విద్యార్థికి ల్యాప్‌టాప్‌ అందించిన పొట్లూరి రవి

గుంటూరు జిల్లా గరికపాడు గ్రామానికి చెందిన ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం విద్యార్థి వినోద్‌ కుమార్‌కి పొట్లూరి రవి సహకారంతో ల్యాప్‌ టాప్‌ అందించారు. ..

Published : 01 Mar 2022 21:03 IST

గుంటూరు జిల్లా గరికపాడు గ్రామానికి చెందిన ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం విద్యార్థి వినోద్‌ కుమార్‌కి పొట్లూరి రవి సహకారంతో ల్యాప్‌ టాప్‌ అందించారు. తానా ఫౌండేషన్‌ ఆదరణ కార్యక్రమంలో భాగంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు సహాయం చేస్తున్నట్టు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి, ఫౌండేషన్ ఛైర్మన్‌ రమణ యార్లగడ్డ, కోఆర్డినేటర్‌ రవి సామినేని తెలిపారు. ఇవాళ గరికపాడులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సింగు కోటేశ్వరరావు, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తానా ఫౌండేషన్ ప్రతినిధులకు విద్యార్థి వినోద్‌ కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని