NTR: బే ఏరియా అంగరంగ వైభవంగా ‘ఎన్టీఆర్’ శతజయంతి వేడుకలు!
అమెరికాలోని బే ఏరియాలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు ప్రముఖులలతోపాటు పలువురు ఎన్నారైలు పాల్గొన్నారు.
కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియా బే ఏరియాలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మే 19, శుక్రవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో తెలుగువారు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని శ్రీమతి విజయ ఆసూరి ఎంతో ఉత్సాహంగా నడిపించారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్ ప్రారంభోపన్యాసం చేశారు. తెలుగువారి వెలుగు దీప్తి ఎన్టీఆర్ అని ఆయన అన్నారు. ఎన్టీఆర్ శత జయంతిని ఘనంగా నిర్వహించడం ప్రతి తెలుగు వాడికీ గర్వకారణమన్నారు. ఆయన తెలుగు వారిగా జన్మించడం మనందరికీ గర్వకారణమన్నారు.
ప్రతి కుటుంబానికీ పెద్ద కొడుకు ఎన్టీఆర్ : జస్టిస్ వేణుగోపాల్
తెలుగు వారి వెలుగు దీప్తి ఎన్టీఆర్ అని అని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్ అన్నారు. ఎన్టీఆర్ శత జయంతిని ఘనంగా జరుపుకోవడం, ప్రతి తెలుగు వారికీ గర్వకారణమన్నారు. ఎన్టీఆర్ తెలుగువారిగా జన్మించడం మనందరికీ గర్వకారణమన్నారు. తెలుగువారిని అవమానిస్తున్న తీరును భరించలేక, వారి ఆత్మగౌరవానికి ప్రతీకను దశ దిశలా చాటుతూ.. ఎన్టీఆర్ తెదేపాను స్థాపించి.. కేవలం 9 నెలల వ్యవధిలోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని జస్టిస్ వేణుగోపాల్ అన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ హక్కును అమలు చేసి చూపించారని అన్నారు. ప్రతి పేదవాడికీ రూ.2 కే కిలో బియ్యం ఇచ్చి వారి ఆకలి తీర్చిన ఘనత అన్నగారికే దక్కిందన్నారు. ఆయన మనిషి రూపంలో జన్మించిన పుణ్యపురుషుడని కొనియాడారు. ‘‘మద్రాసు రాష్ట్రంలో తెలుగు వారికి తీవ్ర అవమానాలు ఎదురయ్యేవి. అలాంటి పరిస్థితిని ఎన్టీఆర్ మార్చారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలుగువారికి ప్రత్యేక గౌరవం తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. అందుకే ఆయన్ను ప్రతి కుటుంబం పెద్దకొడుకుగా భావించి ‘ అన్నగారు’ అని పిలుచుకుంటుంది.’’ అని జస్టిస్ వేణుగోపాల్ అన్నారు. దాదాపుగా ప్రతి తెలుగువారి ఇంట్లో ఎన్టీఆర్ ఫొటో ఉంటుందని, అదే ఆయనకు ఇచ్చే గౌరవమని చెప్పారు. మంత్ర ముగ్దుల్ని చేసిన జస్టిస్ వేణుగోపాల్ ప్రసంగానికి ప్రేక్షకులు తమ సీట్ల నుండి లేచి కరతాళ ధ్వనులు చేశారు.
ఆత్మగౌరవాన్ని చాటారు: డాక్టర్ నాగేంద్ర ప్రసాద్
ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న దౌత్య కార్యాలయ అధికారి డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని దశదిశలా చాటిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని పేర్కొన్నారు. ఆయన ఎక్కడున్నా తెలుగు వారి కోసం పరితపించారని అన్నారు. తెలుగు వారి ఆత్మాభిమానం కోసం ఇంతగా కష్టపడిన వ్యక్తి మరొకరు లేరని తెలిపారు.
తెలుగు కోసం పరితపించారు: జయరాం కోమటి
తెలుగు నేల కోసం, తెలుగు వారి కోసం పరితపించిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని ఎన్నారై తెదేపా కోఆర్డినేటర్ ‘జయరాం కోమటి’ పేర్కొన్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు చేసుకోవడం అందరి భాగ్యమని అన్నారు. ప్రతి తెలుగువాడు గర్వపడేలా చేసిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పారు. ‘‘ గత సంవత్సరం మే 28 నుంచి అమెరికాలో ప్రతి నెలా ఒక నగరంలో 12 నగరాలలో పుట్టిన రోజు వేడుకలు జరిగాయి.ప్రపంచ వ్యాప్తంగా 100 నగరాల్లో పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. నాకు తెలిసినంత వరకు ఇలా జరగడం ప్రపంచ చరిత్రలో ఇదే తొలిసారి.’’ అని అన్నారు. మిల్పిటాస్ నగర డిప్యూటీ మేయర్ ఎవెలిన్ చువ మే 28వ తేదీని మిల్పిటాస్లో ఎన్టీఆర్ తేదీగా గుర్తిస్తూ.. జారీ చేసిన పత్రాన్ని అందచేస్తూ ఎన్టీఆర్ సేవలను కొనియాడారు.
మిల్పిటాస్ స్కూల్ బోర్డు ట్రస్టీ ‘అను నుక్క’ ప్రసంగించారు. పార్లమెంట్ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు డాలస్ నుంచి జూమ్ ద్వారా మాట్లాడారు.
స్థానిక నాయకులు ‘రమేష్ తంగెళ్లపల్లి’ తను గతంలో పనిచేసిన సమాచార పౌర సంబంధాల శాఖలో వృత్తి రీత్యా అన్నగారి తో న్యూస్ బ్రీఫింగ్, ఆయన సందేశం వీడియో రికార్డింగ్ చేసి ప్రసారం చేయటంలో గల సాన్నిహిత్యాన్ని నెమరు వేసుకొన్నారు. కళ్యాణ్ వీరపనేని, గోకుల్ రసిరాజు, భక్తా భల్ల తదితరులు ప్రసంగించారు.
ఎన్టీఆర్ అభిమాని అయిన శ్రీకాంత్ దొడ్డపనేని భోజన ఏర్పాట్లను దగ్గర ఉండి పర్యవేక్షించారు. స్థానిక తెలుగుదేశం నాయకుడు వెంకట్ కోగంటి అన్ని ఏర్పాట్లను సమన్వయ పరచి, కార్యక్రమం జయప్రదం కావడానికి కృషి చేశారు. ఈ కార్యక్రమంలో విలేఖ్య వెనిగళ్ళ, కొర్ర జానకి దేవి, చేతన మారిపూరి, నీలిమ గరికపాటి, అన్నపూర్ణ కొర్ర, విజయ్ గుమ్మడి, వీరు వుప్పల, యం వి రావు, సతీష్ చిలుకూరి, తులసి తుమ్మల, ఆది నారాయణ, చంద్ర గుంటుపల్లి, శ్రీనివాస్ వేముల, శాస్త్రి వెనిగళ్ల, రామ్ తోట, ప్రసాద్ మంగిన, రమేష్ కొండా, రవికిరణ్ ఆలేటి, జోగి నాయుడు, వెంకట్ అడుసుమల్లి, హరి సన్నిధి, వెంకట్ జెట్టి, వెంకట్ గొంప, కోటి బాబు కోటిన, భాస్కర్ అన్నే, శ్రీనివాస వల్లూరిపల్లి, హర్ష యడ్లపాటి, లక్ష్మణ్ పరుచూరి, కళ్యాణ్ కోట, స్వరూప్ వాసిరెడ్డి, మధు కందేపి, సాయి యనమదల, పాములు నారాయణ, వినయ్ యలమర్తి, భరణి యాతం, రమేష్ నాయుడు, సుభాష్ ఆర్, రవి ఆలపాటి, సురేష్ రెడ్డి ఉయ్యురు, భరత్ ముప్పిరాళ్ళ, చక్రధర్ అనుమోలు, నరహరి మర్నేని తదితరులు పాల్గొన్నారు. తానా ఎన్నికల ప్రచారంలో భాగంగా బే ఏరియాలో ఉన్న నరేన్ కోడలి, రాజా సూరపనేని కూడా హాజరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్
-
భద్రాచలం తరహాలో అమెరికాలో రామాలయం
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు. -
సింగపుర్లో శ్రీ మారియంబికా ఆలయంలో ఘనంగా చండీహోమం
సింగపుర్లోని వాసవీ క్లబ్ మెర్లయన్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు అత్యంత పురాతన, విశిష్టమైన శ్రీ మారియంబికా ఆలయంలో చండీహోమం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం