తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఫిబ్రవరి 21న ఆన్లైన్ వేదికగా ఇది జరిగింది.
అట్లాంటా: ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఫిబ్రవరి 21న ఆన్లైన్ వేదికగా ఇది జరిగింది. తొలుత తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి తెలుగు భాషా వైభవాన్ని చెబుతూ ఇతర దేశాల్లో ఉంటూ మాతృభాషను పరిరక్షించడంలో తానా చేస్తున్న కృషిని వివరించారు. ఆ తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొనే అతిథులకు ఆహ్వానం పలికారు. ఇటీవల హఠాన్మరణం చెందిన ఏపీ మంత్రి గౌతమ్రెడ్డికి సాహిత్యవేదిక నిర్వాహకులు డా.ప్రసాద్ తోటకూర తదితరులు నివాళులర్పించారు. మంత్రి కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబుకు ఆహ్వానం పలికారు.
ఈ సందర్భంగా గవర్నర్ హరిబాబు మాట్లాడుతూ మాతృదేశానికి ఎన్నో వేల మైళ్ల దూరంలో ఉంటూ ‘నెల నెలా తెలుగు వెన్నెల’ పేరిట సాహిత్య సదస్సులు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తానా సంస్థను ఆయన అభినందించారు. భారత రాజ్యాంగంలోని 53వ అధికరణం ప్రకారం ప్రాథమిక స్థాయిలో మాతృభాషలోనే విద్యాబోధన జరగాలన్నారు. కేంద్ర ప్రభుత్వం 2020 నూతన విద్యావిధానం ప్రకారం కనీసం 5 వరకు మాతృభాషలో విద్యాబోధన ఉండాలని చెప్పారు. ఇంజినీరింగ్లాంటి వృత్తి విద్యల్లోనూ మాతృభాషలోనే విద్యాబోధనకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. మాతృభాషాభిమానం కలిగిన ప్రతి ఒక్కరూ తెలుగు భాషను నిలబెట్టుకునేందుకు కృషి చేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు.
తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా.ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ఏటా ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకొనేందుకు గల నేపథ్యాన్ని వివరించారు. ‘‘అప్పటి తూర్పు పాకిస్థాన్.. ఇప్పటి బంగ్లాదేశ్లో అత్యధికంగా ప్రజలు బెంగాలీ భాష మాట్లాడేవారు. అప్పటి పాకిస్థాన్ ప్రభుత్వం ఉర్దూ భాషను జాతీయ భాషగా బలవంతంగా వారిపై రుద్దడంతో అక్కడి బెంగాలీలు తీవ్ర నిరసన తెలియజేశారు. ఈ క్రమంలో జరిగిన మహోద్యమంలో ఫిబ్రవరి 21, 1952లో ఎంతోమంది మరణించారు. కొన్ని వందలమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర ఘటనలను ఐక్యరాజ్యసమితి గుర్తించి 2000 సంవత్సరం నుంచి ఏటా ఫిబ్రవరి 21న అన్ని దేశాలు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది’’ అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న ఏపీ సాహిత్య అకాడమీ ఛైర్మన్ పిల్లంగోల్ల శ్రీలక్ష్మి మాట్లాడుతూ ఆంగ్ల భాష ఎంతో అవసరం అయినప్పటికీ దాని మోజులో పడి తెలుగును నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. ఏదైనా విషయాన్ని మాతృభాషలో అర్థం చేసుకున్నంత వివరంగా ఇతర భాషల్లో అర్థం చేసుకోలేమని చెప్పారు. పరిపాలనా భాషగానూ తెలుగు విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం మరో గౌరవ అతిథిగా పాల్గొన్న మిజోరం కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె.ఆర్.ఎస్. సాంబశివరావు మాట్లాడారు. మిజోరం చాలా ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడుకుని ఉంటుందని.. అక్షరాస్యతలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రమని చెప్పారు. అక్కడ చాలా తక్కువ మంది తెలుగు వాళ్లు ఉన్నప్పటికీ వివిధ రంగాల్లో మంచి ఖ్యాతి గడిస్తున్నారని తెలిపారు.
వివిధ రాష్ట్రాల నుంచి పలువురు తెలుగు ప్రముఖులు పాల్గొని ఆయా రాష్ట్రాల్లో తెలుగు భాషను నిలబెట్టుకోవడానికి చేస్తున్న కృషిని వివరించారు. అక్కడ వివిధ హోదాల్లో పనిచేస్తూ తెలుగు ఖ్యాతిని నిలబెడుతున్న అధికార, అనధికార ప్రముఖులు, తెలుగు సంఘాల పాత్ర తదితర అంశాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దాట్ల దేవదానం రాజు (యానాం), ఆచార్య మాడభూషి సంపత్కుమార్ (తమిళనాడు), యజ్ఞ నారాయణ (కేరళ), విజయభాస్కరరెడ్డి (మహారాష్ట్ర), డా.తుర్లపాటి రాజేశ్వరి (ఒడిశా), లండ రుద్రమూర్తి (ఛత్తీస్గఢ్), రాపోలు బుచ్చిరాములు (గుజరాత్), వింజమూరి బాలమురళి (పశ్చిమ బెంగాల్), ఆచార్య ఎన్.లక్ష్మీ అయ్యర్ (రాజస్థాన్) కమలాకర రాజేశ్వరి (దిల్లీ) పాల్గొన్నారు.
అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యఅతిథి, గౌరవ అతిథులు, విశిష్ఠ అతిథులు, ప్రసార మాధ్యమాలకు డా. ప్రసాద్ తోటకూర కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 27న ‘తెలుగు తల్లికి పద్యాభిషేకం’ అనే సాహిత్య కార్యక్రమం ఆన్లైన్ వేదికగా జరుగుతుందని ఆయన చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్
-
భద్రాచలం తరహాలో అమెరికాలో రామాలయం
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు. -
సింగపుర్లో శ్రీ మారియంబికా ఆలయంలో ఘనంగా చండీహోమం
సింగపుర్లోని వాసవీ క్లబ్ మెర్లయన్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు అత్యంత పురాతన, విశిష్టమైన శ్రీ మారియంబికా ఆలయంలో చండీహోమం నిర్వహించారు. -
కూటమి గెలిస్తేనే ఏపీకి భవిష్యత్తు.. ఖతార్లో తెదేపా ఆవిర్భావ వేడుకల్లో నేతలు
తెదేపా ఆవిర్భావ వేడుకలు ఖతార్లో ఘనంగా నిర్వహించారు. ఖతార్ తెలుగుదేశం పార్టీ నేతల ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
ప్రాచీన భారతీయ సాహిత్యం- ఆధునిక విజ్ఞాన వికాసంపై తానా ప్రపంచ సాహిత్యవేదిక సదస్సు
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ‘ప్రాచీన భారతీయ సాహిత్యం- ఆధునిక విశ్వ విజ్ఞానశాస్త్ర వికాసానికి మూలం’ అనే అంశంపై సదస్సు విజ్ఞానదాయకంగా జరిగింది. -
ఘనంగా క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ (QEF) వెబ్సైట్ ఆవిష్కరణ
ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్వచ్ఛమైన సమాజమే లక్ష్యంగా ఆవిర్భవించిన క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ తన వెబ్సైట్ను www.qef.org ఆవిష్కరించింది. నాణ్యమైన సాంకేతిక ప్రయాణంలో దీన్నొక మైలురాయిగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు వక్తలు పేర్కొన్నారు. -
ఏపీని ఆదుకునే ఎన్నారైలపై ఇంత అక్కసా?: జయరాం కోమటి
రాష్ట్రానికి మేలు చేసేలా కృషిచేస్తున్న ఎన్నారైలపై వైకాపా నాయకులు బెదిరింపులకు పాల్పడటం అత్యంత దారుణమని ప్రముఖ ప్రవాసాంధ్రుడు, ఎన్నారై తెదేపా అమెరికా సమన్వయకర్త జయరాం కోమటి అన్నారు. -
ఎన్ఆర్ఐ తెదేపా, జనసేన ఆధ్వర్యంలో తెదేపా ఆవిర్భావ వేడుకలు
ఎన్ఆర్ఐ తెదేపా కువైట్, జనసేన కువైట్ సంయుక్త ఆధ్వర్యంలో తెదేపా 42వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
పాకిస్థాన్కు ‘క్షిపణి’ సాయం.. చైనా సంస్థలపై అగ్రరాజ్యం ఆంక్షల కొరడా!
-
పవన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.. పిఠాపురంలో నేతల సంకల్పం
-
భారత విద్యార్థి మృతి.. మరోసారి చర్చలోకి బ్లూవేల్ ఛాలెంజ్..!
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
-
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
-
ఆ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్నా: సోనాలి బింద్రే