NTR: ఏపీ పునర్నిర్మాణం చంద్రబాబుతోనే సాధ్యం: మన్నవ సుబ్బారావు
అమెరికాలోని హారీస్బర్గ్లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెదేపాను తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ప్రవాసాంధ్రుడు కృషి చేయాలని గుంటూరు మిర్చియార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు తెలిపారు.
హారీస్బర్గ్: ఏపీ పునర్నిర్మాణం తెదేపా అధినేత చంద్రబాబుతోనే సాధ్యమని గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు అన్నారు. అమెరికాలోని హారీస్బర్గ్ మహా నగరంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి మన్నవ సుబ్బారావుతోపాటు ప్రముఖ దర్శకులు వైవీఎస్ చౌదరి, డా. మీగడ రామలింగస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. సీఎం జగన్ బారినుంచి రాష్ట్రాన్ని కేవలం చంద్రబాబునాయుడు మాత్రమే కాపాడగలుగుతారన్నారు. దుర్మార్గుల దౌర్జన్యం కంటే మేధావుల మౌనం ఈ సమాజానికి శాపం కాకూడదని తెలిపారు. తెదేపాను తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ప్రవాసాంధ్రుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెదేపా తిరిగి అధికారంలోకి వస్తేనే ఎన్టీఆర్కు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని ఆయన పేర్కొన్నారు.
అన్నిటికంటే తాను ఎన్టీఆర్ అభిమానినని అనిపించుకోవడమే గర్వకారణంగా ఉంటుందని వైవీఎస్ చౌదరి అన్నారు. ‘‘ నా దినచర్యే ఎన్టీఆర్ నామస్మరణతో ప్రారంభమవుతుంది. ఎన్టీఆర్ నాకు భగవంతుడితో సమానం. తెలుగుజాతి ఉన్నంతవరకు ఎన్టీఆర్ చరిత్ర అజరామరంగా నిలుస్తుంది’’అని చౌదరి తెలిపారు. ఎన్టీఆర్ తెలుగు భాషకు, తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారని డా. లింగస్వామి కొనియాడారు. సినీ, రాజకీయ జీవితంలో రారాజుగా వెలుగొందారని చెప్పారు. ఎన్ఆర్ఐ తెలుగుదేశం హారీస్ బర్గ్ సభ్యులు ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు.
ఈ కార్యక్రమంలో సతీష్ చుండ్రు, సాంబ అంచ, వెంకట్ సింగు, వెంకట్ చిమ్మిలి, శశి జాస్తి, రాజు గుండాల, వంశీ ముప్పాళ్ల, శ్రీనివాసరావు కోట, వెంకట సుబ్బారావు ముప్ప, సునీల్ పొందూరి, ప్రవీణ్ జంపన, శ్రీనివాస్ అబ్బూరి, ఉపేంద్ర దేవినేని, సాంబ నిమ్మగడ్డ, శ్రీనివాస్ కాకర్ల, వేణు మక్కెన, రాంబాబు కావూరి, గోపీచంద్ తలశిల, ప్రతాప్ యార్లగడ్డ, కిషోర్ కొంక, చక్రవర్తి, నాగార్జున నల్లమోతు, చంద్ర, మైనేని రాంప్రసాద్, భాను మాగులూరి, కిషోర్ కంచర్ల, సాయి బొల్లినేని తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా చిన్నారులతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఎన్టీఆర్ రూపాల్లో చిన్నారులు తమ నృత్య ప్రదర్శనలతో కనువిందు చేశారు. ఈ వేడుకకు పెద్ద ఎత్తున మహిళలు, చిన్నారులు హాజరయ్యారు. ప్రముఖ గాయని దీప్తి నాగ్, ప్రసాద్ సింహాద్రి తమ సంగీత విభావరితో ఆకట్టుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్
-
భద్రాచలం తరహాలో అమెరికాలో రామాలయం
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు. -
సింగపుర్లో శ్రీ మారియంబికా ఆలయంలో ఘనంగా చండీహోమం
సింగపుర్లోని వాసవీ క్లబ్ మెర్లయన్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు అత్యంత పురాతన, విశిష్టమైన శ్రీ మారియంబికా ఆలయంలో చండీహోమం నిర్వహించారు. -
కూటమి గెలిస్తేనే ఏపీకి భవిష్యత్తు.. ఖతార్లో తెదేపా ఆవిర్భావ వేడుకల్లో నేతలు
తెదేపా ఆవిర్భావ వేడుకలు ఖతార్లో ఘనంగా నిర్వహించారు. ఖతార్ తెలుగుదేశం పార్టీ నేతల ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
ప్రాచీన భారతీయ సాహిత్యం- ఆధునిక విజ్ఞాన వికాసంపై తానా ప్రపంచ సాహిత్యవేదిక సదస్సు
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ‘ప్రాచీన భారతీయ సాహిత్యం- ఆధునిక విశ్వ విజ్ఞానశాస్త్ర వికాసానికి మూలం’ అనే అంశంపై సదస్సు విజ్ఞానదాయకంగా జరిగింది. -
ఘనంగా క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ (QEF) వెబ్సైట్ ఆవిష్కరణ
ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్వచ్ఛమైన సమాజమే లక్ష్యంగా ఆవిర్భవించిన క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ తన వెబ్సైట్ను www.qef.org ఆవిష్కరించింది. నాణ్యమైన సాంకేతిక ప్రయాణంలో దీన్నొక మైలురాయిగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు వక్తలు పేర్కొన్నారు. -
ఏపీని ఆదుకునే ఎన్నారైలపై ఇంత అక్కసా?: జయరాం కోమటి
రాష్ట్రానికి మేలు చేసేలా కృషిచేస్తున్న ఎన్నారైలపై వైకాపా నాయకులు బెదిరింపులకు పాల్పడటం అత్యంత దారుణమని ప్రముఖ ప్రవాసాంధ్రుడు, ఎన్నారై తెదేపా అమెరికా సమన్వయకర్త జయరాం కోమటి అన్నారు. -
ఎన్ఆర్ఐ తెదేపా, జనసేన ఆధ్వర్యంలో తెదేపా ఆవిర్భావ వేడుకలు
ఎన్ఆర్ఐ తెదేపా కువైట్, జనసేన కువైట్ సంయుక్త ఆధ్వర్యంలో తెదేపా 42వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు