శ్రీనివాస్ కూకట్ల ఆధ్వర్యంలో అద్దంకిలో ‘తానా చైతన్య స్రవంతి’
బాపట్ల జిల్లా అద్దంకిలో ఎన్ఆర్ఐ శ్రీనివాస్ కూకట్ల ఆధ్వర్యంలో డిసెంబరు 23 నుంచి 27 వరకు తానా చైతన్య స్రవంతి కార్యక్రమాలు వైభవంగా జరిగాయి.
అద్దంకి: బాపట్ల జిల్లా అద్దంకిలో ఎన్ఆర్ఐ శ్రీనివాస్ కూకట్ల ఆధ్వర్యంలో డిసెంబరు 23 నుంచి 27 వరకు తానా చైతన్య స్రవంతి కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. తెలుగు వారు గర్వపడేలా తానా మహాసభలు జులై 7, 8, 9 తేదీల్లో అమెరికాలోని పిలదెల్పియాలో జరగనున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ‘తానా చైతన్య స్రవంతి’ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అద్దంకిలో తానా, కూకట్ల ఫౌండేషన్, తానా ఫౌండేషన్, పలువురు దాతల సహకారంతో ఐదు రోజుల పాటు వైద్య శిబిరాలు, క్రీడా పోటీలు, రైతు సేవా కార్యక్రమాలు, వికలాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ, పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ, ల్యాప్టాప్ల బహుకరణ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
తానా కో-ఆర్డినేటర్ శ్రీనివాస్ కూకట్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ జనార్ధన్ నిమ్మలపూడి, చైతన్య స్రవంతి కో ఆర్డినేటర్ సునీల్ పాంట్ర, తానా టెంపుల్ కో-ఆర్డినేటర్ జగదీశ్వరరావు పెద్దిబోయిన, అప్పలాటిన్ రీజినల్ రిప్రెజెంటేటివ్ నాగ పంచుమర్తి, తానా స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ శశాంక్ యార్లగడ్డ, పలువురు ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులు హాజరయ్యారు.
సింగరకొండ శ్రీప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకున్న తానా టీం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింగరకొండ శ్రీప్రసన్నాంజనేయ స్వామి వారిని అంజయ్య చౌదరి లావు, శ్రీనివాస్ కూకట్ల, జనార్ధన్ తదితరులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ ఛైర్మన్ కోటా శ్రీనివాస్, వేదపండితులు స్వాగతం పలికారు. స్వామి వారికి ప్రత్యేక పూజల అనంతరం పండితులు ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ ఛైర్మన్ విజ్ఞప్తి మేరకు దేవస్థానానికి 120కేవీ జనరేటర్ను తానా ఫౌండేషన్, కూకట్ల ఫౌండేషన్ తరఫున అందజేసేందుకు హామీ ఇచ్చారు.
శ్రీనివాస్ కూకట్ల అద్దంకి శ్రీమంతుడు: అంజయ్య చౌదరి
తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి మాట్లాడుతూ.. కూకట్ల ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీనివాస్ కూకట్ల అద్దంకి ప్రాంత శ్రీమంతుడని కొనియాడారు. ఇలాంటి వ్యక్తి అద్దంకిలో ఉండటం ఈ ప్రాంత వాసులకు గర్వకారణమన్నారు. తానా డైరెక్టర్ జనార్ధన్ మాట్లాడుతూ.. కూకట్ల సోదరులు శ్రీనివాస్, వెంకటకృష్ణ, హరీష్ చౌదరిల సేవా దృక్పథాన్ని కొనియాడారు. అద్దంకి ప్రాంత ప్రముఖులు, విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు కూకట్ల సేవలను అభినందించారు. శ్రీనివాస్ కూకట్ల మాట్లాడుతూ.. కన్నతల్లికి, పుట్టిన గ్రామానికి సేవ చేయడం కన్నా మంచి కార్యక్రమం మరొకటి లేదన్నారు. తాను ఈ స్థాయిలో ఉండటానికి కారకులైన తల్లిదండ్రులు సుబ్బారావు, విద్యావళిలను సత్కరించారు.
క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు అద్దంకిలో కూకట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ ఆవేర్నెస్ వాక్ నిర్వహించారు. అద్దంకి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు పలు స్వచ్ఛంద సేవా సంస్థలు, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. డిసెంబర్ 25న అద్దంకిలోని కూకట్ల కన్వెన్షన్ హాల్లో క్యాన్సర్, కంటి వైద్య శిబిరాలు నిర్వహించారు. కూకట్ల ఫౌండేషన్, Grace క్యాన్సర్ Foundation ఆధ్వర్యంలో వైద్యులు 115 మందికి క్యాన్సర్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఒంగోలు స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో 150 మందికి కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి 60 మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. అద్దంకి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో వాలీబాల్ పోటీలు నిర్వహించారు.
అద్దంకికి చెందిన ఎన్ఆర్ఐ చట్టబత్తిన కృష్ణ కిశోర్ డొనేట్ చేసిన 25 పవర్ స్పేయర్లు, కూకట్ల ఫౌండేషన్, సురేష్ జాగర్లమూడి సహకారంతో 170 రైతు రక్షణ కిట్లను రైతులకు పంపిణీ చేశారు. సుమారు 100 మంది వృద్ధులకు దుప్పట్లు, 10 ట్రై సైకిళ్లు, బ్యాటరీతో నడిచే సైకిళ్లు రెండు పంపిణీ చేశారు. విద్యార్థులకు స్కాలర్ షిప్ల రూపంలో రూ.లక్ష పంపిణీ చేశారు. తానా చైతన్య స్రవంతి కార్యక్రమాల ముగింపు సందర్భంగా కూకట్ల కన్వెన్షన్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. స్థానిక బెల్ అండ్ బెన్నెట్ పాఠశాల విద్యార్థులతో పాటు, పలు కళాబృందాలు, విజయవాడ సిద్దార్థ మహిళా కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన ఫోక్ ఆర్కెస్ట్రా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్
-
భద్రాచలం తరహాలో అమెరికాలో రామాలయం
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు. -
సింగపుర్లో శ్రీ మారియంబికా ఆలయంలో ఘనంగా చండీహోమం
సింగపుర్లోని వాసవీ క్లబ్ మెర్లయన్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు అత్యంత పురాతన, విశిష్టమైన శ్రీ మారియంబికా ఆలయంలో చండీహోమం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం