డాక్టర్ గురవారెడ్డికి అక్కినేని జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం
వంశీ ఇంటర్నేషనల్ ఇండియా, తెలుగు కళా సమితి ఒమన్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో పద్మ విభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు 98వ జయంతి కార్యక్రమాన్ని ఆన్లైన్ వేదికగా...
వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఘనంగా అక్కినేని జయంతి వేడుకలు
ఇంటర్నెట్ డెస్క్: వంశీ ఇంటర్నేషనల్ ఇండియా, తెలుగు కళా సమితి- ఒమన్ సంయుక్త ఆధ్వర్యంలో పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, సినీనటుడు అక్కినేని నాగేశ్వరరావు 98వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వర్చువల్గా జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. దాదాపు 30 దేశాలకు చెందిన తెలుగు సంస్థల ప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొని అక్కినేనికి ఘనంగా నివాళులర్పించారు. యూఎస్ నుంచి అమెరికా గానకోకిల శారదా ఆకునూరి, భారత్ నుంచి కళాబ్రహ్మ శిరోమణి వంశీ రామరాజు, వంశీ, తెలుగు కళాసమితి -ఒమన్ కన్వీనర్ అనిల్ కుమార్ కడించర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం 16 గంటల పాటు నిర్విరామంగా కొనసాగింది. ఈ సందర్భంగా సన్షైన్ ఆస్పత్రి వ్యవస్థాపకుడు డాక్టర్ గురువారెడ్డికి అక్కినేని జీవిత సాఫల్య పురస్కారంతో పాటు వైద్య సేవాశిరోమణి బిరుదును ప్రదానం చేశారు. గురవారెడ్డి కుటుంబ సభ్యులే ఆయనకు ఇంట్లోనే ఘనంగా సత్కరించి అవార్డును బహూకరించడం విశేషం. ఈ సందర్భంగా గురువారెడ్డి మాట్లాడుతూ.. అక్కినేని నాగేశ్వరరావు కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అక్కినేని పేరుతో పురస్కారాన్ని అందుకోవడం ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. తన కుటుంబ సభ్యులే తనను సత్కరించడం అపూర్వ సన్నివేశమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నటి జమున, సీనియర్ దర్శకుడు కె.విశ్వనాథ్, కేంద్ర మాజీ మంత్రి టి.సుబ్బరామిరెడ్డి, శాంతా బయోటెక్ ఛైర్మన్ కె.ఐ.వరప్రసాద్రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి, సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్, మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, మహానటి సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి, దేవులపల్లి మనవరాలు లలితారామ్ (అమెరికా), ఉపేంద్ర చివుకుల (అమెరికా), డాక్టర్ మేడసాని మోహన్, డాక్టర్ కేవీ కృష్ణకుమారి, సినీ గేయ రచయితలు సుద్ధాల అశోక్ తేజ, భువన చంద్ర, తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, డాక్టర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి (అమెరికా), రవి కొండబోలు (అమెరికా), డాక్టర్ చిట్టెన్ రాజు వంగూరి (అమెరికా), జయశేఖర్ తాళ్లూరి (మాజీ అధ్యక్షుడు -తానా), శిరీష తూముగుంట్ల (కల్చరల్ సెక్రటరీ- తానా), శారదా సింగిరెడ్డి (ఛైర్పర్సన్, ఆటా), గురజాడ శ్రీనివాస్ (అమెరికా), డాక్టర్ లక్ష్మీప్రసాద్ కపటపు, చిన్నారావు, వేణుగోపాల్ హరి, టి.నాగ, బి.కుమార్, చైతన్య, సీతారాం, చరణ్కుమార్, అరుంధతి, రాజశేఖర్, ఆనంద్, శ్రీదేవి, చైతన్య సూరపనేని, రాణి (తెలుగు కళా సమితి కార్యవర్గం -ఒమన్), శారద, అపర్ణ, రాణి, సునీత, లక్ష్మీ కామేశ్వరి (వ్యాఖ్యాతలు-ఒమన్), తాతాజీ ఉసిరికల (తెలుగు కళా సమితి, ఖతార్), కె.సుధాకర్రావు (ఊటాఫ్, కువైట్), వేదమూర్తి (యుఏఈ), సత్యనారాయణ రెడ్డి (ఏకేవీ -ఖతార్), సురేశ్ తెలుగు తరంగిణి (యుఏఈ), ప్రదీప్ (యూఏఈ), శివ యెల్లెపు (బహ్రెయిన్), వెంకట్ భాగవతుల (ఏకేవీ ఖతార్), దీపిక రావి (సౌదీ అరేబియా), రత్నకుమార్ కవుటూరు (సింగపూర్), రాజేష్ టెక్కలి (అమెరికా), సారథి మోటమర్రి (ఆస్ట్రేలియా), విజయ గొల్లపూడి (ఆస్ట్రేలియా), పార్థసారథి (ఉగాండా), కేఆర్ సురేష్ కుమార్ (టాంజానియా), డాక్టర్ జీవీఎల్ నరసింహం, డా. తెన్నేటి సుధ, శైలజ సుంకరపల్లి, రాధిక నూరి (అమెరికా), సత్యదేవి మల్లుల (మలేషియా), డా. శ్రీరామ్ శొంఠి, శారద పూర్ణ శొంఠి (అమెరికా), సుధ పాలడుగు (అమెరికా), లక్ష్మీ రాయవరపు (కెనడా), గుణసుందరి కొమ్మారెడ్డి (అమెరికా), శ్రీదేవి జాగర్లమూడి (అమెరికా), శ్రీలత మగతల (న్యూజిలాండ్), విజయ్కుమార్ పర్రి (స్కాట్లాండ్), రవి గుమ్మడవల్లి (ఐర్లాండ్), రాధిక మంగినపూడి (సింగపూర్), రాజేష్ తోలేటి (లండన్), విజయ్కుమార్ పర్రి (స్కాట్లాండ్), రవి గుమ్మడవల్లి (ఐర్లాండ్), డాక్టర్ తెన్నేటి శ్యాంసుందర్, డాక్టర్ తెన్నేటి విజయచంద్ర ఆమని, డాక్టర్ జి.సమరం, గుమ్మడి గోపాలకృష్ణ , కామేశ్వరరావు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం సందర్భంగా పలువురు గాయకులు అక్కినేని నటించిన చిత్రాల్లోని పాటలను ఆలపించి అందరినీ అలరించారు. సెప్టెంబర్ 20న ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం అర్ధరాత్రి 2 గంటల వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి అవసరమైన సాంకేతిక సహాయాన్ని వెంకట్ అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్
-
భద్రాచలం తరహాలో అమెరికాలో రామాలయం
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు. -
సింగపుర్లో శ్రీ మారియంబికా ఆలయంలో ఘనంగా చండీహోమం
సింగపుర్లోని వాసవీ క్లబ్ మెర్లయన్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు అత్యంత పురాతన, విశిష్టమైన శ్రీ మారియంబికా ఆలయంలో చండీహోమం నిర్వహించారు. -
కూటమి గెలిస్తేనే ఏపీకి భవిష్యత్తు.. ఖతార్లో తెదేపా ఆవిర్భావ వేడుకల్లో నేతలు
తెదేపా ఆవిర్భావ వేడుకలు ఖతార్లో ఘనంగా నిర్వహించారు. ఖతార్ తెలుగుదేశం పార్టీ నేతల ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
ప్రాచీన భారతీయ సాహిత్యం- ఆధునిక విజ్ఞాన వికాసంపై తానా ప్రపంచ సాహిత్యవేదిక సదస్సు
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ‘ప్రాచీన భారతీయ సాహిత్యం- ఆధునిక విశ్వ విజ్ఞానశాస్త్ర వికాసానికి మూలం’ అనే అంశంపై సదస్సు విజ్ఞానదాయకంగా జరిగింది. -
ఘనంగా క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ (QEF) వెబ్సైట్ ఆవిష్కరణ
ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్వచ్ఛమైన సమాజమే లక్ష్యంగా ఆవిర్భవించిన క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ తన వెబ్సైట్ను www.qef.org ఆవిష్కరించింది. నాణ్యమైన సాంకేతిక ప్రయాణంలో దీన్నొక మైలురాయిగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు వక్తలు పేర్కొన్నారు. -
ఏపీని ఆదుకునే ఎన్నారైలపై ఇంత అక్కసా?: జయరాం కోమటి
రాష్ట్రానికి మేలు చేసేలా కృషిచేస్తున్న ఎన్నారైలపై వైకాపా నాయకులు బెదిరింపులకు పాల్పడటం అత్యంత దారుణమని ప్రముఖ ప్రవాసాంధ్రుడు, ఎన్నారై తెదేపా అమెరికా సమన్వయకర్త జయరాం కోమటి అన్నారు. -
ఎన్ఆర్ఐ తెదేపా, జనసేన ఆధ్వర్యంలో తెదేపా ఆవిర్భావ వేడుకలు
ఎన్ఆర్ఐ తెదేపా కువైట్, జనసేన కువైట్ సంయుక్త ఆధ్వర్యంలో తెదేపా 42వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
డార్ట్ఫోర్డ్లో ఉల్లాసంగా హోలీ వేడుకలు
బ్రిటన్లోని డార్ట్ఫోర్డ్లో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. కెంట్లోనే అతిపెద్ద ఈవెంట్గా చేపట్టిన ఈ వేడుకలకు 3వేల మందికి పైగా హాజరయ్యారు. -
డాలస్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని డాలస్ నగరంలో ఘనంగా నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు