అమెరికా బే ఏరియాలో ఘనంగా భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పలుదేశాల్లో ఉన్న భారతీయులు ఘనంగా నిర్వహించుకున్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించడంతోపాటు స్వాతంత్య్ర సంగ్రామ ఘట్టాలను మననం చేసుకుని,
ప్రత్యేక అతిథిగా హాజరైన కమల్ హాసన్
అమెరికా: భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పలుదేశాల్లో ఉన్న భారతీయులు ఘనంగా నిర్వహించుకున్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించడంతోపాటు స్వాతంత్య్ర సంగ్రామ ఘట్టాలను మననం చేసుకుని, స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించారు. అగ్రరాజ్యం అమెరికాలోని బే ఏరియాలోనూ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ‘స్వదేశ్’ పేరుతో ప్రవాసీలు నిర్వహించారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్(ఏఐఏ), బారీ 92.3 ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బే ఏరియాలోని 39 భారతీయ సంస్థలు తమ సహకారం అందించాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు కమల్హాసన్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ వేదికపై ఆయన నటించిన చిత్రం ‘విక్రమ్’ విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ.. ఎన్నో పోరాటాలు, మరెన్నో బలిదానాల తర్వాత భారత్కు స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు. ఆజాదీ కా అమృతోత్సవాలను సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం మరపురానిదని కొనియాడారు. అమెరికాలో పెద్ద సంఖ్యలో ఉన్న ప్రవాసాంధ్రులు తమ జన్మభూమి భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చేందుకు ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఓ) డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్ సహా పలువురు ప్రముఖులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ వేడుకలకు మేయర్ రిచ్ ట్రాన్ (మిల్పిటాస్), మేయర్ సామ్ లిక్కార్డో (శాన్ జోస్), స్టేట్ సెనేటర్ బాబ్ వికోవ్స్కీ, శాంటా క్లారా కౌంటీ సూపర్వైజర్ సిండి చావెజ్, కౌంటీ సూపర్వైజర్ ఒట్టో లీ, శాంటా క్లారా డిస్ట్రిక్ట్ అటార్నీ జెఫ్ రోసెన్, రో ఖన్నా కార్యాలయం నుంచి కాంగ్రెస్ ప్రతినిధి,సెనేటర్ డేవ్ కోర్టేస్, అసెంబ్లీ సభ్యుడు యాష్ కల్రా, అసెంబ్లీ సభ్యుడు అలెక్స్ లీ తో పాటు ఇతర నగరాలకు చెందిన మేయర్లు హాజరయ్యారు. కాలిఫోర్నియా అటార్నీ జనరల్ బొంటా, ఓక్లాండ్ మేయర్ లిబ్బి షాఫ్, కాంగ్రెస్ మహిళలు అన్నా ఎషూ వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. జెండా వందనం అనంతరం సభను ఉద్దేశించి ప్రముఖులు ప్రసంగించారు. భారతీయులకు ఉన్న దేశ భక్తిని చూసి సంతోషిస్తున్నామని పేర్కొన్నారు. దీనిని ఒక చిరస్మరణీయ కార్యక్రమంగా మార్చిన అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ బృందానికి డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్ అభినందనలు తెలిపారు.
భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించడం, మన వారసత్వం, సంస్కృతిని పరిరక్షించడంలో ఏఐఏ ముందుందని పలువురు కొనియాడారు. ‘స్వదేశ్’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం భారత సంస్కృతి, సంప్రదాయాలను ప్రచారం చేయడమేనని పలువురు పేర్కొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను మిలే సుర్ మేరా పర్యవేక్షించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 200 మందికిపైగా చిన్నారులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా క్యారమ్స్, చెస్ పోటీలను నిర్వహించారు. 100 అడుగుల భారతీయ జెండా పరేడ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం ప్రముఖ సింగర్ విద్యా వోక్స్ నిర్వహించిన సంగీత విభావరి వీనుల విందు చేసింది. సంజయ్ గుప్త(సీపీఏ), రియల్ ఎస్టేట్ ఏజెంట్ నాగరాజ్, ఐసీసీ బ్యాంకు, ఆజాద్ ఫైనాన్సియల్స్, సంపూర్ణ ఆయుర్వేద, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్గా వ్యవహరించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్
-
భద్రాచలం తరహాలో అమెరికాలో రామాలయం
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ