Pravasi Bharatiya Divas: ఏ దేశమేగినా..
ప్రవాస భారతీయులు అనగానే... సత్యనాదెళ్ల, సుందర్ పిచాయ్... లాంటి పేర్లే ఎక్కువగా వినిపిస్తాయి.
ఈ రోజు ప్రవాస భారతీయుల దినోత్సవం
ప్రవాస భారతీయులు అనగానే... సత్యనాదెళ్ల, సుందర్ పిచాయ్... లాంటి పేర్లే ఎక్కువగా వినిపిస్తాయి. కానీ వాళ్లే కాదు, ప్రపంచమంతా విస్తరించారు మనవాళ్లు. కొన్నిచోట్ల ఆర్థిక రంగానికి ఆయువుపట్టుగా నిలిస్తే... ఇంకొన్ని దేశాల్లో రాజకీయాల్ని శాసించే స్థితిలో ఉన్నారు. ఎక్కడ ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా మన సంస్కృతీ, సంప్రదాయాల్నీ ఎలుగెత్తి చాటుతూనే ఉన్నారు. ‘ప్రవాస భారతీయుల దినోత్సవం’ సందర్భంగా మనమంతా గర్వపడే ఆ విషయాలేంటో చూద్దామా!
భారతీయ విదేశాంగ మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం 2020 నాటికి విదేశాల్లోని ప్రవాస భారతీయులు, భారతీయ మూలాలున్న వారి సంఖ్య మొత్తం 3.2 కోట్లు. ఇందులో భారతీయ పౌరసత్వం ఉన్నవారు దాదాపు 1.4 కోట్లు, భారతీయ సంతతి వారు 1.8 కోట్లు.
* ఐరాస లెక్కల ప్రకారం ప్రపంచంలో ఇప్పటివరకూ అత్యధికంగా వలస వెళ్లింది భారతీయులే. మన దేశం తర్వాత స్థానాల్లో మెక్సికో (1.1కోట్లు), రష్యా (1.1కోట్లు), చైనా (కోటి), సిరియా (80లక్షలు) దేశాలున్నాయి.
* ఇండియా వెలుపల అత్యధికంగా మనవాళ్లు నివసిస్తున్న దేశం అమెరికా. అక్కడ 44.60లక్షల మంది ఉన్నారు. వారిలో 12 లక్షల 80 వేల మంది ప్రవాసులు, 31 లక్షల 80 వేల మంది భారత సంతతికి చెందినవాళ్లు.
* అత్యధికంగా ప్రవాస భారతీయులున్న దేశాలు... యూఏఈ (34లక్షలు), సౌదీ అరేబియా(దాదాపు 26లక్షలు), అమెరికా(12.80 లక్షలు). తర్వాతి స్థానాల్లో కువైట్, ఖతార్, ఒమన్, నేపాల్, యూకే దేశాలున్నాయి.
* మారిషస్లో 66శాతం జనాభా భారతీయ మూలాలున్నవారే.
* ప్రపంచంలో అత్యధికంగా స్వదేశానికి డబ్బు పంపిస్తున్న వారిలో మొదటిస్థానంలో ఉన్నది మనవాళ్లే. ప్రపంచబ్యాంకు లెక్కల ప్రకారం 2020-21 ఏడాదిలో భారత్కు ప్రవాసులు పంపిన మొత్తం రూ.6.4 లక్షల కోట్లు.
మినీ ఇండియాలు!
ప్రపంచంలో ఏ మూలకెళ్లినా భారత్ ప్రభావం ఉంటుంది. అచ్చంగా మన సంస్కృతీ, సంప్రదాయాలూ, రుచులతో ‘మినీ ఇండియా’లుగా పేరు తెచ్చుకున్న కొన్ని ప్రదేశాలున్నాయి.
* సౌతాల్, లండన్: యాభై వేలకుపైగా భారతీయులు ఉండే ఈ ప్రాంతాన్ని మినీ ఇండియాగా పిలుస్తారు. ఇక్కడ గురుద్వారా, దేవాలయం కొలువుదీరి ఉన్నాయి. దీపావళీ, హోలీలాంటి మన పండుగల్ని ఘనంగా నిర్వహిస్తుంటారు.
* లిటిల్ ఇండియా, కౌలాలంపూర్: మలేసియా రాజధాని కౌలాలంపూర్లోని బ్రిక్ఫీల్డ్స్ ప్రాంతాన్ని లిటిల్ ఇండియాగా పిలుస్తారు. ఇక్కడి స్థానికుల్లో ఎక్కువమంది భారతీయ మూలాలున్నవారే. భారత్లో దొరికే ప్రతి వస్తువూ ఇక్కడ లభిస్తుంది. ఈ ప్రాంతంలో నడుస్తుంటే భారతీయ వీధుల్లో తిరిగినట్టే ఉంటుందంటారు.
* డెవాన్ ఎవెన్యూ, షికాగో: అమెరికాలోని షికాగో నగరంలో ఉన్న ఈ ప్రాంతానికి వెళ్తే పెద్ద ఎత్తున భారతీయ రెస్టరెంట్లే కాదు... చీరల దుకాణాలూ అత్యధికంగా ఉంటాయి.
* లిటిల్ ఇండియా, సింగపూర్: మన దేశ సంస్కృతి కనిపించే ఈ ప్రాంతంలో భారతీయ రెస్టరెంట్లూ, దుకాణ సముదాయాలూ చాలా ఎక్కువ. అన్నిరకాల రుచులూ దొరుకుతాయి.
* రూ దు ఫాబొ, ప్యారిస్: ప్రపంచ ఫ్యాషన్ రాజధాని ప్యారిస్కి వెళ్లిన మనవాళ్లు తప్పనిసరిగా సందర్శించే ప్రాంతం రూ దు ఫాబొ. అక్కడ భారతీయులకు అవసరమైన దేశీ సరకులే కాదు, ప్యారిస్ ఫ్యాషన్లు అద్దిన దుస్తులూ దొరుకుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Indian origin Family: అనుమానాస్పద స్థితిలో కెనడాలో భారత సంతతి కుటుంబం మృతి
కెనడా(Canada)లో భారత సంతతికి చెందిన ముగ్గురు కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. వారి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
జనసేన ఆవిర్భావ వేడుకల వేళ.. డల్లాస్లో జనసేన, తెదేపా, భాజపా ఆత్మీయ సమావేశం
డల్లాస్లో జనసేన ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు జనసేన నేతలతో పాటు తెదేపా, భాజపా క్యాడర్కు చెందిన పలువురు హాజరయ్యారు. -
సింగపూర్లో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు
సింగపూర్లో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. -
న్యూజెర్సీలో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు
శివుడికి ప్రీతిపాత్రమైన మహా శివరాత్రి పర్వదినాన ‘హర హర మహాదేవ శంభో శంకర’ అంటూ అగ్రరాజ్యంలో ఎన్నారైలు ముక్తకంఠంతో నినదించారు. -
న్యూజెర్సీలో ఓఎఫ్ భాజపా ఆధ్వర్యంలో ‘ఛాయ్పే చర్చ’
న్యూజెర్సీలోని ఎడిసన్ నగరంలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ (BJP) ఆధ్వర్యంలో ‘ఛాయ్ పే చర్చ’ నిర్వహించారు. -
బే ఏరియాలో ‘తెదేపా-జనసేన-భాజపా’కు చెందిన ఎన్ఆర్ఐల ఆత్మీయ సమావేశం
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో స్థిరపడిన ఎన్ఆర్ఐలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. -
అమెరికాలో మే 24-26 మధ్య టీటీఏ మహాసభలు
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) అగ్రరాజ్యంలో భారీగా మహాసభలు నిర్వహించనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు టీటీఏ అధ్యక్షుడు వంశీరెడ్డి కంచరకుంట్ల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. -
సౌదీ అరేబియాలో తెదేపా-జనసేన ఎన్నారై కూటమి సమావేశం
సౌదీ అరేబియాలోని జుబైల్లో తెదేపా-జనసేన ఎన్నారై కూటమి భేటీ అయ్యింది. రాబోయే ఎన్నికలకు వ్యూహరచన చేసేందుకు ‘ఎన్నికల సన్నాహక ఆత్మీయ సమావేశం’ పేరిట ఈ భేటీ నిర్వహించారు. -
డెట్రాయిట్లో అట్టహాసంగా మహిళా దినోత్సవం
గ్లోబల్ తెలంగాణ సంఘం డెట్రాయిట్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. -
తానా బోర్డు ఛైర్మన్గా డా.నాగేంద్ర శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో ప్రతిష్ఠాత్మక బోర్డు ఛైర్మన్ పదవికి డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
డెట్రాయిట్లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
అంతర్జాతీయ మహిళల దినోత్సవం(మార్చి 8) పురస్కరించుకుని ఫార్మింగ్టన్ మేనర్లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (జీటీఏ) డెట్రాయిట్ మహిళా విభాగం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన లేడీస్ నైట్ అట్టహాసంగా జరిగింది. -
TDP - Janasena: షికాగోలో ఘనంగా తెదేపా - జనసేన ఆత్మీయ సమావేశం
తెదేపా, జనసేన నాయకులు షికాగోలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. -
TANA Foundation: తానా ఫౌండేషన్ ఛైర్మన్గా శశికాంత్ వల్లేపల్లి
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ఫౌండేషన్ చైర్మన్గా శశికాంత్ వల్లేపల్లి ఎన్నికయ్యారు. -
Sporty Divas: ఇండో-గల్ఫ్ త్రోబాల్ ఛాంపియన్షిప్ విజేతగా అమెరికా జట్టు
బహ్రెయిన్లో నిర్వహించిన ‘ఇండో-గల్ఫ్ ఇంటర్నేషనల్ త్రోబాల్ ఛాంపియన్షిప్’లో అమెరికాకు చెందిన మహిళల జట్టు ‘స్పోర్టీ దివాస్’ విజేతగా నిలిచింది. -
ఖతార్లో ఎన్నికల శంఖారావం సభ.. భారీగా హాజరైన ప్రవాసులు
ఖతార్లో ఎన్నికల శంఖారావం సభ ఎన్నారై తెలుగుదేశం, జనసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. -
మంగళగిరిలో ‘యూరో కార్ట్’లు.. నారా లోకేశ్ చేతుల మీదుగా చిరు వ్యాపారులకు అందజేత
లండన్ ఎన్నారై ‘జై కుమార్ గుంటుపల్లి’ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. యూరప్లో విజయవంతమైన ‘యూరో కార్ట్’లను ఆంధ్రప్రదేశ్లోని చిరు వ్యాపారులకు పరిచయం చేయాలని సంకల్పించారు. -
తానా ఎన్నిక కథ సుఖాంతం.. కొత్త సభ్యుల ఎన్నికకు బోర్డు ఆమోదం
మార్చి 1 నుంచి కొత్త బోర్డు, పాలకవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరిస్తారని ప్రస్తుత తానా బోర్డు ఛైర్మన్ హనుమయ్య బండ్ల తెలిపారు. -
TANA: తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘అవధాన వైభవం’
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశంలో భాగంగా ఆదివారం నిర్వహించిన 65వ సాహిత్య సమావేశం ‘ అవధాన వైభవం.. నేటి అవధానుల నోట... నాటి మేటి అవధానుల సాహితీఝరి’ ఘనంగా జరిగింది. -
Dubai: భారతీయులకు దుబాయ్ ఆఫర్.. ఐదేళ్ల మల్టిపుల్ ఎంట్రీ పర్యటక వీసా..!
భారత్తో బంధాన్ని బలోపేతం చేసేందుకు వీలుగా ప్రత్యేక వీసా విధానాన్ని దుబాయ్ (Dubai) అమల్లోకి తెచ్చింది. -
ఆస్టిన్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు
ఆస్టిన్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ (TCA) 2024వ సంవత్సరానికి గాను నూతన కార్యవర్గం ఏర్పాటైంది. -
USA: భారత సంతతి ఇంజినీర్కు టెక్సాస్ అత్యున్నత అకడమిక్ అవార్డు
USA: ‘ఇమేజింగ్ సాంకేతికత’లో చేసిన పరిశోధనలకుగానూ భారత సంతతి ఇంజినీర్ అశోక్ వీరరాఘవన్కు అత్యున్నత అకడమిక్ అవార్డు లభించింది.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ నూతన గవర్నర్గా బుధవారం బాధ్యతలు స్వీకరించనున్న రాధాకృష్ణన్
-
Nitin Gadkari: అమితాబ్ సినిమా మూడుసార్లు చూశా: గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు
-
IMD: తెలంగాణలో రెండ్రోజులపాటు వర్షాలు
-
Realme Narzo 70 Pro: ఎయిర్ గెశ్చర్స్ ఫీచర్తో రియల్మీ నార్జో 70 ప్రో
-
IPL: హామీ ఇస్తున్నా.. అప్పటిలోపు కేకేఆర్ను బెటర్ పొజిషన్లో ఉంచుతా: గంభీర్
-
RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ప్రీక్లైమాక్స్లో చేసిన మార్పు ఇదే.. జెన్నీ పాత్ర చనిపోతుందట!