ఘనంగా ‘జనరంజని’ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు
ప్రముఖ తెలుగు సాంస్కృతిక సంస్థ ‘జనరంజని’ తొలి వార్షికోత్సవ వేడుకలు అంతర్జాల వేదికగా ఈ నెల 19, 20 తేదీల్లో ఘనంగా జరిగాయి. ముంబయి, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలతో పాటు సింగపూర్, అమెరికా, యూకే నుంచి ఎంతోమంది అతిథులు, సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండు రోజుల పాటు కనులవిందుగా జరిగిన ఈ కార్యక్రమంలో జీవీఎల్ నరసింహారావు, బుచ్చి రాంప్రసాద్, వామరాజు సత్యమూర్తి, కామర్స్ బాలసుబ్రమణ్యం వంటి ప్రముఖ రాజకీయవేత్తలు, తెలుగు సంస్కృతి పోషకులు అతిథులుగా పాల్గొని ప్రసంగించారు.
జనరంజని వ్యవస్థాపకులు రుద్రాభట్ల రామ్ కుమార్ మాట్లాడుతూ ‘గత సంవత్సర కాలంగా జనరంజని తరఫున ఎన్నో సాంస్కృతిక, సాహిత్య, ఆధ్యాత్మిక, సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని, సభ్యులందరి సహకారంతో మరిన్ని చక్కటి కార్యక్రమాలను నిర్వహించాలని ఆకాంక్షిస్తున్నాం’ అని తెలిపారు. అమెరికా నుంచి రమేష్ దేశిభొట్ల, సింగపూర్ నుంచి కవుటూరు రత్న కుమార్ కూడా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక శుభాకాంక్షలు అందించారు.
మలయాళ లలితాంబికా తపోవనం పీఠాధిపతి సర్వేశ్వరానందగిరి స్వామీజీ జ్యోతి వెలిగించి కార్యక్రమం ప్రారంభించగా, ప్రముఖ నేపథ్య గాయని దివాకర్ల సురేఖ మూర్తి, సుమధుర గాయకులు నేమాని పార్థసారథి బృందం చక్కటి సినీ లలిత గీతాలతో అలరించారు. బెంగళూరు నుంచి ప్రహ్లాద ఆచార్య ‘షాడో షో’లో నీడలతో తెరపై బొమ్మలను ప్రదర్శించిన తీరు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
హాస్యబ్రహ్మ శంకరనారాయణ తమ చక్కటి హాస్య ప్రసంగంతో నవ్వులు కురిపించగా, మండా వరలక్ష్మి హరికథాగానం, పగడాల శృతి జానపద గీతాలు, వేముల రంగారావు మురళీవాదన, సింగపూర్ నుంచి గుంటూరు వెంకటేష్ ఈల పాటలు, అత్తిలి అనంతరామ్ హాస్య కథానిక, చిన్నారుల నృత్యాలు మొదలైన అంశాలు అందరిని ఎంతో అలరించాయి.
రాధిక మంగిపూడి, కస్తూరి శివశంకర్, శ్రీలేఖ వారణాసి, దశక చంద్రశేఖర్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా, శ్రీ కంభంపాటి మాధవరావు వందన సమర్పణ చేశారు. స్వర మీడియా మరియు ట్రైనెట్ వారు మీడియా భాగస్వాములుగా వ్యవహరించి ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్, ఫేస్బుక్ ‘స్వర రేడియో’ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Nikhil: ‘కార్తికేయ-2’ వాయిదా వేయాలని దిల్ రాజు కోరలేదు: నిఖిల్
-
Technology News
WhatsApp: ఒక్క స్వైప్తో వాట్సాప్లో కెమెరా యాక్సెస్!
-
Politics News
Bandi Sanjay: భాజపా-తెరాస కార్యకర్తల ఘర్షణ.. బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత
-
Sports News
Independence Day : స్వాతంత్ర్య వజ్రోత్సవ వేళ.. మెగా ఈవెంట్లలో భారత క్రీడాలోకం ఇలా..!
-
General News
Independence Day: రామోజీ ఫిల్మ్సిటీలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు
-
Movies News
Puri Jagannadh: విజయ్ దేవరకొండ రూ.2 కోట్లు వెనక్కి పంపించేశాడు: పూరీ జగన్నాథ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (15-08-2022)
- Meena: అవయవదానానికి ముందుకొచ్చిన నటి మీనా
- Ukraine Crisis: ఉక్రెయిన్లో సమాధుల తవ్వకాలు.. కారణమేంటంటే?
- Rakesh Jhunjhunwala: మరణం కూడా చిన్నబోయేలా..! వీల్ఛైర్లో ఝున్ఝున్వాలా డ్యాన్స్
- Kohinoor Diamond: కోహినూర్ సహా కొల్లగొట్టినవెన్నో.. ఇప్పటికీ లండన్ మ్యూజియాల్లో..
- Jadeja : రవీంద్ర జడేజా కంప్లీట్ ప్యాకేజ్.. కానీ భారీగా వికెట్లు తీస్తాడని మాత్రం ఆశించొద్దు!
- Crime News: న్యాయస్థానం ఆవరణలోనే భార్య గొంతుకోశాడు
- Taiwan: అగ్రరాజ్యం దూకుడు! తైవాన్లో అడుగుపెట్టిన మరో అమెరికా బృందం
- Liger: సూపర్స్టార్ అంటే ఇబ్బందిగా ఫీలవుతా.. నేనింకా చేయాలి: విజయ్ దేవరకొండ
- Exercise: వ్యాయామం చేస్తే..ఆరోగ్యం మీ సొంతం