KTR: ప్రవాసులే తెలంగాణ రాయబారులు
తెలంగాణకు దేశవిదేశాల్లోని ప్రవాసులే గొప్ప రాయబారులని.. సొంత రాష్ట్ర అభివృద్ధికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
రాష్ట్ర అభివృద్ధికి మీరే వెన్నుదన్ను
పెట్టుబడుల సాధనకు ఊతమివ్వాలి
అమెరికాలో మంత్రి కేటీఆర్
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణకు దేశవిదేశాల్లోని ప్రవాసులే గొప్ప రాయబారులని.. సొంత రాష్ట్ర అభివృద్ధికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పెట్టుబడుల సాధనకు నిరంతర కృషి చేయాలని, మన ఊరు-మన బడి కార్యక్రమానికి పెద్దఎత్తున చేయూతనివ్వాలని కోరారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చే లక్ష్యంతో అమెరికాకు వెళ్లిన కేటీఆర్కు ఆదివారం లాస్ఏంజెలెస్ విమానాశ్రయంలో ప్రవాసులు, తెరాస కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.శాలువాలతో సత్కరించారు. అనంతరం మంత్రి విమానాశ్రయంలో ప్రవాసులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన పర్యటన లక్ష్యాలను వారికి వివరించారు.
‘‘ప్రపంచంలోని 60 శాతం దేశాలకు చెందిన సంస్థలు భారీ పెట్టుబడులతో తెలంగాణలో పరిశ్రమలు, ఆర్థిక సంస్థలు, పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను నెలకొల్పాయి. అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థలు హైదరాబాద్లో ప్రధాన కార్యాలయాలను స్థాపించాయి. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాల దృష్ట్యా మరిన్ని సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఆయా సంస్థలతో సంప్రదింపులు జరపడంతోపాటు కొత్త వాటిని ఆకర్షించేందుకు మళ్లీ అమెరికాకు వచ్చా. తెలంగాణలో పరిశ్రమల కోసం 80 వేల ఎకరాలకుపైగా భూమి అందుబాటులో ఉంది. వాహనరంగంతో పాటు మరికొన్ని రంగాల్లో భారీ పరిశ్రమలు ఏర్పాటు కావాల్సి ఉంది. యువతకు వేల సంఖ్యలో ఉద్యోగాలు రావాలి. వీటన్నింటినీ సాధించేందుకు విదేశీ పర్యటనలు చేస్తున్నా.
రాష్ట్ర పండగలకు అమెరికాలోనూ సందడి..
అమెరికా అభివృద్ధిలో ప్రవాస తెలంగాణీయులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. వారి ద్వారా తెలంగాణ ఖ్యాతి విస్తరిస్తోంది. రాష్ట్రంలో పండగలు వస్తే.. అమెరికాలోనూ అదే వాతావరణం కనిపిస్తోంది. బతుకమ్మ, బోనాలు, దసరా, దీపావళి తదితర వేడుకలను ఇక్కడ ఘనంగా నిర్వహించి మన సంస్కృతి, సంప్రదాయాలను చాటుతున్నారు.
ప్రవాసుల సంక్షేమానికి కృషి..
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ అభివృద్ధి చేసి, వాటికి కొత్త రూపు తేవాలనే బృహత్తర సంకల్పంతో సీఎం కేసీఆర్ ‘మన ఊరు-మనబడి’ పథకాన్ని చేపట్టారు. దానికి పెద్దఎత్తున విరాళాలు అందుతున్నాయి. మీరూ విరాళాలు అందించి విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయాలి. ప్రవాసుల సంక్షేమానికి పెద్దఎత్తున కృషి చేస్తున్నాం. ఎవరికి ఏ ఆపద వచ్చినా వెంటనే ఆదుకుంటున్నాం. మన వినతులపై హైదరాబాద్లోని అమెరికన్ కాన్సులేట్ అధికారులు, అమెరికాలోని భారత రాయబార కార్యాలయ అధికారులు చక్కగా సహకరిస్తున్నారు’’ అని కేటీఆర్ తెలిపారు.
ఈ సందర్భంగా ప్రవాసులు మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందరినీ ఆకర్షిస్తున్నాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టడం ద్వారా సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారని కొనియాడారు. ‘మన ఊరు - మన బడి’కి అమెరికా నుంచి పెద్దఎత్తున విరాళాలను సమీకరిస్తామన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్
-
భద్రాచలం తరహాలో అమెరికాలో రామాలయం
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు. -
సింగపుర్లో శ్రీ మారియంబికా ఆలయంలో ఘనంగా చండీహోమం
సింగపుర్లోని వాసవీ క్లబ్ మెర్లయన్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు అత్యంత పురాతన, విశిష్టమైన శ్రీ మారియంబికా ఆలయంలో చండీహోమం నిర్వహించారు. -
కూటమి గెలిస్తేనే ఏపీకి భవిష్యత్తు.. ఖతార్లో తెదేపా ఆవిర్భావ వేడుకల్లో నేతలు
తెదేపా ఆవిర్భావ వేడుకలు ఖతార్లో ఘనంగా నిర్వహించారు. ఖతార్ తెలుగుదేశం పార్టీ నేతల ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
ప్రాచీన భారతీయ సాహిత్యం- ఆధునిక విజ్ఞాన వికాసంపై తానా ప్రపంచ సాహిత్యవేదిక సదస్సు
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ‘ప్రాచీన భారతీయ సాహిత్యం- ఆధునిక విశ్వ విజ్ఞానశాస్త్ర వికాసానికి మూలం’ అనే అంశంపై సదస్సు విజ్ఞానదాయకంగా జరిగింది. -
ఘనంగా క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ (QEF) వెబ్సైట్ ఆవిష్కరణ
ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్వచ్ఛమైన సమాజమే లక్ష్యంగా ఆవిర్భవించిన క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ తన వెబ్సైట్ను www.qef.org ఆవిష్కరించింది. నాణ్యమైన సాంకేతిక ప్రయాణంలో దీన్నొక మైలురాయిగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు వక్తలు పేర్కొన్నారు. -
ఏపీని ఆదుకునే ఎన్నారైలపై ఇంత అక్కసా?: జయరాం కోమటి
రాష్ట్రానికి మేలు చేసేలా కృషిచేస్తున్న ఎన్నారైలపై వైకాపా నాయకులు బెదిరింపులకు పాల్పడటం అత్యంత దారుణమని ప్రముఖ ప్రవాసాంధ్రుడు, ఎన్నారై తెదేపా అమెరికా సమన్వయకర్త జయరాం కోమటి అన్నారు. -
ఎన్ఆర్ఐ తెదేపా, జనసేన ఆధ్వర్యంలో తెదేపా ఆవిర్భావ వేడుకలు
ఎన్ఆర్ఐ తెదేపా కువైట్, జనసేన కువైట్ సంయుక్త ఆధ్వర్యంలో తెదేపా 42వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
డార్ట్ఫోర్డ్లో ఉల్లాసంగా హోలీ వేడుకలు
బ్రిటన్లోని డార్ట్ఫోర్డ్లో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. కెంట్లోనే అతిపెద్ద ఈవెంట్గా చేపట్టిన ఈ వేడుకలకు 3వేల మందికి పైగా హాజరయ్యారు. -
డాలస్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని డాలస్ నగరంలో ఘనంగా నిర్వహించారు. -
వాషింగ్టన్ డీసీలో ఘనంగా తానా (నరేన్ వర్గం) విజయోత్సవ సభ
తానా ఎన్నికల్లో డా.నరేన్ కొడాలి వర్గం నుంచి గెలిచిన అభ్యర్థులంతా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం శనివారం (మార్చి 23న) సాయంత్రం వాషింగ్టన్ డీసీలో విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించారు.