TANA: తానా సభలకు ‘గెస్ట్ స్పీకర్’గా రమేష్‌ నాయుడు

23వ తానా సభలకు అతిథి వక్తగా ఏపీ భాజపా కార్యదర్శి నాగోతు రమేష్‌ నాయుడుని ఆహ్వానించారు. ఈ మేరకు తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, మహాసభల కోఆర్డినేటర్‌ రవి పొట్లూరి ఆయనకు లేఖ రాశారు.

Published : 17 Jun 2023 15:06 IST

పెన్సిల్వేనియా: ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన తెలుగు సంఘంగా గుర్తింపు పొందిన ‘తానా’ 23వ మహాసభలు అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఫిలడెల్ఫియాలో ఘనంగా నిర్వహించనున్నారు. జులై 7, 8, 9 తేదీల్లో జరగబోతున్న ఈ కార్యక్రమానికి రాజకీయ, అతిథివక్తగా ఏపీ భాజపా కార్యదర్శి నాగోతు రమేష్‌ నాయుడిని ఆహ్వానించారు. ఈ మేరకు తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, మహాసభల కోఆర్డినేటర్‌ రవి పొట్లూరి ఆయనకు లేఖ రాశారు. ఈ సందర్భంగా రమేశ్‌నాయుడు మాట్లాడుతూ.. అనేక సంవత్సరాలుగా విదేశాల్లో స్థిరపడినప్పటికీ తెలుగు వారి జీవన విధానానికి, సాంస్కృతిక వైభవానికి, భవిష్యత్ తరాలకు వారధిగా పనిచేస్తున్న తానా నుంచి ఆహ్వానం అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. తానా మహాసభల్లో ప్రత్యేకంగా జీ20 అంశంపై ప్రసంగించనున్నట్లు చెప్పారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు