Washington: వారిద్దరూ యుగపురుషులు: ఏఎస్ రామకృష్ణ
అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ప్రవాసాంధ్రుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, ఘంటసాల చిత్రపటాలకు నివాళులర్పించారు.
వాషింగ్టన్ డీసీ: ఎన్టీఆర్, ఘంటసాల ఇద్దరూ యుగపురుషులని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ అన్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ప్రవాసాంధ్రుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భాను మాగులూరి అధ్యక్షత వహించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ఎన్టీఆర్, ఘంటసాల శతజయంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఎస్ రామకృష్ణ, నాటక అకాడమీ మాజీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు, సామినేని కోటేశ్వరరావు, గోరంట్ల పున్నయ్య చౌదరి, గంటా పున్నారావు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏఎస్ రామకృష్ణ మాట్లాడుతూ.. తెలుగు జాతికి, తెలుగు భాషకు ఎన్టీఆర్, ఘంటసాల గుర్తింపు తీసుకొచ్చారన్నారు. తెలుగు భాషలోని మాధుర్యాన్ని, గొప్పతనాన్ని వీరిద్దరూ భావితరాలకు అందించారన్నారు. ప్రపంచ తెలుగుదనాన్ని ఒక గొడుగు కిందకు చేర్చిన వీరిద్దరూ యుగపురుషులని కొనియాడారు. గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. భగవద్గీతను ఆలపించడం ద్వారా ఘంటసాల, కృష్ణుడి పాత్ర ద్వారా ఎన్టీఆర్ ప్రపంచ తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. అలాంటి మహనీయుల శతజయంతి ఉత్సవాలు జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. ప్రవాసాంధ్రుల తల్లిదండ్రుల సమావేశం నిర్వహించుకోవడం ప్రతి ఒక్కరిలో ఆనందాన్ని నింపిందన్నారు. తల్లిదండ్రులను గౌరవించడం ప్రతిఒక్కరి బాధ్యతని చెప్పారు. ఇలాంటి సమావేశాలు భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు.
గోరంట్ల పున్నయ్య చౌదరి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రతిభ, పేదరికం, గ్రామీణ నేపథ్యం ఉన్న బాలికల కోసం ఉచిత భోజనం, వసతి కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని యువత అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారని, ముఖ్యంగా గ్రామీణ వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబాల్లోని విద్యార్థులు అమెరికాలో బాగా స్థిరపడ్డారని భాను ప్రకాష్ మాగులూరి అన్నారు. జన్మభూమి స్ఫూర్తితో గ్రామాల్లో మన వంతుగా పేద విద్యార్థినీ, విద్యార్థులకు సహాయ సహకారాలు అందించాలన్నారు. ప్రవాసాంధ్రుల తల్లిదండ్రులు పెద్దఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మైనేని రాంప్రసాద్, సెక్రటరీ మన్నవ వెంకటేశ్వరరావు ఈ వేడుకను సమన్వయపరిచారు. ఈ కార్యక్రమంలో మన్నె సత్యనారాయణ, కృష్ణ లాం, రాం చౌదరి ఉప్పుటూరి, కార్తీక్ కోమటి, సుశాంత్ మన్నె, హను గట్టు, కిషోర్ కంచర్ల, హరికృష్ణ, బండ మల్లారెడ్డి, రమణారావు కంభంపాటి, కోట రామ్మోహన్, వై.శంకరరావు, పాకాలపాటి కృష్ణయ్య, యండమూరి నాగేశ్వరరావు, రవి ఐతా తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Jawan: ‘జవాన్’ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే!
-
Pakistan-New Zealand: హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లు
-
Amaravati: ఏపీ సచివాలయంలో 50 మంది అసిస్టెంట్ సెక్రటరీలకు రివర్షన్
-
Law Commission: ‘జమిలి’ నివేదికపై కసరత్తు జరుగుతోంది.. లా కమిషన్ ఛైర్మన్
-
IND vs AUS: టీమ్ఇండియా ఆలౌట్.. మూడో వన్డేలో ఆస్ట్రేలియా విజయం