ఉత్సాహంగా సాగిన ‘మాయా బజార్-2022’
బే ఏరియాలో నిర్వహించిన మాయా బజార్-2022 పరవశింపజేసింది. భారతీయ కమ్యూనిటీలో ఒక ల్యాండ్మార్క్ ఈవెంట్గా నిలిచినట్లు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రముఖులు పేర్కొన్నారు.
అమెరికా: బే ఏరియాలో నిర్వహించిన మాయా బజార్-2022 పరవశింపజేసింది. భారతీయ కమ్యూనిటీలో ఒక ల్యాండ్మార్క్ ఈవెంట్గా నిలిచినట్లు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రముఖులు పేర్కొన్నారు. అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్(ఏఐఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక ఉత్సవం అందరినీ మంత్రముగ్ధులను చేసింది. పదివేల మందికిపైగా మంది ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని తమ కుటుంబ సభ్యులతో ఉత్సహాంగా గడిపారు. మాయా బజార్ రిఫ్రెష్గా, మనోహరంగా, దృశ్యపరంగా అద్భుతమైందని, పూర్తిగా ఆకర్షణీయంగా ఉందని ఈ కార్యక్రమానికి వచ్చినవారు పేర్కొన్నారు. బే ఏరియా మొత్తం స్వచ్ఛమైన ఆహ్లాదకర సంగీతంతో మార్మోగింది.
ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం సాయంత్రం 7 గంటల వరకు సాగింది. ఛోటా భీమ్, చుట్కీ వేషధారణతో పిల్లలు, పెద్దలను అలరించారు. పిల్లల కోసం అనేక కార్నివాల్ గేమ్లు, స్లయిడ్లు నిర్వహించారు. జంగిల్ బుక్, డైనోసార్ పెట్టింగ్ జూ, జంప్ హౌస్లు పిల్లలతో రన్అవే వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మాయాబజార్ ఎక్స్ప్రెస్ వంటివి చిన్నారులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ ఈవెంట్కు గ్రాండ్ స్పాన్సర్గా సంజీవ్ గుప్తా సీపీఏ, రియల్టర్ నాగరాజ్ వ్యవహరించారు. సిటీ ఆఫ్ శాన్ రామన్ ఈవెంట్ పార్ట్నర్, బోలీ 92.3 FM సహ-స్పాన్సర్గా వ్యవహరించాయి. రైట్ బైట్ డెంటల్ సమర్పించారు. సిల్వర్ స్పాన్సర్గా రాయ్ చెట్టి (ఫార్మర్స్ ఇన్సూరెన్స్), ఇతర స్పాన్సర్లుగా ఐసీఐసీఐ బ్యాంక్, ఆజాద్ ఫైనాన్షియల్స్, మాన్ప్రెన్యూర్ వ్యవహరించాయి.
ఈ కార్యక్రమంలో భారతీయ సాంస్కృతిక, కళారూపాలను ప్రదర్శించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. కూచిపూడి, భరత నాట్యం, కథక్ శాస్త్రీయ నృత్యాలు ఫుట్ వాద్యం, పలు తెలుగు సినిమాల నృత్యాలు ప్రేక్షకులను బాగా అలరించాయి. బాటా కరోకే బృందం తన గానంతో సభికులను అలరించారు. ఇక, ఆహారం విషయానికి వస్తే.. మిర్చి మసాలా- ఫుడ్ ఫెస్టివల్ విశిష్టమైన ప్రెజెంటేషన్తో వివిధ రుచికరమైన వంటకాలను అందించారు. దానికి తోడు షాపింగ్ చేయాలని ఉవ్విళ్లూరేవారికి మాయాబజార్ ఓ వేదికగా మారింది. 65 మంది విక్రేతలు ఈవెంట్ స్పాన్సర్లు, దుస్తులు, నగలు, మెహందీ, రియల్ ఎస్టేట్, పాఠశాలలు, ఐటీ శిక్షణ, ఆరోగ్య సేవలు, సంగీత పాఠశాలలు తదితర వాటిని ప్రదర్శించారు. తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) బోన్ మ్యారో డ్రైవ్ నిర్వహించింది.
ఈ సందర్భంగా కాన్సుల్ జనరల్ డా.టి.వి నాగేంద్ర ప్రసాద్ను అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్(ఏఐఏ) బృందం ఘనంగా సత్కరించింది. అసెంబ్లీ సభ్యుడు రెబెక్కా బాయర్, శాన్ రామన్ మేయర్ డేవిడ్ హడ్సన్, శాన్ రామన్ వైస్ మేయర్ శ్రీధర్ వెరోస్, కౌన్సిల్ మెంబర్ సబీనా జాఫర్, డబ్లిన్ సిటీ వైస్ మేయర్ జీన్ జోసీ, కౌన్సిల్ సభ్యుడు మైఖేల్ మెక్కోరిస్టన్, మౌంటైన్ హౌస్ ప్రి హారీ డి.ధిల్లాన్, ట్రేసీ సిటీ మేయర్ ప్రోటెమ్ వెరోనికా వర్గాస్, ఎరిక్ స్వాల్వెల్ కార్యాలయం నుంచి జిల్లా డైరెక్టర్ను సత్కరించారు. ఇంత ఆహ్లాదకరంగా వేసవి ఉత్సవాలను నిర్వహిస్తున్న సందర్భంగా స్టా కమ్యూనిటీ కళాశాల బోర్డు అధ్యక్షుడు ఆండీ లీతో పాటు పలువురు ప్రముఖులు ఏఐఏని అభినందించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆశాజ్యోతి, స్పందన, శంకర్ ఐ ఫౌండేషన్ వాలంటీర్లకు ఏఐఏ బృందం కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన రాబడిలో కొంత భాగాన్ని లాభాపేక్షలేని సంస్థలకు విరాళంగా అందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్
-
భద్రాచలం తరహాలో అమెరికాలో రామాలయం
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు. -
సింగపుర్లో శ్రీ మారియంబికా ఆలయంలో ఘనంగా చండీహోమం
సింగపుర్లోని వాసవీ క్లబ్ మెర్లయన్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు అత్యంత పురాతన, విశిష్టమైన శ్రీ మారియంబికా ఆలయంలో చండీహోమం నిర్వహించారు. -
కూటమి గెలిస్తేనే ఏపీకి భవిష్యత్తు.. ఖతార్లో తెదేపా ఆవిర్భావ వేడుకల్లో నేతలు
తెదేపా ఆవిర్భావ వేడుకలు ఖతార్లో ఘనంగా నిర్వహించారు. ఖతార్ తెలుగుదేశం పార్టీ నేతల ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
ప్రాచీన భారతీయ సాహిత్యం- ఆధునిక విజ్ఞాన వికాసంపై తానా ప్రపంచ సాహిత్యవేదిక సదస్సు
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ‘ప్రాచీన భారతీయ సాహిత్యం- ఆధునిక విశ్వ విజ్ఞానశాస్త్ర వికాసానికి మూలం’ అనే అంశంపై సదస్సు విజ్ఞానదాయకంగా జరిగింది. -
ఘనంగా క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ (QEF) వెబ్సైట్ ఆవిష్కరణ
ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్వచ్ఛమైన సమాజమే లక్ష్యంగా ఆవిర్భవించిన క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ తన వెబ్సైట్ను www.qef.org ఆవిష్కరించింది. నాణ్యమైన సాంకేతిక ప్రయాణంలో దీన్నొక మైలురాయిగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు వక్తలు పేర్కొన్నారు. -
ఏపీని ఆదుకునే ఎన్నారైలపై ఇంత అక్కసా?: జయరాం కోమటి
రాష్ట్రానికి మేలు చేసేలా కృషిచేస్తున్న ఎన్నారైలపై వైకాపా నాయకులు బెదిరింపులకు పాల్పడటం అత్యంత దారుణమని ప్రముఖ ప్రవాసాంధ్రుడు, ఎన్నారై తెదేపా అమెరికా సమన్వయకర్త జయరాం కోమటి అన్నారు. -
ఎన్ఆర్ఐ తెదేపా, జనసేన ఆధ్వర్యంలో తెదేపా ఆవిర్భావ వేడుకలు
ఎన్ఆర్ఐ తెదేపా కువైట్, జనసేన కువైట్ సంయుక్త ఆధ్వర్యంలో తెదేపా 42వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం