కృష్ణతో తెలుగువారికి మరింత గుర్తింపు: శ్రీనివాసుల రెడ్డి

గ్రేటర్‌ వాషింగ్టన్‌ తెలుగు సాంస్కృతిక సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన  కృష్ణ లాం తెలుగువారికి మరింత గుర్తింపు తీసుకొస్తారని తేదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు రెడ్డెప్పగారి శ్రీనివాసుల రెడ్డి అన్నారు.

Published : 21 Nov 2022 23:55 IST

వాషింగ్టన్‌: గ్రేటర్‌ వాషింగ్టన్‌ తెలుగు సాంస్కృతిక సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన  కృష్ణ లాం తెలుగువారికి మరింత గుర్తింపు తీసుకొస్తారని తేదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డెప్పగారి శ్రీనివాసుల రెడ్డి అన్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఇటీవల ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యుల పరిచయ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తానా పూర్వ అధ్యక్షులు సతీష్ వేమన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ జీడబ్ల్యూటీసీఎస్‌ (GWTCS) నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కృష్ణ ఈ సంస్థ ప్రతిష్ఠను మరింత పెంచుతారన్నారు. అమెరికాలోని ప్రవాసాంధ్రులు తెలుగుభాషను బతికిస్తున్నారన్నారు. ఏపీలో పాలకపక్ష అనుభవరాహిత్యం వలన విద్యారంగం నిర్వీర్యమైపోయిందని అన్నారు. ఇంగ్లీష్ భాష మోజులో మాతృ భాషను మర్చిపోతున్నాని పేర్కొన్నారు. తెలుగువారు రాజకీయాల్లో రాణించి అమెరికా చట్టసభల్లో ప్రాధాన్యత పెంచాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.

కృష్ణ లాం మాట్లాడుతూ.. అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తూ తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ముకానివ్వనని అన్నారు. రాబోయే 50 వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. సతీష్ వేమన మాట్లాడుతూ.. తెలుగువారి చరిత్ర అమెరికా పేజీల్లో సువర్ణాక్షరాలతో లిఖించే రోజులు వచ్చాయన్నారు. తెలుగువారు అనేకమంది ఇక్కడ చట్టసభలకు ఎన్నికయ్యారనీ, తెలుగింటి ఆడపడుచు అరుణా మిల్లర్ కాట్రగడ్డ మేరీలాండ్ రాష్ట్ర లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఎన్నికవ్వడం తెలుగుజాతి గర్వించదగ్గ విషయమని అన్నారు. మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ మితభాషి, హితభాషి, మృదుస్వభావం కలిగిన కృష్ణ తెలుగువారి కీర్తి ప్రతిష్ఠలు పెంచుతారన్నారు. ఇప్పటివరకు GWTCS అధ్యక్ష బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించిన సాయిసుధ పాలడుగుకు వీడ్కోలు చెబుతూ ఘనంగా సత్కరించారు.

ఉపాధ్యక్షులుగా రవి అడుసుమల్లి, కార్యదర్శిగా సుశాంత్ మన్నే, కోశాధికారిగా భాను మాగులూరి, సాంస్కృతిక ఉపాధ్యక్షులుగా సుష్మ అమృతలూరి, సాంస్కృతిక కార్యదర్శిగా శ్రీవిద్య సోమ, యూత్ ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్ గంగా, సంయుక్త కార్యదర్శిగా కార్తీక్ కోమటి, సంయుక్త కోశాధికారిగా విజయ్ అట్లూరి, బోర్డు ఆఫ్ డైరెక్టర్స్‌గా చంద్ర మల్లావత్తు, ప్రవీణ్ కొండక, ఫణి తాళ్లూరి, యష్ బొద్దులూరి, రాజేష్ కాసారనేని, ఉమాకాంత్ రఘుపతి తదితరులు నూతనంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో మన్నే సత్యనారాయణ, త్రిలోక్ కంతేటి, ప్రదీప్ గౌర్నేని, సత్య సూరపనేని, సునీల్ సింగ్, అనీల్ ఉప్పలపాటి, ప్రదీప్ గుత్తా, అశోక్ దేవినేని, సాయి బొల్లినేని, శ్రీనివాస్ చావలి, బాబురావు, కిషోర్ కంచర్ల, రవి పులి, శ్రీనివాస్ పెందుర్తి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని