USA: న్యూజెర్సీలో భాజపా ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు..
భారతీయ జనతా పార్టీ తెలంగాణ మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచంద్రరావు అమెరికాలోని న్యూజెర్సీలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు.
న్యూజెర్సీ: అమెరికాలోని న్యూజెర్సీలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావంలో భాజపా పాత్రను సమావేశానికి హాజరైన వారికి తెలియజేశారు. తెలంగాణ సాధించడంలో ప్రవాస భారతీయులు పోషించిన పాత్రను ఆయన కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంలోని భాజపా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఇతర దేశాల్లో ఉంటున్న తెలంగాణకు చెందిన ప్రతి వ్యక్తీ తమ గ్రామాల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తు సరఫరా, విద్యార్థులకు వసతి గృహాలు, బలహీన వర్గాల వారికి గృహాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడే బంగారు తెలంగాణ కల సాకారమవుతుందని రామచంద్రరావు అన్నారు. బంగారు తెలంగాణను సాధించడంలో ప్రవాసులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్-భాజపా (OFBJP) పూర్వ అధ్యక్షుడు కృష్ణారెడ్డి అనుగుల మాట్లాడుతూ.. భారత్లో ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధిని, తెలుగు రాష్ట్రాల్లో కేంద్రం చేస్తున్న కార్యక్రమాలను రామచంద్రరావు వివరించడం సంతోషకరమని అన్నారు. తెలంగాణ ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్-భాజపా కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల మాట్లాడుతూ.. ఓఎఫ్-భాజపా తరపున అమెరికా వ్యాప్తంగా 16 రాష్ట్రాలలో తెలంగాణ కమిటీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. త్వరలో మిగతా రాష్ట్రాలలో తెలంగాణ కమిటీలను ఓఎఫ్-భాజపా జాతీయ అధ్యక్షులు అడపా ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రకటిస్తామని తెలిపారు.
తెలంగాణ ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్-భాజపా వ్యూహాత్మక వ్యవహారాల కో-కన్వీనర్ సంతోష్, శ్రీకాంత్లు మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన 1200 మంది అమరులకు జోహార్లు అర్పిస్తూ సభలో రెండు నిమిషాలపాటు మౌనం పాటించాలని కోరారు. తెలంగాణ ఓఎఫ్-భాజపా న్యూ జెర్సీ ప్రాంతీయ కన్వీనర్ వంశీ యంజాల, కో-కన్వీనర్ ప్రదీప్ రెడ్డి కట్ట మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు అమెరికాలో నిర్వహించడం సంతోషకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి అనుగుల (ఓఎఫ్-భాజపా జాతీయ పూర్వ అధ్యక్షులు), విలాస్ రెడ్డి జంబుల (తెలంగాణ ఓఎఫ్-భాజపా కన్వీనర్), సంతోష్ రెడ్డి (తెలంగాణ ఓఎఫ్-భాజపా వ్యూహాత్మక వ్యవహారాలు కో-కన్వీనర్ ), శ్రీకాంత్ రెడ్డి తుమ్మల (తెలంగాణ ఓఎఫ్-భాజపా అనుసంధాన కో-కన్వీనర్), వంశీ యంజాల (తెలంగాణ ఓఎఫ్-భాజపా న్యూ జెర్సీ ప్రాంతీయ కన్వీనర్), ప్రదీప్ రెడ్డి కట్ట (తెలంగాణ ఓఎఫ్-భాజపా న్యూజెర్సీ ప్రాంతీయ కో-కన్వీనర్), మధుకర్ (తెలంగాణ ఓఎఫ్-భాజపా మీడియా కో-కన్వీనర్ ), తెలంగాణ ఓఎఫ్-భాజపా సీనియర్ కార్యకర్తలు గోపి సముద్రాల , కృష్ణ మోహన్ మూలే , రఘు కనుగో, కమ్యూనిటీ లీడర్స్ శరత్ వేముల, రఘువీర్ రెడ్డి, రామ్ వేముల, విజయ్ కుందూరు, గోవింద్ రాజ్, ఓంప్రకాష్ నక్క, హేమచందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్
-
భద్రాచలం తరహాలో అమెరికాలో రామాలయం
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు. -
సింగపుర్లో శ్రీ మారియంబికా ఆలయంలో ఘనంగా చండీహోమం
సింగపుర్లోని వాసవీ క్లబ్ మెర్లయన్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు అత్యంత పురాతన, విశిష్టమైన శ్రీ మారియంబికా ఆలయంలో చండీహోమం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు