సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ శతజయంతి..

గల్ఫ్‌ దేశం సౌదీ అరేబియాలో ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జుబైల్‌ ప్రాంతంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఎన్టీఆర్‌, తెదేపా అభిమానులు పాల్గొన్నారు.

Published : 29 May 2022 17:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గల్ఫ్‌ దేశం సౌదీ అరేబియాలో ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జుబైల్‌ ప్రాంతంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఎన్టీఆర్‌, తెదేపా అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తెలుగు ప్రజల గుండె చప్పుడును ప్రపంచవ్యాప్తంగా తెలియజేసిన నాయకుడు ఎన్టీఆర్‌ అని కొనియాడారు. ఆయన చేసిన మంచి కార్యక్రమాలు ఇప్పటికీ ప్రజల గుండెల్లో గూడుకట్టుకొని ఉన్నాయన్నారు.

తెలుగుజాతి అభివృద్ధి కోసం చంద్రబాబు కష్టపడి చేసిన పనిని జగన్‌ నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కులాల మధ్య విభేదాలు సృష్టిస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు వైకాపా ప్రయత్నిస్తోందని.. దీన్ని ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్‌ అడ్రస్‌ గల్లంతవుతుందని చెప్పారు. అనంతరం వారంతా ఎన్టీఆర్ జయంతి కేక్‌ కట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని