కువైట్లో ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు
ఎన్ఆర్ఐ తెలుగుదేశం కువైట్ నిర్వహించిన శకపురుషుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
కువైట్: ఎన్ఆర్ఐ తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఎన్ఆర్ఐ తెదేపా కువైట్ అధ్యక్షుడు నాగేంద్ర బాబు అక్కిలి, గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షుడు రావి రాధా కృష్ణ, సభ్యులు వెంకట్ కోడూరి, ప్రధాన కార్యదర్శి మల్లి మరొతు పర్యవేక్షణలో ఉత్సవాలు జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రావి వెంకటేశ్వర్ రావు, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సింగిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, తెదేపా కడప నియోజకవర్గం ఇంఛార్జి అమీర్ బాబు, గౌరవ అతిథులు తెదేపా బద్వేల్ నియోజకవర్గం ఇంఛార్జి కొండ్రెడ్డి రితేష్ రెడ్డి, తెదేపా రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి అద్దేపల్లి ప్రతాప్ రాజు, తెలుగుదేశం పార్టీ మదనపల్లె నియోజకవర్గం నాయకులు రామినేని జయరాం నాయుడు, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి సజ్జా అజయ్, రాజంపేట పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షుడు టి.నవీన్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఎన్ఆర్ఐ తెలుగుదేశం కువైట్ అన్నీ గవర్నరేట్ల కోఆర్డినేటర్స్, జాయింట్ కో ఆర్డినేటర్స్, వివిధ విభాగాలు, మహిళా విభాగాలు, వారి కమిటీలు, పలువురు రాజకీయ నేతలు, తెలుగు సంఘాలు విచ్చేసి సభను విజయవంతం చేశాయి.
దివంగత నేత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ 1982 మార్చి 29న ఆవిర్భవించినప్పటికీ.. ‘మహానాడు’ పేరుతో పార్టీ పండుగ చేసుకునేది మాత్రం ఎన్టీఆర్ పుట్టినరోజైన మే 28న అని వక్తలు తెలిపారు. పార్టీ శ్రేణులకు ఆ మహానుభావుడు ఎన్టీఆర్ పుట్టిన రోజే ఈ మహానాడు అని అదే తమకు అసలైన పండుగ అని చెప్పారు. రాజకీయ చైతన్యం కలిగిన ఇంకో తరం ఎన్టీఆర్ రాజకీయ సంచలనాలు, తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ఆయన పరిరక్షించిన తీరు గురించి మాట్లాడుతుందన్నారు. తెలుగునాట ప్రతి ఇంటా నిత్యం ఏదో ఒక రూపేణా వినిపించే పేరు ఎన్టీఆర్ అన్నారు. ఇక రాజకీయాల్లో అయితే 90 ఏళ్ల రాజకీయ కురువృద్ధుల నుంచి 30ఏళ్ల యువనేత వరకు పలవరించే మాట ‘అన్నగారు’ అని తెలిపారు. అన్ని తరాలకు ఆయన అన్నగారే అని అన్నారు. ఎవరైనా జీవితంలో ఏదో ఒక రంగంలో విజయవంతమవుతారు.. కానీ, ఎన్టీఆర్ 33ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో రికార్డులు సృష్టించారన్నారు. మరెన్నో ప్రశంసలు అందుకున్నారని తెలిపారు. వెండితెర వేలుపుగా పూజలు అందుకున్నారన్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమునిగా కీర్తించబడ్డారని కొనియాడారు.
తెలుగు ప్రజలకు సేవ చేసి వారి రుణం తీర్చుకోవడానికి ఆరుపదుల వయసులో రాజకీయాల్లోకి వచ్చి ఈ రంగంలోనూ అనితరసాధ్యమైన విజయాలను అందుకున్నారని ఎన్ఆర్ఐ తెలుగుదేశం కువైట్ అధ్యక్షులు అక్కిలి నాగేంద్ర బాబు తెలిపారు. ప్రజల్లో రాజకీయ చైతన్యం రగిలించారన్నారు. బడుగులకు రాజ్యాధికారం ఇచ్చారని పేర్కొన్నారు. మహిళలకు హక్కులు పంచి.. పేదలకు సంక్షేమం అందించారన్నారు. తెలుగువారి చరిత్ర చెప్పుకొన్నంత కాలం తన గురించి చెప్పుకొనేలా తనకంటూ ఒక శకాన్ని సృష్టించుకున్న ‘శక పురుషుడు’ ఎన్టీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా మహానాడుకు రుచికరమైన వంటకాలు అందించిన వై.కోట గ్రామస్థులకు, ఎగ్జిక్యూటివ్ కమిటీ వారికి ఎన్ఆర్ఐ తెలుగుదేశం కువైట్ అధ్యక్షులు కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్
-
భద్రాచలం తరహాలో అమెరికాలో రామాలయం
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు. -
సింగపుర్లో శ్రీ మారియంబికా ఆలయంలో ఘనంగా చండీహోమం
సింగపుర్లోని వాసవీ క్లబ్ మెర్లయన్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు అత్యంత పురాతన, విశిష్టమైన శ్రీ మారియంబికా ఆలయంలో చండీహోమం నిర్వహించారు. -
కూటమి గెలిస్తేనే ఏపీకి భవిష్యత్తు.. ఖతార్లో తెదేపా ఆవిర్భావ వేడుకల్లో నేతలు
తెదేపా ఆవిర్భావ వేడుకలు ఖతార్లో ఘనంగా నిర్వహించారు. ఖతార్ తెలుగుదేశం పార్టీ నేతల ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
ప్రాచీన భారతీయ సాహిత్యం- ఆధునిక విజ్ఞాన వికాసంపై తానా ప్రపంచ సాహిత్యవేదిక సదస్సు
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ‘ప్రాచీన భారతీయ సాహిత్యం- ఆధునిక విశ్వ విజ్ఞానశాస్త్ర వికాసానికి మూలం’ అనే అంశంపై సదస్సు విజ్ఞానదాయకంగా జరిగింది. -
ఘనంగా క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ (QEF) వెబ్సైట్ ఆవిష్కరణ
ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్వచ్ఛమైన సమాజమే లక్ష్యంగా ఆవిర్భవించిన క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ తన వెబ్సైట్ను www.qef.org ఆవిష్కరించింది. నాణ్యమైన సాంకేతిక ప్రయాణంలో దీన్నొక మైలురాయిగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు వక్తలు పేర్కొన్నారు. -
ఏపీని ఆదుకునే ఎన్నారైలపై ఇంత అక్కసా?: జయరాం కోమటి
రాష్ట్రానికి మేలు చేసేలా కృషిచేస్తున్న ఎన్నారైలపై వైకాపా నాయకులు బెదిరింపులకు పాల్పడటం అత్యంత దారుణమని ప్రముఖ ప్రవాసాంధ్రుడు, ఎన్నారై తెదేపా అమెరికా సమన్వయకర్త జయరాం కోమటి అన్నారు. -
ఎన్ఆర్ఐ తెదేపా, జనసేన ఆధ్వర్యంలో తెదేపా ఆవిర్భావ వేడుకలు
ఎన్ఆర్ఐ తెదేపా కువైట్, జనసేన కువైట్ సంయుక్త ఆధ్వర్యంలో తెదేపా 42వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం