చార్లెట్లో ‘తానా’ మదర్స్ డే వేడుకలు
తానా ఆధ్వర్యంలో అమెరికాలోని చార్లెట్ నగరంలో మే 6న మదర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. తానా ప్రాంతీయ కార్యదర్శి నాగ పంచుమర్తి,......
చార్లెట్: తానా ఆధ్వర్యంలో అమెరికాలోని చార్లెట్ నగరంలో మే 6న మదర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. తానా ప్రాంతీయ కార్యదర్శి నాగ పంచుమర్తి, విమన్ ఎంపవర్మెంట్ ఛైర్ మాధురి ఏలూరి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిర్వహించిన ఈ వేడుకల్లో 400 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు. తొలుత ఆహుతులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలతో స్వాగతం పలికి.. విఘ్నేశ్వరుడిని స్తుతిస్తూ ఆలపించిన పాటతో ఈ కార్యక్రమం ప్రారంభించారు. వర్జీనియా నుంచి అతిథిగా విచ్చేసిన ప్రముఖ ఫ్యాషన్ మోడల్ చైతన్య పోలోజు పరిచయం అనంతరం అందరితో కలివిడిగా తిరుగుతూ ఈ కార్యక్రమానికి మరింత శోభ తెచ్చారు.
సోలో, గ్రూపు డ్యాన్స్లు, స్కిట్లు, ఫ్యాషన్ షో, ఆట పాటలు.. ఇలా ప్రతి ఒక్క కార్యక్రమం అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రెండు తరాల అమ్మల ఫ్యాషన్ షో మదర్స్ డే సెలబ్రేషన్స్కే హైలెట్గా నిలిచింది. దీంతో అందరూ అమ్మలతో తమ మధురానుస్మృతుల్ని నెమరువేసుకున్నారు. అలాగే, సద్గురు లీడ్ చేస్తున్న సేవ్ సాయిల్ ఉద్యమానికి మద్దతుగా చేసిన నాటకం అందరినీ ఆలోచింపజేసింది. తెలుగు సినీ గాయని సత్య యామిని తన పాటలతో ప్రేక్షకులందరినీ ఉర్రూతలూగించింది. బాహుబలి, అఖండ, అల వైకుంఠపురంలో, వకీల్ సాబ్, రాధే శ్యామ్, అరవింద సమేత వంటి తాజా చిత్రాల్లోని మెలోడీలతో ఉర్రూతలూగించింది. ఈ కార్యక్రమానికి మధు నెక్కంటి వ్యాఖ్యాతగా వ్యవహరించి సందర్భానుసారంగా పదునైన సంభాషణలతో సమయస్ఫూర్తితో వ్యవహరించారు.
తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, టీం స్క్వేర్ ఛైర్మన్ సురేష్ కాకర్ల, స్థానిక అపలాచియన్ నాయకులు పురుషోత్తమ చౌదరి గుదె, ఠాగూర్ మల్లినేని, రమణ అన్నె, సచీంద్ర ఆవులపాటి, రవి నాయుడు, రామ్ అల్లు, కేదార్ బలిశెట్టి, శ్రీపాద కాసులను వేదికపైకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపి, తానా చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. తదనంతరం తానా అపలాచియన్ రీజియన్ ప్రాంతీయ కార్యదర్శి నాగ పంచుమర్తి పరమపదించిన తన మాతృమూర్తితో గత అనుభవాలను పంచుకున్నారు. దీంతో కార్యక్రమానికి విచ్చేసిన అమ్మలంతా వేదిక పైకి వచ్చి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అమ్మల అమ్మలకు ప్రత్యేకంగా అంటూ నాగ పంచుమర్తి కుటుంబం సమర్పించిన రాఫుల్ బహుమతులు అందించారు.
డైమండ్ రింగ్స్, గోల్డ్ కాయిన్స్, ఖరీదైన చీరలతో గ్రాండ్ ర్యాఫుల్ బహుమతులతో పాటు, రిటర్న్ గిఫ్ట్స్, సర్ప్రైజ్ గిఫ్ట్ బాక్సులతో మహిళలు ఆనందంగా కనిపించారు. షాపింగ్ స్టాల్స్ మహిళలను విశేషంగా ఆకట్టుకున్నాయి. మొట్టమొదటిసారిగా వేదికపై ఏర్పాటుచేసిన డిజిటల్ స్క్రీన్, మ్యాజిక్ మంత్ర నుంచి కవిత చేసిన చక్కని అలంకరణ, డీజే మురళీ, బాలాజీ మంద ఫోటోగ్రఫీ, ఘుమఘుమలాడే ఎగ్జిక్యూటివ్ స్టైల్ విందు భోజనం అన్నీ ఈ కార్యక్రమానికి మరింత ఆకర్షణగా తెచ్చిపెట్టాయి. ఈ తానా మదర్స్ డే సెలబ్రేషన్స్ని మహిళలకు ప్రత్యేకంగా.. అందులోనూ కరోనా మహమ్మారి తర్వాత ముఖాముఖిగా అత్యంత ప్రణాళికా బద్ధంగా నిర్వహించిన తానా అపలాచియన్ రీజియన్ ప్రాంతీయ కార్యదర్శి నాగ పంచుమర్తి, విమెన్ ఎంపవర్మెంట్ ఛైర్ మాధురి ఏలూరిలను అందరూ అభినందించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన శ్రీనాథ్ గింజుపల్లి, ఉపేంద్ర సాయిరాం కిలారు, రమ్య పెద్ది, సౌమ్య శ్రీ, దీప్తి నన్నపనేని, స్వప్న కొల్లూరు, పద్మ నున్న, పల్లవి కొల్లిపర, దీప ఉప్పల, మంజూష పూనాటి, మణి కొట్టె, శిరీష అనుముకొండ, విజయ నెల్లి, విజయ ఒగ్గు, నీలిమ దేవినేని, వసంత కావూరి, ప్రదీప్తి, సౌజన్య బండ్లమూడి, ప్రుణితారెడ్డి, వాణి గొర్రెపాటి, ఉషారాణి, ఝాన్సీ అబ్బూరి, జ్యోత్స్న గంటా, పద్మజ కొమ్మినేని, రూప తలశిల, వినీషా సాదినేనితో పాటు ఆహుతులకు కృతజ్ఞతలు చెప్పి ఈ కార్యక్రమాన్ని ముగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్
-
భద్రాచలం తరహాలో అమెరికాలో రామాలయం
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?