Mahanadu: మహానాడుకు ప్రవాసాంధ్రులు.. ప్రశంసించిన చంద్రబాబు

తేదేపా నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమానికి విదేశాల నుంచి కూడా ప్రతినిధులు హాజరయ్యారు. మే 28వ తేదీని తెలుగు హెరిటేజ్‌ డే గా ప్రకటిస్తూ జారీ చేసిన ప్రొక్లెమేషన్లను ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు అందజేశారు.

Published : 27 May 2023 20:46 IST

రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరంలో పెద్ద ఎత్తున జరుగుతున్న మహానాడుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. మే 28 ఎన్టీఆర్ శతజయంతిని అమెరికాలోని వివిధ నగరాలలో ‘తెలుగు హెరిటేజ్ డే’ గా ప్రకటించారు. ఆయా నగర మేయర్లు ఎన్టీఆర్ పుట్టిన రోజైన మే 28ని తెలుగు హెరిటేజ్ డే గా గుర్తిస్తూ ప్రొక్లమేషన్ ఇచ్చారు. టెక్సాస్, ఇలినాయిస్‌, నార్త్ కెరోలిన తదితర రాష్ట్రాల్లోని వివిధ నగరాలలో జారీ చేసిన  ప్రొక్లెమేషన్లను ఎన్‌ఆర్‌ఐ తెదేపా యూఎస్‌ఏ కోఆర్డినేటర్‌ కోమటి జయరాం, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, నాట్స్‌ మాజీ అధ్యక్షుడు మన్నవ మోహన కృష్ణ తదితరులు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బుచ్చిరామ్ ప్రసాద్, రవి మందలపు, కృష్ణ గొంప, సురేష్ కాకర్ల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..అమెరికాలో మే 28ని  ‘తెలుగు హెరిటేజ్ డే’ గా గుర్తించటం తెలుగువారందరికీ గర్వకారణమని అన్నారు. ఎన్‌ఆర్‌ఐలు మాతృభూమిని గుర్తు చేసుకుంటూ ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తున్నారని ప్రశంసించారు. తెదేపాకు అండగా ఉంటూ.. పార్టీ అభ్యున్నతికి తోడ్పాటునందిస్తున్నారని కొనియాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని