కృష్ణతో తెలుగువారికి మరింత గుర్తింపు: శ్రీనివాసుల రెడ్డి
గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కృష్ణ లాం తెలుగువారికి మరింత గుర్తింపు తీసుకొస్తారని తేదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డెప్పగారి శ్రీనివాసుల రెడ్డి అన్నారు.
వాషింగ్టన్: గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కృష్ణ లాం తెలుగువారికి మరింత గుర్తింపు తీసుకొస్తారని తేదేపా పొలిట్బ్యూరో సభ్యుడు రెడ్డెప్పగారి శ్రీనివాసుల రెడ్డి అన్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఇటీవల ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యుల పరిచయ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తానా పూర్వ అధ్యక్షులు సతీష్ వేమన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ జీడబ్ల్యూటీసీఎస్ (GWTCS) నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కృష్ణ ఈ సంస్థ ప్రతిష్ఠను మరింత పెంచుతారన్నారు. అమెరికాలోని ప్రవాసాంధ్రులు తెలుగుభాషను బతికిస్తున్నారన్నారు. ఏపీలో పాలకపక్ష అనుభవరాహిత్యం వలన విద్యారంగం నిర్వీర్యమైపోయిందని అన్నారు. ఇంగ్లీష్ భాష మోజులో మాతృ భాషను మర్చిపోతున్నాని పేర్కొన్నారు. తెలుగువారు రాజకీయాల్లో రాణించి అమెరికా చట్టసభల్లో ప్రాధాన్యత పెంచాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.
కృష్ణ లాం మాట్లాడుతూ.. అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తూ తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ముకానివ్వనని అన్నారు. రాబోయే 50 వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. సతీష్ వేమన మాట్లాడుతూ.. తెలుగువారి చరిత్ర అమెరికా పేజీల్లో సువర్ణాక్షరాలతో లిఖించే రోజులు వచ్చాయన్నారు. తెలుగువారు అనేకమంది ఇక్కడ చట్టసభలకు ఎన్నికయ్యారనీ, తెలుగింటి ఆడపడుచు అరుణా మిల్లర్ కాట్రగడ్డ మేరీలాండ్ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికవ్వడం తెలుగుజాతి గర్వించదగ్గ విషయమని అన్నారు. మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ మితభాషి, హితభాషి, మృదుస్వభావం కలిగిన కృష్ణ తెలుగువారి కీర్తి ప్రతిష్ఠలు పెంచుతారన్నారు. ఇప్పటివరకు GWTCS అధ్యక్ష బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించిన సాయిసుధ పాలడుగుకు వీడ్కోలు చెబుతూ ఘనంగా సత్కరించారు.
ఉపాధ్యక్షులుగా రవి అడుసుమల్లి, కార్యదర్శిగా సుశాంత్ మన్నే, కోశాధికారిగా భాను మాగులూరి, సాంస్కృతిక ఉపాధ్యక్షులుగా సుష్మ అమృతలూరి, సాంస్కృతిక కార్యదర్శిగా శ్రీవిద్య సోమ, యూత్ ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్ గంగా, సంయుక్త కార్యదర్శిగా కార్తీక్ కోమటి, సంయుక్త కోశాధికారిగా విజయ్ అట్లూరి, బోర్డు ఆఫ్ డైరెక్టర్స్గా చంద్ర మల్లావత్తు, ప్రవీణ్ కొండక, ఫణి తాళ్లూరి, యష్ బొద్దులూరి, రాజేష్ కాసారనేని, ఉమాకాంత్ రఘుపతి తదితరులు నూతనంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో మన్నే సత్యనారాయణ, త్రిలోక్ కంతేటి, ప్రదీప్ గౌర్నేని, సత్య సూరపనేని, సునీల్ సింగ్, అనీల్ ఉప్పలపాటి, ప్రదీప్ గుత్తా, అశోక్ దేవినేని, సాయి బొల్లినేని, శ్రీనివాస్ చావలి, బాబురావు, కిషోర్ కంచర్ల, రవి పులి, శ్రీనివాస్ పెందుర్తి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్
-
భద్రాచలం తరహాలో అమెరికాలో రామాలయం
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్