తెలుగువారి ఆత్మగౌరవానికి ఆధ్యులు ‘ఎన్టీఆర్’.. వాషింగ్టన్ డీసీలోఎన్టీఆర్ వర్ధంతి
తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవానికి ఆధ్యులని తానా మాజీ అధ్యక్షుడు సతీశ్ వేమన అన్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఈ నెల 18న నందమూరి తారకరామారావు 26వ.....
వాషింగ్టన్ డీసీ: తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవానికి ఆధ్యులని తానా మాజీ అధ్యక్షుడు సతీశ్ వేమన అన్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఈ నెల 18న నందమూరి తారకరామారావు 26వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సతీశ్ వేమన మాట్లాడుతూ.. నిలువెత్తు తెలుగు తేజం, నిండైన వ్యక్తిత్వంతో తెలుగు ప్రజల గుండెల్లో కొలువైన దైవం ఎన్టీఆర్ అని కొనియాడారు. చరిత్ర అన్న పదానికి చిహ్నంగా నిలిచిన నాయకుడు.. నట జీవితాన్ని ప్రజా జీవితం కోసం అర్పించిన మహానాయకుడన్నారు. చైతన్య రథం ఎక్కి చరిత్ర సృష్టించి, రాజకీయ శూన్యతను రూపుమాపి, తెలుగువారి జీవితాల్లో వెలుగులు నింపిన జన నేత అన్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుంచి గట్టి పునాదులతో బడుగు, బలహీనవర్గాల, దళిత సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ప్రజలతో మమేకమయ్యారని గుర్తు చేసుకున్నారు. కుల, మత ప్రాంతాలకతీతంగా పలు రంగాల్లో ఉన్న ఎంతోమంది తెలుగువారికి ఆయన ఆశయాలే స్ఫూర్తి అని తెలిపారు. సినిమాల్లో రాముడిగా, కృష్ణుడి వేషధారణతో ప్రతి తెలుగువారి గుండెల్లో ఆరాథ్య దైవంగా నిలిచిన ఎన్టీఆర్ ఓ యుగపురుషుడని కొనియాడారు.
స్వచ్ఛమైన రాజకీయాల కోసం, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుంటూరు జిల్లా మిర్చియార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు అన్నారు. తెలుగువారికి ఆత్మగౌరవం ఎన్టీఆర్ ఇచ్చిన గొప్ప వరమన్నారు. పచ్చజెండాతో తెలుగువారిలో కొత్త ఉత్సాహం నింపారని, తెరపై ధీరోదాత్తమైన పాత్రల్లో నటించి పండిత పామరుల్ని మెప్పించారన్నారు. వామహస్త అభయం ఆచరణలో పెట్టి ప్రజల్ని మెప్పించారన్నారు. ఎన్టీఆర్ తన నటనతో జానపదా చిత్రాలకే వన్నె తెచ్చారని కొనియాడారు. దిల్లీ వెన్నులో వణుకు పుట్టించి, కేంద్రానికి కంటిమీద కునుకులేకుండా చేసిన ఎన్టీఆర్ ఈనాడు భౌతికంగా మన మధ్యలేకపోయినా.. ఆయన నటన, పాలన, మాట, బాట తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. తన మాటే శాసనంగా ఆయన చూపిన బాటే తెలుగువారి భవిష్యత్కు మార్గదర్శకమన్నారు.
రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారని ఎన్ఆర్ఐ నరేన్ కొడాలి అన్నారు. తను ఏ పాత్రలో నటించినా దానికి పూర్తిగా న్యాయం చేయాలని తపించిన అతి కొద్దిమంది నటుల్లో ఎన్టీఆర్ ఒకరన్నారు. నాటి, నేటి పాలకులకు ఎన్టీఆర్ చూపిన ప్రజాహిత పాలనే ఆదర్శప్రాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనిల్ ఉప్పలపాటి, రఘు మేకా, రవి అడుసుమల్లి, రవి గౌరినేని, కార్తీక్ కోమటి, సిద్ధార్థ బోయపాటి, సాయి సుమంత్ శ్రీరామ్, డా.నాగ దేవినేని, డా. లిఖిత్ యల్లా, రమేష్ అవిరినేని తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Indian origin Family: అనుమానాస్పద స్థితిలో కెనడాలో భారత సంతతి కుటుంబం మృతి
కెనడా(Canada)లో భారత సంతతికి చెందిన ముగ్గురు కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. వారి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
జనసేన ఆవిర్భావ వేడుకల వేళ.. డల్లాస్లో జనసేన, తెదేపా, భాజపా ఆత్మీయ సమావేశం
డల్లాస్లో జనసేన ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు జనసేన నేతలతో పాటు తెదేపా, భాజపా క్యాడర్కు చెందిన పలువురు హాజరయ్యారు. -
సింగపూర్లో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు
సింగపూర్లో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. -
న్యూజెర్సీలో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు
శివుడికి ప్రీతిపాత్రమైన మహా శివరాత్రి పర్వదినాన ‘హర హర మహాదేవ శంభో శంకర’ అంటూ అగ్రరాజ్యంలో ఎన్నారైలు ముక్తకంఠంతో నినదించారు. -
న్యూజెర్సీలో ఓఎఫ్ భాజపా ఆధ్వర్యంలో ‘ఛాయ్పే చర్చ’
న్యూజెర్సీలోని ఎడిసన్ నగరంలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ (BJP) ఆధ్వర్యంలో ‘ఛాయ్ పే చర్చ’ నిర్వహించారు. -
బే ఏరియాలో ‘తెదేపా-జనసేన-భాజపా’కు చెందిన ఎన్ఆర్ఐల ఆత్మీయ సమావేశం
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో స్థిరపడిన ఎన్ఆర్ఐలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. -
అమెరికాలో మే 24-26 మధ్య టీటీఏ మహాసభలు
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) అగ్రరాజ్యంలో భారీగా మహాసభలు నిర్వహించనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు టీటీఏ అధ్యక్షుడు వంశీరెడ్డి కంచరకుంట్ల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. -
సౌదీ అరేబియాలో తెదేపా-జనసేన ఎన్నారై కూటమి సమావేశం
సౌదీ అరేబియాలోని జుబైల్లో తెదేపా-జనసేన ఎన్నారై కూటమి భేటీ అయ్యింది. రాబోయే ఎన్నికలకు వ్యూహరచన చేసేందుకు ‘ఎన్నికల సన్నాహక ఆత్మీయ సమావేశం’ పేరిట ఈ భేటీ నిర్వహించారు. -
డెట్రాయిట్లో అట్టహాసంగా మహిళా దినోత్సవం
గ్లోబల్ తెలంగాణ సంఘం డెట్రాయిట్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. -
తానా బోర్డు ఛైర్మన్గా డా.నాగేంద్ర శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో ప్రతిష్ఠాత్మక బోర్డు ఛైర్మన్ పదవికి డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
డెట్రాయిట్లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
అంతర్జాతీయ మహిళల దినోత్సవం(మార్చి 8) పురస్కరించుకుని ఫార్మింగ్టన్ మేనర్లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (జీటీఏ) డెట్రాయిట్ మహిళా విభాగం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన లేడీస్ నైట్ అట్టహాసంగా జరిగింది. -
TDP - Janasena: షికాగోలో ఘనంగా తెదేపా - జనసేన ఆత్మీయ సమావేశం
తెదేపా, జనసేన నాయకులు షికాగోలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. -
TANA Foundation: తానా ఫౌండేషన్ ఛైర్మన్గా శశికాంత్ వల్లేపల్లి
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ఫౌండేషన్ చైర్మన్గా శశికాంత్ వల్లేపల్లి ఎన్నికయ్యారు. -
Sporty Divas: ఇండో-గల్ఫ్ త్రోబాల్ ఛాంపియన్షిప్ విజేతగా అమెరికా జట్టు
బహ్రెయిన్లో నిర్వహించిన ‘ఇండో-గల్ఫ్ ఇంటర్నేషనల్ త్రోబాల్ ఛాంపియన్షిప్’లో అమెరికాకు చెందిన మహిళల జట్టు ‘స్పోర్టీ దివాస్’ విజేతగా నిలిచింది. -
ఖతార్లో ఎన్నికల శంఖారావం సభ.. భారీగా హాజరైన ప్రవాసులు
ఖతార్లో ఎన్నికల శంఖారావం సభ ఎన్నారై తెలుగుదేశం, జనసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. -
మంగళగిరిలో ‘యూరో కార్ట్’లు.. నారా లోకేశ్ చేతుల మీదుగా చిరు వ్యాపారులకు అందజేత
లండన్ ఎన్నారై ‘జై కుమార్ గుంటుపల్లి’ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. యూరప్లో విజయవంతమైన ‘యూరో కార్ట్’లను ఆంధ్రప్రదేశ్లోని చిరు వ్యాపారులకు పరిచయం చేయాలని సంకల్పించారు. -
తానా ఎన్నిక కథ సుఖాంతం.. కొత్త సభ్యుల ఎన్నికకు బోర్డు ఆమోదం
మార్చి 1 నుంచి కొత్త బోర్డు, పాలకవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరిస్తారని ప్రస్తుత తానా బోర్డు ఛైర్మన్ హనుమయ్య బండ్ల తెలిపారు. -
TANA: తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘అవధాన వైభవం’
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశంలో భాగంగా ఆదివారం నిర్వహించిన 65వ సాహిత్య సమావేశం ‘ అవధాన వైభవం.. నేటి అవధానుల నోట... నాటి మేటి అవధానుల సాహితీఝరి’ ఘనంగా జరిగింది. -
Dubai: భారతీయులకు దుబాయ్ ఆఫర్.. ఐదేళ్ల మల్టిపుల్ ఎంట్రీ పర్యటక వీసా..!
భారత్తో బంధాన్ని బలోపేతం చేసేందుకు వీలుగా ప్రత్యేక వీసా విధానాన్ని దుబాయ్ (Dubai) అమల్లోకి తెచ్చింది. -
ఆస్టిన్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు
ఆస్టిన్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ (TCA) 2024వ సంవత్సరానికి గాను నూతన కార్యవర్గం ఏర్పాటైంది. -
USA: భారత సంతతి ఇంజినీర్కు టెక్సాస్ అత్యున్నత అకడమిక్ అవార్డు
USA: ‘ఇమేజింగ్ సాంకేతికత’లో చేసిన పరిశోధనలకుగానూ భారత సంతతి ఇంజినీర్ అశోక్ వీరరాఘవన్కు అత్యున్నత అకడమిక్ అవార్డు లభించింది.
తాజా వార్తలు (Latest News)
-
IPL 2024: రోహిత్ శర్మ, సంజు శాంసన్ మధ్య కెప్టెన్సీలో పోలిక ఇదే: ధ్రువ్ జురెల్
-
TS News: తమిళిసై రాజీనామాకు ఆమోదం.. ఝార్ఖండ్ గవర్నర్కు అదనపు బాధ్యతలు
-
Liquor Policy Case: రూ.100కోట్ల చెల్లింపులపై ఈడీ ప్రకటన.. అక్రమంగా ఒక్క రూపాయీ లేదన్న ఆప్
-
POLL: రోహిత్ను కాదని హార్దిక్కు కెప్టెన్సీ... ముంబయి ఇండియన్స్ నిర్ణయం సరైనదేనా?
-
Modi: ‘మీవాళ్లు క్షేమంగా ఉన్నారు..త్వరలో తిరిగొస్తారు’: బల్గేరియా అధ్యక్షుడికి మోదీ రిప్లై
-
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...