్ కొడాలి వర్గం నుంచి గెలిచిన అభ్యర్థులంతా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం శనివారం (మార్చి 23న) సాయంత్రం వాషింగ్టన్ డీసీలో విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించారు. -
సింగపూర్లో స్వరలయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఘనంగా త్యాగరాజ ఆరాధనోత్సవాలు
మార్చి 18న స్వరలయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో సింగపూర్లో నివసించే తెలుగు గాయకులు ఉత్సాహంగా త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరుపుకొన్నారు. -
NATS: డల్లాస్లో వైభవంగా నాట్స్ తెలుగు వేడుకలు
నాట్స్ తెలుగు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు డల్లాస్లోని పది వేల మందికిపైగా తెలుగువారు హాజరయ్యారు. -
లండన్లో సీబీఈ అవార్డు అందుకున్న తెలుగు బిడ్డ డా.కన్నెగంటి చంద్ర
నిజామాబాద్ జిల్లాలో జన్మించి లండన్లో స్థిరపడిన భారతీయ వైద్యుడు కన్నెగంటి చంద్ర ప్రతిష్ఠాత్మక ‘కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (సీబీఈ)’ పురస్కారాన్ని అందుకొన్నారు. -
Indra Nooyi: అమెరికాలో వరుస ఘటనలు.. భారత విద్యార్థులకు ఇంద్రానూయీ సూచనలు
అమెరికా (USA)లో ఉన్న భారత విద్యార్థులకు పెప్సీకో మాజీ సీఈఓ ఇంద్రానూయీ(Indra Nooyi) పలు సూచనలు చేశారు. -
కూటమిని గెలిపిద్దాం.. రాష్ట్రాన్ని కాపాడుకుందాం: ఎన్ఆర్ఐల తీర్మానం
అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియాలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన ఎన్ఆర్ఐలు ఆదివారం సమావేశమయ్యారు. -
Indian origin Family: అనుమానాస్పద స్థితిలో కెనడాలో భారత సంతతి కుటుంబం మృతి
కెనడా(Canada)లో భారత సంతతికి చెందిన ముగ్గురు కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. వారి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
జనసేన ఆవిర్భావ వేడుకల వేళ.. డల్లాస్లో జనసేన, తెదేపా, భాజపా ఆత్మీయ సమావేశం
డల్లాస్లో జనసేన ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు జనసేన నేతలతో పాటు తెదేపా, భాజపా క్యాడర్కు చెందిన పలువురు హాజరయ్యారు. -
సింగపూర్లో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు
సింగపూర్లో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. -
న్యూజెర్సీలో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు
శివుడికి ప్రీతిపాత్రమైన మహా శివరాత్రి పర్వదినాన ‘హర హర మహాదేవ శంభో శంకర’ అంటూ అగ్రరాజ్యంలో ఎన్నారైలు ముక్తకంఠంతో నినదించారు. -
న్యూజెర్సీలో ఓఎఫ్ భాజపా ఆధ్వర్యంలో ‘ఛాయ్పే చర్చ’
న్యూజెర్సీలోని ఎడిసన్ నగరంలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ (BJP) ఆధ్వర్యంలో ‘ఛాయ్ పే చర్చ’ నిర్వహించారు. -
బే ఏరియాలో ‘తెదేపా-జనసేన-భాజపా’కు చెందిన ఎన్ఆర్ఐల ఆత్మీయ సమావేశం
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో స్థిరపడిన ఎన్ఆర్ఐలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. -
అమెరికాలో మే 24-26 మధ్య టీటీఏ మహాసభలు
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) అగ్రరాజ్యంలో భారీగా మహాసభలు నిర్వహించనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు టీటీఏ అధ్యక్షుడు వంశీరెడ్డి కంచరకుంట్ల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. -
సౌదీ అరేబియాలో తెదేపా-జనసేన ఎన్నారై కూటమి సమావేశం
సౌదీ అరేబియాలోని జుబైల్లో తెదేపా-జనసేన ఎన్నారై కూటమి భేటీ అయ్యింది. రాబోయే ఎన్నికలకు వ్యూహరచన చేసేందుకు ‘ఎన్నికల సన్నాహక ఆత్మీయ సమావేశం’ పేరిట ఈ భేటీ నిర్వహించారు. -
డెట్రాయిట్లో అట్టహాసంగా మహిళా దినోత్సవం
గ్లోబల్ తెలంగాణ సంఘం డెట్రాయిట్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. -
తానా బోర్డు ఛైర్మన్గా డా.నాగేంద్ర శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో ప్రతిష్ఠాత్మక బోర్డు ఛైర్మన్ పదవికి డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
డెట్రాయిట్లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
అంతర్జాతీయ మహిళల దినోత్సవం(మార్చి 8) పురస్కరించుకుని ఫార్మింగ్టన్ మేనర్లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (జీటీఏ) డెట్రాయిట్ మహిళా విభాగం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన లేడీస్ నైట్ అట్టహాసంగా జరిగింది. -
TDP - Janasena: షికాగోలో ఘనంగా తెదేపా - జనసేన ఆత్మీయ సమావేశం
తెదేపా, జనసేన నాయకులు షికాగోలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. -
TANA Foundation: తానా ఫౌండేషన్ ఛైర్మన్గా శశికాంత్ వల్లేపల్లి
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ఫౌండేషన్ చైర్మన్గా శశికాంత్ వల్లేపల్లి ఎన్నికయ్యారు. -
Sporty Divas: ఇండో-గల్ఫ్ త్రోబాల్ ఛాంపియన్షిప్ విజేతగా అమెరికా జట్టు
బహ్రెయిన్లో నిర్వహించిన ‘ఇండో-గల్ఫ్ ఇంటర్నేషనల్ త్రోబాల్ ఛాంపియన్షిప్’లో అమెరికాకు చెందిన మహిళల జట్టు ‘స్పోర్టీ దివాస్’ విజేతగా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం