భారత న్యాయవ్యవస్థపై చెరగని ముద్ర వేశారు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్.వి.రమణ చేసిన కృషిని అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్ర సెనేట్, జనరల్ అసెంబ్లీ ప్రశంసించాయి.
జస్టిస్ ఎన్.వి.రమణపై న్యూజెర్సీ సెనేట్, జనరల్ అసెంబ్లీల సంయుక్త తీర్మానం
ఈనాడు, అమరావతి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్.వి.రమణ చేసిన కృషిని అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్ర సెనేట్, జనరల్ అసెంబ్లీ ప్రశంసించాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యాక్టింగ్ సీజేగా ఆయన అనేక సంస్కరణలను అమలు చేశారని ప్రశంసిస్తూ ఉమ్మడిగా తీర్మానపత్రం విడుదల చేశాయి. ‘జస్టిస్ రమణ కీలకమైన కేసుల్లో సమర్థవంతంగా తీర్పులు వెలువరించారు. కోర్టుల్లో న్యాయ నియామకాలను పెంచడంతో పాటు.. పెండింగ్ కేసులకు వేగవంత పరిష్కారం చూపడంలో విశేష కృషి చేశారు’ అని కీర్తించాయి. ‘భారత న్యాయవ్యవస్థపై జస్టిస్ రమణ చెరగని ముద్ర వేశారు. కోర్టు వ్యవహారాలకు సంబంధించి మీడియా కవరేజిని విస్తృతం చేశారు. ఆయన అసాధారణ దృఢ సంకల్పం కలిగిన వ్యక్తి. ప్రజాజీవితంలోని వారందరికీ మార్గదర్శకులు’ అని కొనియాడాయి. జస్టిస్ రమణ సేవ, నాయకత్వాన్ని అభినందిస్తూ తీర్మానించాయి. సెనేటర్ డైగ్నాన్, అసెంబ్లీ సభ్యుడు కరాబిన్చయాక్, స్టాన్లీ తీర్మానం ప్రవేశపెట్టగా.. సంయుక్త తీర్మానపత్రంపై సెనేట్ ప్రెసిడెంట్ నికోలస్ పి.స్కూటరి, జనరల్ అసెంబ్లీ స్పీకర్ క్రెయిగ్ జె.కాగ్లెన్ సంతకాలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu Arrest: అమీర్పేటలో చంద్రబాబుకు మద్దతుగా భారీ ర్యాలీ
-
Apply Now: ‘సింగిల్ గర్ల్ చైల్డ్’కు సీబీఎస్ఈ స్కాలర్షిప్.. దరఖాస్తు చేశారా?
-
Hyderabad: పాతబస్తీలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురికి గాయాలు
-
October 1: దేశవ్యాప్తంగా ‘శ్రమదాన్’.. స్వచ్ఛత కోసం మోదీ పిలుపు
-
Rakshit Shetty: తెలుగు ప్రేక్షకుల ఆదరణకు రక్షిత్ శెట్టి ఫిదా.. ఏమన్నారంటే?
-
Cyber Crimes: టాస్క్ పేరుతో సైబర్ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర హోంశాఖ