KTR: లండన్లో కేటీఆర్కు ఘన స్వాగతం.. ప్రత్యేక ఆకర్షణగా నంబర్ ప్లేట్
యూకే, దావోస్ పర్యటన నిమిత్తం లండన్ వెళ్లిన మంత్రి కేటీఆర్కు ఘన స్వాగతం లభించింది. లండన్ విమానాశ్రయంలో తెరాస పార్టీ విభాగంతో పాటు అనేక ఎన్ఆర్ఐ సంఘాలు స్వాగతం పలికాయి. కేటీఆర్కు స్వాగతం పలికేందుకు వచ్చిన వందలాది
ఇంటర్నెట్ డెస్క్: విదేశీ పర్యటనలో భాగంగా యూకే వెళ్లిన తెలంగాణ మంత్రి కేటీఆర్కు లండన్లో ఘనస్వాగతం లభించింది. అక్కడి విమానాశ్రయంలో ఎన్ఆర్ఐ తెరాస-యూకే విభాగంతో పాటు అనేక ఎన్ఆర్ఐ సంఘాలు ఆయనకు స్వాగతం పలికాయి. కేటీఆర్కు స్వాగతం పలికేందుకు వచ్చిన వందలాది మందితో ఎయిర్పోర్ట్లో కోలాహలం నెలకొంది. అనేక మంది తమ కుటుంబ సభ్యులతో ఎయిర్పోర్ట్కు చేరుకొని.. కేటీఆర్తో ఫొటోలు తీసుకొనేందుకు ఉత్సాహం చూపించారు. కేటీఆర్ ఇవాళ అనేక రంగాలకు చెందిన పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. తెలంగాణ, ఏపీకి చెందిన బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ కూడా కేటీఆర్కు స్వాగతం పలికారు.
కేటీఆర్ లండన్ పర్యటన సందర్భంగా ఓ కారు నంబర్ ప్లేట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టీఆర్ఎస్ కేటీఆర్ అని కనిపించేలా నంబర్ ప్లేట్ ఉన్న కారు వద్ద దిగిన ఫొటోను కేటీఆర్ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ఆ ప్రత్యేక నెంబర్ ప్లేట్ ఉన్న కారులో రైడ్కు తీసుకెళ్లినందుకు ఎన్ఆర్ఐ తెరాస నేత అశోక్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. యూకే పర్యటన అనంతరం కేటీఆర్ దావోస్ వెళ్లనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్