అమెరికాలో ‘మహానాడు’.. నోరూరించే వంటకాలతో విందు ఏర్పాట్లు

అమెరికాలో తెదేపా ‘మహానాడు’ నిర్వహణకు ఎన్‌ఆర్‌ఐ తెదేపా-యూఎస్‌ఏ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. బోస్టన్‌ వేదికగా మే 27, 28 తేదీల్లో ఈ వేడుకను నిర్వహించనున్నారు.

Updated : 18 May 2022 20:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాలో తెదేపా ‘మహానాడు’ నిర్వహణకు ఎన్‌ఆర్‌ఐ తెదేపా-యూఎస్‌ఏ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. బోస్టన్‌ వేదికగా మే 27, 28 తేదీల్లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. అమెరికా వ్యాప్తంగా ఉన్న తెదేపా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలుగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మహానాడుకు వచ్చే ప్రతినిధులకు నోరూరించే వంటకాలతో భోజన ఏర్పాట్లు చేస్తున్నారు.

దీనికి సంబంధించిన బ్రోచర్‌ను ఎన్‌ఆర్‌ఐ తెదేపా-యూఎస్‌ఏ (బోస్టన్‌ అండ్‌ కనెక్టికట్‌ టీమ్స్‌) విడుదల చేసింది. మే 27 (శుక్రవారం)న విందులో వడ్డించనున్న వంటకాలను అందులో పేర్కొన్నారు. వివిధ రకాల శాఖాహార, మాంసాహార రుచులతో పాటు.. అనేక రకాల తెలుగు వంటకాలను  విందులో వడ్డించనున్నట్లు వివరించారు. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి  భోజనం వరకు విందులో పెట్టనున్న వంటకాలను బ్రోచర్‌లో పేర్కొన్నారు.

వంటకాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని