ఎన్టీఆర్ జయంతిని ఆత్మగౌరవ దినంగా ప్రకటించాలి.. జాక్సన్విల్లేలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు
ఎన్టీఆర్ జయంతిని ఆత్మగౌరవ దినంగా ప్రకటించాలని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని జాక్సన్ విల్లే నగరంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా 12వ మహానాడు నిర్వహించారు
జాక్సన్ విల్లే (అమెరికా): ఎన్టీఆర్ జయంతిని ఆత్మగౌరవ దినంగా ప్రకటించాలని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కోరారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని జాక్సన్ విల్లే నగరంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా 12వ మహానాడు నిర్వహించారు. జాక్సన్ విల్లే ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షులు ఆనంద్ తోటకూర ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా.. గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కోసి వేడుకలు చేసుకున్నారు. అలాగే, శ్రీశ్రీ జయంతిని పురస్కరించుకుని మహాప్రస్థానంలో గేయాలను గుర్తుచేసుకుంటూ ఆయనకు నివాళులర్పించారు. మహానాడును పురస్కరించుకుని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆన్లైన్ ద్వారా ప్రసంగించారు.
ఈ సందర్భంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. తెలుగువారికి గుర్తింపు, గౌరవం తీసుకువచ్చిన ఎన్టీఆర్ జయంతి మే 28న ప్రభుత్వపరంగా నిర్వహించాలన్నారు. సినీ, రాజకీయ రంగంలో ఆయన ధృవతారగా వెలుగొందారన్నారు. రాజమహేంద్రవరంలో మే 27, 28,29 తేదీల్లో మహానాడు జరగనుందని.. ఈ కార్యక్రమానికి ప్రవాసాంధ్రులు పెద్దఎత్తున హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారం కల్పించిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. 9 నెలల్లోనే పార్టీని స్థాపించి అధికారం చేపట్టడం ద్వారా చరిత్రలో నిలిచిపోయారన్నారు. పేద ప్రజల కోసం సంక్షేమానికి రూపకల్పన చేశారు. నేడు దేశంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలన్నింటికీ ఎన్టీఆరే ఆధ్యుడన్నారు.
దివంగత ఎన్టీఆర్ కీర్తి అజరామరమని మన్నవ సుబ్బారావు అన్నారు. అన్న ఎన్టీఆర్ కు శతజయంతి నాడు ఆయనకు నీరాజనాలు అర్పిద్దామన్నారు. ఈ ఏడాది మే నెలలో వంద నగరాల్లో ఎన్టీఆర్ శతవసంతాల వేడుకలు ఘనంగా జరపాలని ఎన్ఆర్ఐ టీడీపీ యూఎస్ఏ అధ్యక్షులు జయరాం కోమటి పిలుపునిచ్చారని.. వాటిని అందరూ చిత్తశుద్ధితో విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మన్నవ సుబ్బారావు కోరారు. ఏడాది పాటు జరిగిన కార్యక్రమాలను సమాహారం చేస్తూ సావనీర్ను రూపొందిస్తున్నట్టు చెప్పారు. జాక్సన్ విల్లే ఎన్నారై టీడీపీ అధ్యక్షుడు ఆనంద్ తోటకూర మాట్లాడుతూ.. తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర చూసి ప్రభుత్వం భయపడుతోందన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో పాదయాత్ర కొనసాగిస్తున్నారన్నారు. యాత్ర దిగ్విజయం కావాలని ఆకాంక్షించారు. జాక్సన్ విల్లే ఎన్ఆర్ఐ టీడీపీ సౌత్ ఫ్లోరిడా ప్రాంత ప్రతినిధి అనిల్ యార్లగడ్డ మాట్లాడుతూ.. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కాన్వాయ్పై రాళ్ల దాడి పిరికిపంద చర్య అని.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు తావులేదన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని జాక్సన్ విల్లే ఎన్ఆర్ఐ టీడీపీ ఎగ్జిక్యూటివ్ కమిటీ కోశాధికారి సుమంత్ ఈదర అన్నారు. ఇందుకోసం ప్రవాసాంధ్రులంతా తమవంతు కృషి చేయాలని సూచించారు. ఎన్టీఆర్ అంటే వ్యక్తి కాదు..ఒక శక్తి. ఆయన క్రమశిక్షణ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి కావాలని సాయి బొల్లినేని అన్నారు. సినీ, రాజకీయ రంగంలో ఎన్టీఆర్ సాధించిన విజయాలు మరెవరికీ సాధ్యం కాదన్నారు. ఈ కార్యక్రమంలో కొలికపూడి శ్రీనివాసరావు, అడుసుమల్లి శ్రీనివాసరావు, సుచిత్ర యార్లగడ్డ, శ్రీలక్ష్మీ మన్నె, బాబు కొర్రపాటి, ఆనంద్ వక్కలగడ్డ తదితరులు ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో జాక్సన్ విల్లే ఎన్ఆర్ఐ టీడీపీ సిటీ కౌన్సిల్ సభ్యులు గోపీకృష్ణ కుంట్ల, రాజేష్ మాదినేని, హరీష్ కుమార్ వీరవల్లి, అజయ్ చెరుకూరి, నాగేశ్వరరావు సూరే, గోపీ కడియాల, సుమన్ కాట్రగడ్డ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులతో మన్నవ సుబ్బారావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఓర్లాండో నుంచి రవికుమార్ రావి, ఈశ్వర్ కానుమూరి, మురళీ కృష్ణ రావి పాటు పెద్దఎత్తున ఎన్టీఆర్ అభిమానులు తరలివచ్చారు. అనంతరం ఏర్పాటుచేసిన సాంస్కృతి కార్యక్రమాల్లో చిన్నారి అదితి తోటకూర పాటలు పాడి అందరినీ అలరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్
-
భద్రాచలం తరహాలో అమెరికాలో రామాలయం
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు